Shuru
Apke Nagar Ki App…
*ఎమ్మెల్యే వసంతం కృష్ణ ప్రసాద్ కు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవ ఆహ్వానం* ఇబ్రహీంపట్నం, కొండపల్లి పట్టణంలోని బి కాలనీ వద్దగల శ్రీ షిరిడి సాయి బాబా మందిరం ప్రజల వార్షికోత్సవం ఏప్రిల్ 13 అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు గుడి కమిటీ సభ్యులు. ఆయన స్వగృహంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నానని,తిరిగి వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషకరమని, తప్పకుండా హాజరవుతారని ఎమ్మెల్యే సభ్యులకు తెలిపారు. కౌన్సిలర్ అడప వెంకయ్య, గుడి ధర్మకర్త పామర్తి రాంబాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వేముల నాగరాజు
*ఎమ్మెల్యే వసంతం కృష్ణ ప్రసాద్ కు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వార్షికోత్సవ ఆహ్వానం* ఇబ్రహీంపట్నం, కొండపల్లి పట్టణంలోని బి కాలనీ వద్దగల శ్రీ షిరిడి సాయి బాబా మందిరం ప్రజల వార్షికోత్సవం ఏప్రిల్ 13 అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు ఆహ్వాన పత్రిక అందజేశారు గుడి కమిటీ సభ్యులు. ఆయన స్వగృహంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు. గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నానని,తిరిగి వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషకరమని, తప్పకుండా హాజరవుతారని ఎమ్మెల్యే సభ్యులకు తెలిపారు. కౌన్సిలర్ అడప వెంకయ్య, గుడి ధర్మకర్త పామర్తి రాంబాబు, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- దారుణం.. కుటుంబమంతా ఆత్మహత్య నరసరావుపేటలో ఫ్యామిలీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భోపాల్ ఎయిమ్స్ లో వైద్యుడిగా పనిచేస్తున్న సాతులూరుకు చెందిన గోపి, తన కుటుంబంతో సహా నరసరావుపేటలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి 3 ఏళ్ల చిన్నారి బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. తల్లీకూతుళ్లు నిన్న మృతి చెందగా, గోపి నేడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.1
- . సోషల్ మీడియా ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు, కుటుంబాలపై దాడులు, ఫేక్ న్యూస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చట్టం అవసరం, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి మరింత బలోపేతం చేయాలని కోరుతున్నాం. మట్టా రాగమయి దయానంద్ ఎమ్మెల్యే, సత్తుపల్లి.1
- Post by Syyed taher1
- సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిస్కారం కోరుతూ వర్కర్స్ యూనియన్ చేపట్టిన సింగరేణి హెడ్డాఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు, హెడ్డాఫీసు చేరుకొని ప్రధాన ద్వారం ఎదుట బైటాయించి ధర్నా చేశారు. పొర్లు దండాలతో విన్నూత రీతీలో నిరసన వ్యక్తం చేశారు. మూడు గంటలపాటు ధర్నా చేపట్టడంతో పోలీసులు అడ్డుకోవడంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకోవడంతో హెడ్డాఫీసు ఏరియా ఉద్రిక్తంగా మారింది. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషాతోపాటు యూనియన్ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ తదితరులను పోలీసులు నిర్బంధించి 1 టౌన్ పోలీస్ స్టేషన్'కు తరలించారు.2
- శాసనమండలి శాసనసభ సభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా హైదరాబాదులో జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నా అభినయంతో ఆటపాటలతో ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు పాటకు శోభన్ బాబును అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఎమ్మెల్యే స్టెప్పులను చూసిన ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో దడువాయిలకు పని కల్పించాలని కోరుతూ చేపట్టిన మహాధర్నా 19వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మహాధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి దడువాయిలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చాలా రోజులుగా కొనసాగుతున్న ఈ పోరాటానికి సరైన పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ మహాధర్నాలో ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్నతో పాటు సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకారులు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.3
- నల్గొండ: నల్గొండ ఆర్టీసీ బస్టాండు నుంచి పెద్ద గడియారం వెళ్లే మార్గంలో సుభాష్ చౌరస్తా వద్ద రోడ్డు గుంతల మయంగా మారింది. ముఖ్యంగా మూలమలుపు వద్ద గుంతలు పెద్దగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.1
- Post by Ramprasad islavath1