ఆళ్ల నాని మృతి పట్ల తాడేపల్లిగూడెం వైసిపి ఇన్చార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు సంతాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఏలూరు ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. ఆళ్ల నాని మరణవార్త ఎంతో బాధాకరమని, రాజకీయంగా ఆయనతో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన మృదుస్వభావం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆళ్ల నాని ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, వైద్య రంగానికి సంబంధించిన అంశాల్లో ఆయన తనదైన బాధ్యతను నిర్వర్తించారని గుర్తుచేశారు. ఆళ్ల నాని ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, అనుచరులకు తీరని లోటని వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. ఈ విషాద సమయంలో ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు
ఆళ్ల నాని మృతి పట్ల తాడేపల్లిగూడెం వైసిపి ఇన్చార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు సంతాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఏలూరు ప్రాంత సీనియర్ రాజకీయ నాయకులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జి వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. ఆళ్ల నాని మరణవార్త ఎంతో బాధాకరమని, రాజకీయంగా ఆయనతో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా ఆయనతో ఉన్న అనుబంధం, ఆయన మృదుస్వభావం, ప్రజలతో కలిసిమెలిసి ఉండే తీరు ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపారు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగిన ఆళ్ల నాని ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, వైద్య రంగానికి సంబంధించిన అంశాల్లో ఆయన తనదైన బాధ్యతను నిర్వర్తించారని గుర్తుచేశారు. ఆళ్ల నాని ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు, అనుచరులకు తీరని లోటని వడ్డి రఘురామ్ నాయుడు అన్నారు. ఈ విషాద సమయంలో ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆళ్ల నాని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు
- నడవలేని వృద్ధుడుకి వీల్ సైకిల్ బహుకరించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ సహకారంతో గంటా శేషగిరిరావు కి వీల్ సైకిల్ అందజేశారు. వృద్ధాప్యంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధునికి ఎమ్మెల్యే మంచి మనసుతో స్పందించి ఘంటా శేషగిరి రావుకి వీల్ సైకిల్ ను బహుకరించారు. అవసరమైన వారికి అండగా నిలిచి, వారి అవసరాలకు అనుగుణంగా సహాయం అందించడమే లక్ష్యంగా ఈ సహాయ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు అవసరమైన సమయంలో తమ వంతు సహాయాన్ని అందిస్తూ, సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. సేవలోనే సంతృప్తి.. సహాయం చేయడం లోనే ఆనందం ఉందన్నారు2
- ఫ్లెక్సీ చింతివేతపై వైసిపి శ్రేణులు ఆందోళన.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాయకులు తాడేపల్లిగూడెం పాతూరులో వైసీపీ నాయకుడు వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చించి వేశారు. దీంతో వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని వైసీపీ పట్టణాధ్యక్షుడు గొర్రెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిందితులపై చర్య తీసుకోవాలని కోరుతూ పట్టణ ఎస్సై వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. నాయకులు సూర్యచంద్రరావు పాల్గొన్నారు.1
- పెనుగొండలో ఉధృతమైన వీఆర్ఏల సమ్మె న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు బుధవారం పెనుగొండలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.గాంధీ బొమ్మల రోడ్డులోని కచేరి సెంటర్ వద్ద నరసాపురం డివిజన్ వీఆర్ఏల అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు కీలకంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.తమ సమస్యలపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో సహాయ నిరాకరణకు దిగాల్సి వచ్చిందన్నారు.డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వీఆర్ఏలకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ఏళ్లుగా నామిని వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్టైమ్ సెటిల్మెంట్ విధానంలో వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్ఓ,అటెండర్,నైట్వాచ్మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల వీఆర్ఏలు,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- చించినాడ గ్రామంలో.. విద్యార్థులకు సైకిల్ పంపిణీ అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు1
- రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం *శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్నదాన (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం* జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామం లో కృష్ణాష్టమి సందర్భంగా18వ శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు భారీ సంఖ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుని గుడి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు నుండి భక్తులు,భారీ సంఖ్యలో వస్తారని అలాగే వచ్చిన వారికి కమిటీ ఆధ్వర్యంలో తగిన సౌకర్యాలు,జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరము లాగ కమిటీ పెద్దలు పర్యవేక్షణలో యూత్ కూడా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని జయంతి మొదటి రోజు నుండి చివరగా స్వామివారి అన్నదాన(అన్న ప్రసాద వితరణ) కార్యక్రమం జరిగేంతవరకు ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని యాదవ సంఘం కమిటీ పెద్దలు తెలియజేశారు శ్రీ స్వామి వివేకానంద స్కూల్ అధినేత ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. యాదవులు అంటే ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం యాదవులకె కల్పించారని, అలాగే ఈ ఊర్లో యాదవులలో సర్పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారని, యువత బాగా చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు పొందాలని అయన కోరారు3
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- మీ ఎముకలు అత్యంత వహిస్తే, గుల్లగా తయారవుతాయి. అరిగిపోతాయి జాగ్రత్త వహించండి.. ఇప్పటి నుండే మంచి ఆహారం తీసుకోండి1