12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం మండపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు మండపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) మండపేట నియోజకవర్గం లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని తోట పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, పట్టణ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు శుభ్రం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయం 10.00 గంటలకు కార్యక్రమం నిర్వహించబడును.
12న వైఎస్ఆర్సిపి 15వ ఆవిర్భావ దినోత్సవం మండపేట నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపు మండపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ నెల 12న (గురువారం) మండపేట నియోజకవర్గం లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గడిచిన 15 ఏళ్లలో పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించిందని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చెరగని ముద్ర వేసిందని తోట పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పోరాటం చేస్తోందని వివరించారు. ఈ తరుణంలో ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలన్నారు. ప్రతి గ్రామం, వార్డు, పట్టణ, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలను పెద్ద ఎత్తున ఎగురవేయాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు శుభ్రం చేసి, పూలమాలలతో ఘనంగా నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉదయం 10.00 గంటలకు కార్యక్రమం నిర్వహించబడును.
- 🙏😭1
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- Post by V Ramarao1
- Post by Sageni gangadhar1
- 🙏😭1