logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కృష్ణా జిల్లా మచిలీపట్నం విజయవాడ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ తమ్మన పిచ్చయ్య గారి ధర్మ సత్రం (అపర కర్మల సత్రం) అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భూగర్భగనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ చైర్మన్‌గా దేసు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మంది సభ్యులచే మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా వెంకటప్రసాద్, గొర్రిపాటి గోపీచంద్, ఇమడా బత్తుల దిలీప్ కుమార్, మామిడి మురళీకృష్ణ, జనసేన నాయకుడు గడ్డం రాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మంచిని కాపాడుకోవడం కోసం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పాటైన ఈ అభివృద్ధి కమిటీ ఆదర్శవంతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.

2 hrs ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
fa39c932-4502-4a84-8661-7c02de78e0d1

కృష్ణా జిల్లా మచిలీపట్నం విజయవాడ రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ తమ్మన పిచ్చయ్య గారి ధర్మ సత్రం (అపర కర్మల సత్రం) అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భూగర్భగనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి

39d502bb-19ec-45c4-8a21-e9b7a35889df

కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన కమిటీ చైర్మన్‌గా దేసు వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మరో ఎనిమిది మంది సభ్యులచే మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా వెంకటప్రసాద్, గొర్రిపాటి గోపీచంద్, ఇమడా బత్తుల

7530defa-22b3-41dc-bd39-a6759de6bcda

దిలీప్ కుమార్, మామిడి మురళీకృష్ణ, జనసేన నాయకుడు గడ్డం రాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మంచిని కాపాడుకోవడం కోసం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పాటైన ఈ అభివృద్ధి కమిటీ ఆదర్శవంతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు. తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    1
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలో గల లంక సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. నియోజకవర్గంలోనే అత్యంత పెద్దదైన ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నీళ్లు రావడంతో ఈ ప్రాంత రైతాంగం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వానలు పడకపోవడంతో ఖరీఫ్ సీజన్‌పై ఆందోళన చెందుతున్న రైతులకు ఈ గోదావరి జలాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇంతవరకు వరి నాట్లు వేయలేకపోయిన ఈ ప్రాంత రైతులు, ఇప్పుడు లంక సాగర్ ప్రాజెక్టుకు నీరు చేరడంతో నాట్ల పనుల్లో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే వైరా ప్రాజెక్టు పరిధిలోని రైతులు వరి నాట్లు ప్రారంభించగా, ఇప్పుడు ఇక్కడి రైతులు కూడా పనులకు సిద్ధమవుతున్నారు. ఈ గోదావరి జలాలు తమ జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని రైతులు భావిస్తున్నారు.

తమ పంట పొలాలను కాపాడుతున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ ప్రాంత రైతులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు. ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    1
    భారతీయ సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటు మిగులుస్తూ, దక్షిణ భారత సినీ సంగీతంలో తన అపూర్వ గానంతో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ, 88 ఏళ్ల వయసులో మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు.

ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో 20కు పైగా భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించి, కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రయాణంలో ఆమె నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఎస్. జానకి మృతితో భారతీయ సంగీత రంగం ఓ మహోన్నత గాన స్వరాన్ని కోల్పోయిందని సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. గానకోకిలగా చిరస్మరణీయమైన ఎస్. జానకి గారి గానం ఎప్పటికీ సంగీత ప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటుందని కొనియాడుతున్నారు.
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    10 hrs ago
  • గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    1
    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల అభివృద్ధి పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా ఆరోపించారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పరిశ్రమల స్థాపన నెపంతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు స్పష్టంగా గుర్తించారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ, స్థానిక యువతకు ఉద్యోగాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఉపాధి సృష్టించడం మరియు ప్రాంతీయ సమతుల్యతను కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    21 hrs ago
  • అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఒక బావిలో చిక్కుకున్న భారీ రాజనాగును (కింగ్ కోబ్రా) అటవీ శాఖకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (RRR) బృందం విజయవంతంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన "హనుమాన్" (HANUMAN) కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. గంగవరం గ్రామానికి చెందిన గ్రామస్తుడు శ్రీ రమేష్ తమ ఊరి బావిలో పెద్ద పాము పడి ఉండటాన్ని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో ఈ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జీనబాడు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, RRR బృంద నాయకుడు శ్రీ ఆర్. రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ పి. శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పి. సాయి ప్రణీత్, ప్రొటెక్షన్ వాచర్లు సత్యనారాయణ, అచ్చిబాబు పాల్గొన్నారు. అటవీ శాఖతో పాటు శ్రీ మూర్తి కంటిమహంతి నేతృత్వంలోని ఈజీడబ్ల్యూఎస్ (EGWS) స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృష్ణ, ప్రసాద్ సాంకేతిక సహకారం అందించారు. మొదట పొడవైన వెదురు కర్రకు హుక్ కట్టి పామును రంధ్రం నుండి బయటకు లాగి, ఆపై హ్యాండ్ హెల్డ్ హుక్, పొడవైన సరుగుడు కర్ర సహాయంతో బావి నుండి సురక్షితంగా పైకి తీశారు. ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పామును పైప్-బ్యాగ్‌లోకి ప్రవేశపెట్టి భద్రపరిచారు. అనంతరం ఈ రాజనాగును జీనాబాడు బీట్ పరిధిలోని సంకరం రిజర్వ్ ఫారెస్ట్ (RL) లో అడవిలోకి వదిలిపెట్టారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తుడు శ్రీ రమేష్ చూపిన అప్రమత్తత, ఆర్‌ఆర్‌ఆర్ బృందం నైపుణ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఈ అరుదైన జీవి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు, అటవీ శాఖ, ఎన్జీవోలు కలిసి పనిచేస్తే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని ఈ సంఘటన నిరూపించింది.
    4
    అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఒక బావిలో చిక్కుకున్న భారీ రాజనాగును (కింగ్ కోబ్రా) అటవీ శాఖకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (RRR) బృందం విజయవంతంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన "హనుమాన్" (HANUMAN) కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. గంగవరం గ్రామానికి చెందిన గ్రామస్తుడు శ్రీ రమేష్ తమ ఊరి బావిలో పెద్ద పాము పడి ఉండటాన్ని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో ఈ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే జీనబాడు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, RRR బృంద నాయకుడు శ్రీ ఆర్. రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ పి. శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పి. సాయి ప్రణీత్, ప్రొటెక్షన్ వాచర్లు సత్యనారాయణ, అచ్చిబాబు పాల్గొన్నారు. అటవీ శాఖతో పాటు శ్రీ మూర్తి కంటిమహంతి నేతృత్వంలోని ఈజీడబ్ల్యూఎస్ (EGWS) స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృష్ణ, ప్రసాద్ సాంకేతిక సహకారం అందించారు. మొదట పొడవైన వెదురు కర్రకు హుక్ కట్టి పామును రంధ్రం నుండి బయటకు లాగి, ఆపై హ్యాండ్ హెల్డ్ హుక్, పొడవైన సరుగుడు కర్ర సహాయంతో బావి నుండి సురక్షితంగా పైకి తీశారు. ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పామును పైప్-బ్యాగ్‌లోకి ప్రవేశపెట్టి భద్రపరిచారు. అనంతరం ఈ రాజనాగును జీనాబాడు బీట్ పరిధిలోని సంకరం రిజర్వ్ ఫారెస్ట్ (RL) లో అడవిలోకి వదిలిపెట్టారు.

ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తుడు శ్రీ రమేష్ చూపిన అప్రమత్తత, ఆర్‌ఆర్‌ఆర్ బృందం నైపుణ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఈ అరుదైన జీవి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు, అటవీ శాఖ, ఎన్జీవోలు కలిసి పనిచేస్తే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని ఈ సంఘటన నిరూపించింది.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • Post by Adimlamganash
    1
    Post by Adimlamganash
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    9 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    4
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.