Shuru
Apke Nagar Ki App…
*గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి* శ్రీకాకుళం,డిశంబరు,19: విజయవాడ లోక్ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, హోం, అత్యవసర, విపత్తులు, సైనిక సంక్షేమ శాఖామాత్యులు వంగలపూడి అనిత చేతుల మీదుగా వీరనారీమణులకు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళిలకు వారి ఉత్తమ సేవలకు అభినందనలు తెలుపుతూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ వి. వెంకటరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్ కెప్టెన్ సత్యప్రసాద్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్, తదితరులు పాల్గొన్నారు.
Dr.Gangu Manmadharao
*గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు అందుకుంటున్న జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళి* శ్రీకాకుళం,డిశంబరు,19: విజయవాడ లోక్ భవన్ లో శుక్రవారం ఏర్పాటుచేసిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్, హోం, అత్యవసర, విపత్తులు, సైనిక సంక్షేమ శాఖామాత్యులు వంగలపూడి అనిత చేతుల మీదుగా వీరనారీమణులకు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజ, టైపిస్ట్ మురళిలకు వారి ఉత్తమ సేవలకు అభినందనలు తెలుపుతూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ వి. వెంకటరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్ కెప్టెన్ సత్యప్రసాద్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్, తదితరులు పాల్గొన్నారు.
More news from Tirupati and nearby areas
- Post by Omnamashivaya S1
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1