అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వద్దు -ఇసుక ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎక్సైజ్, పరిశ్రమలు, వాణిజ్యం,గనుల శాఖలు టిఈఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మదనపల్లి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎక్సైజ్, పరిశ్రమలు, వాణిజ్యం గనుల శాఖల టి ఈ ఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ,మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లాలో ఐడీ లిక్కర్ కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలివచ్చే మద్యాన్ని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్ డి పి ఎల్ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్షలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్ లీజులు,నాన్-వర్కింగ్ లీజులు వాటి ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. నాన్-వర్కింగ్ లీజులు ఎందుకు ప్రారంభం కాలేదనే అంశాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో మైనింగ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, వర్కింగ్ లీజులు, నాన్-వర్కింగ్ లీజుల పరిస్థితి, ఖనిజ ఆదాయం, ఇసుక సరఫరా తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధరలు పెరగకుండా, ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇసుక ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్ఠాత్మకముగా వడ్డెర సహకార సంఘాలకు కొరకు భవన నిర్మాణ రాయి, రోడ్డు మెటల్, గ్రావెల్, స్లేట్, క్యూబ్స్, కర్బ్స్ వంటి ఖనిజాల క్వారీ లీజుల ప్రాధాన్యతలో భాగంగా , మైన్స్ అండ్ జియాలజి వారు వడ్డెర సహకార సంఘాల కొరకు 14 హెక్టార్ల భూమిని గుర్తించడం జరిగింది. భూముల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి అవసరమైన ఎన్ఓసీల మంజూరును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఖనిజాల ద్వారా లభిస్తున్న ఆదాయం, జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం వచ్చిన ఆదాయ మార్పులు, కొత్తగా జిల్లాలో చేరిన ప్రాంతాలకు కలుగుతున్న ప్రయోజనాలపై అధికారులు సమగ్ర వివరాలను సమావేశంలో వివరించారు. మైనింగ్ శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు, లీజులు, ఆదాయ వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, ప్రక్రియలను జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, కడప జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్,గనుల శాఖ ఏడి రంగ కుమార్, ఎక్సైజ్ ఏఈఎస్లు జోగేంద్ర, పద్మావతి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు,గనుల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వద్దు -ఇసుక ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎక్సైజ్, పరిశ్రమలు, వాణిజ్యం,గనుల శాఖలు టిఈఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మదనపల్లి, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతుల్లో జాప్యం వద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎక్సైజ్, పరిశ్రమలు, వాణిజ్యం గనుల శాఖల టి ఈ ఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ,మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ జిల్లాలో ఐడీ లిక్కర్ కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలివచ్చే మద్యాన్ని అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎన్ డి పి ఎల్ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మైనింగ్ శాఖ పనితీరుపై సమీక్షలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్ లీజులు,నాన్-వర్కింగ్ లీజులు వాటి ప్రస్తుత స్థితిని అధికారులు వివరించారు. నాన్-వర్కింగ్ లీజులు ఎందుకు ప్రారంభం కాలేదనే అంశాలపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలో మైనింగ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, వర్కింగ్ లీజులు, నాన్-వర్కింగ్ లీజుల పరిస్థితి, ఖనిజ ఆదాయం, ఇసుక సరఫరా తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. జిల్లాలో ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధరలు పెరగకుండా, ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇసుక ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్ఠాత్మకముగా వడ్డెర సహకార సంఘాలకు కొరకు భవన నిర్మాణ రాయి, రోడ్డు మెటల్, గ్రావెల్, స్లేట్, క్యూబ్స్, కర్బ్స్ వంటి ఖనిజాల క్వారీ లీజుల ప్రాధాన్యతలో భాగంగా , మైన్స్ అండ్ జియాలజి వారు వడ్డెర సహకార సంఘాల కొరకు 14 హెక్టార్ల భూమిని గుర్తించడం జరిగింది. భూముల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి అవసరమైన ఎన్ఓసీల మంజూరును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో ఖనిజాల ద్వారా లభిస్తున్న ఆదాయం, జిల్లా పునర్వ్యవస్థీకరణ అనంతరం వచ్చిన ఆదాయ మార్పులు, కొత్తగా జిల్లాలో చేరిన ప్రాంతాలకు కలుగుతున్న ప్రయోజనాలపై అధికారులు సమగ్ర వివరాలను సమావేశంలో వివరించారు. మైనింగ్ శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు, లీజులు, ఆదాయ వనరులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పారదర్శకంగా పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, ప్రక్రియలను జాప్యం లేకుండా పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ కళ్యాణి, కడప జిల్లా డిప్యూటీ కమిషనర్ జయరాజ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్,గనుల శాఖ ఏడి రంగ కుమార్, ఎక్సైజ్ ఏఈఎస్లు జోగేంద్ర, పద్మావతి, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు,గనుల శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి ఆలోచించాలని, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ముందుకు కదిలారు.1
- ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు: మున్సిపల్ కమిషనర్ ప్రొద్దుటూరు పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంపై కమిషనర్ విశ్వనాథ్ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. శానిటేషన్ విభాగం సిబ్బందితో కలిసి కమిషనర్ చేపలు, కోళ్లు, మాంసం దుకాణాలను తనిఖీ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే, క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే నిషేధిత సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ కవర్లు,కప్పులు, ఇతర ఉత్పత్తులను వ్యాపారులు స్వచ్ఛందంగా అప్పగించాలని ఆదేశించారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ముర్రుపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లికి వివరించాలి: డా. శ్రీగిరీష ప్రసవించిన అరగంటలోపు శిశువుకు ముర్రుపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని పీలేరు మండలం తలుపుల పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి డా. శ్రీగిరీష అన్నారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే పూర్తి పౌష్టికాహారమని తెలిపారు. తల్లిపాలు శిశువు ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపుతో పాటు మానసిక వికాసానికి కూడా దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి తల్లికి ముర్రుపాల ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు.1
- ఎల్లంపల్లి తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సమావేశం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఎల్లంపల్లి శ్రీ తిరుమలనాథస్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మైదుకూరు ఖండ పరిధిలోని ఖాజీపేట, చాపాడు, దువ్వూరు, బ్రహ్మంగారిమఠం మండలాల గ్రామ కమిటీ సభ్యులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ కడప జిల్లా సంయోజక్ శ్రీ తమిడేపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, దేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాజంలో సమరసత, సేవా కార్యక్రమాలు, ధార్మిక చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా సహ సంయోజక్ బుసిరెడ్డి నాగేశ్వర్ రెడ్డి, అనంతపురం కన్వీనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, మైదుకూరు మున్సిపాలిటీ కన్వీనర్ ఎం. వీరారెడ్డి తదితరులు పాల్గొని సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట డాక్యుమెంట్ రైటర్లు నిరసన అన్నమయ్య జిల్లా, పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరసన శుక్రవారం 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త విధానంతో తమ ఉపాధితో పాటు ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించి, సేవా కేంద్రాల ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరగోపాల్ పరిశీలించారు.ఈ తనిఖీలో ఆహారంలో శుభ్రత, పోషక విలువలు మరియు తల్లులకు అందుతున్న సేవలను ఆయన ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆహారంలో సుచి,శుభ్రత, నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులకు సూచించారు. ఏదైనా ఫిర్యాదు అందితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.3
- వైయస్ ఆనంద్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నివాళి పులివెందులలో వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి నిన్న మృతిచెందిన విషయం తెలిసిందే.ఆయన నివాసానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ చేరుకున్నారు. అనంతరం ఆయన మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.1