ముంపు ప్రాంతాలను సందర్శించిన చింతూరు మండల టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్. చింతూరు, జూలై 31: పోలవరం జిల్లా చింతూరు మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపుకు గురవుతున్న ప్రాంతాలను చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. చింతూరు–ముకునూరు మధ్య ఉన్న సోకులేరు వంతెన వరద నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితిని ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతూరు మండలంలోని 11 గ్రామాలు, వి.ఆర్.పురం మండలంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు ఎవరూ నీటిలోకి వెళ్లకూడదని, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత అధికారులు ముంపు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO అర్జున్,MPDO శ్రీనివాస్ దొర, VRO రామచంద్రం,మోహన్ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సల్మాన్ రాజు,తమ్మయ్య పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాలను సందర్శించిన చింతూరు మండల టీడీపీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్. చింతూరు, జూలై 31: పోలవరం జిల్లా చింతూరు మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపుకు గురవుతున్న ప్రాంతాలను చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. చింతూరు–ముకునూరు మధ్య ఉన్న సోకులేరు వంతెన వరద నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితిని ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చింతూరు మండలంలోని 11 గ్రామాలు, వి.ఆర్.పురం మండలంలోని 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉద్ధృతి తగ్గే వరకు ఎవరూ నీటిలోకి వెళ్లకూడదని, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత అధికారులు ముంపు ప్రాంతాలపై నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MRO అర్జున్,MPDO శ్రీనివాస్ దొర, VRO రామచంద్రం,మోహన్ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సల్మాన్ రాజు,తమ్మయ్య పాల్గొన్నారు.
- పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు * వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్ఎస్ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్1
- పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్వాటర్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.1