సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యం... - పిఠాపురం పీజీఆర్ఎస్లో నాలుగు వారాల్లో 375 అర్జీలు.. - జిల్లా కలెక్టర్ ఎం. ఎన్ హరేంధిర ప్రసాద్ - ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు వారాలుగా నిర్వహించిన ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంలో స్వీకరించిన మొత్తం 375 అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడా కార్యాలయంలో నిర్వహించిన నాలుగో విడత పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ప్రతి నెల ఒక నియోజకవర్గంలో నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలో నాలుగు వారాల్లో మొత్తం 375 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీల్లో ప్రధానంగా మున్సిపల్ సమస్యలు, భూ వివాదాలు, రీ-సర్వే అంశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అన్ని అర్జీలను నిరంతరం సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం గత మూడు వారాల్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐలు), ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభుత్వ సేవల నాణ్యతపై ప్రతి శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు,గ్రామాలు-పట్టణాల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ తదితర సేవలను మరింత సమర్థవంతంగా అందించి ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెంపొందేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తహశీల్దార్ గోపాలకృష్ణ, గొల్లప్రోలు కమిషనర్ దివిజా సంపతి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు శాశ్వత పరిష్కారమే లక్ష్యం... - పిఠాపురం పీజీఆర్ఎస్లో నాలుగు వారాల్లో 375 అర్జీలు.. - జిల్లా కలెక్టర్ ఎం. ఎన్ హరేంధిర ప్రసాద్ - ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు వారాలుగా నిర్వహించిన ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంలో స్వీకరించిన మొత్తం 375 అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడా కార్యాలయంలో నిర్వహించిన నాలుగో విడత పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ప్రతి నెల ఒక నియోజకవర్గంలో నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిఠాపురంలో నాలుగు వారాల్లో మొత్తం 375 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీల్లో ప్రధానంగా మున్సిపల్ సమస్యలు, భూ వివాదాలు, రీ-సర్వే అంశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్న కలెక్టర్, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు న్యాయం జరిగేలా గడువులోగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. అన్ని అర్జీలను నిరంతరం సమీక్షిస్తూ త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం గత మూడు వారాల్లో వచ్చిన అర్జీల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐలు), ప్రజాభిప్రాయ సేకరణ, ప్రభుత్వ సేవల నాణ్యతపై ప్రతి శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు,గ్రామాలు-పట్టణాల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, రేషన్ కార్డుల పంపిణీ తదితర సేవలను మరింత సమర్థవంతంగా అందించి ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల అభిప్రాయం పెంపొందేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం తహశీల్దార్ గోపాలకృష్ణ, గొల్లప్రోలు కమిషనర్ దివిజా సంపతి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- వికలాంగులకు వీల్చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్ఐ వెంకటేష్ అభినందించారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.1