సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం : ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధి అయినటువంటి హిల్ రోడ్ సమీపంలో ఉన్న నేతాజీ క్లబ్ నందు ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం సిపిఐ ఆత్మకూరు టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వినోదిని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగేంద్ర సాయి మాట్లాడుతూ 1925 నుంచి 2026 వరకు 101 ఏళ్ళ ఉద్యమ స్థానంలో ఎన్నో ముళ్లదారులు దాటుకొని, ఎర్ర పూల వనాలను ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పేదల కళను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయాలని, ఐదు లక్షలు మంజూరు చేసే వరకు వాళ్ళ ఇంటి బాడుగల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర సమితి సభ్యులు వినోధిని,సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల, బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించేందుకు, జనగణనలో,కుల గణన చేపట్టాలని కార్మిక,ఉద్యోగ కర్షక చట్టాలు, యువత ఉద్యోగ,ఉపాధ్యాయ అవకాశాల కోసం అనేక త్యాగాలను ఉద్యమాలను చేస్తూ వస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి టీ.శీనయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్. ఉమా,సోఫియా,ఇండ్ల అంకమ్మ, సి.పి ఐ ఆత్మకూరు మున్సిపల్ సభ్యులు బెల్లంకొండ హాజరత్తయ్య, చెంచయ్య మాలకొండయ్య,వాసు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం : ఆత్మకూర్ మున్సిపాలిటీ పరిధి అయినటువంటి హిల్ రోడ్ సమీపంలో ఉన్న నేతాజీ క్లబ్ నందు ఆత్మకూరు నియోజవర్గ జనరల్ బాడీ సమావేశం సిపిఐ ఆత్మకూరు టౌన్ కార్యదర్శి జంగం నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వినోదిని, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యామాల మధు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి నాగేంద్ర సాయి మాట్లాడుతూ 1925 నుంచి 2026 వరకు 101 ఏళ్ళ ఉద్యమ స్థానంలో ఎన్నో ముళ్లదారులు దాటుకొని, ఎర్ర పూల వనాలను ఏర్పాటు చేసుకున్న పార్టీ సిపిఐ అని ఆయన కొనియాడారు. పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ మీద ఒత్తిడి తీసుకొచ్చి, పేదల కళను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేయాలని, ఐదు లక్షలు మంజూరు చేసే వరకు వాళ్ళ ఇంటి బాడుగల మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం రాష్ట్ర సమితి సభ్యులు వినోధిని,సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ సిపిఐ పార్టీ పేదల, బడుగు, బలహీన వర్గాల పట్ల ప్రజలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం సాధించేందుకు, జనగణనలో,కుల గణన చేపట్టాలని కార్మిక,ఉద్యోగ కర్షక చట్టాలు, యువత ఉద్యోగ,ఉపాధ్యాయ అవకాశాల కోసం అనేక త్యాగాలను ఉద్యమాలను చేస్తూ వస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి టీ.శీనయ్య సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్. ఉమా,సోఫియా,ఇండ్ల అంకమ్మ, సి.పి ఐ ఆత్మకూరు మున్సిపల్ సభ్యులు బెల్లంకొండ హాజరత్తయ్య, చెంచయ్య మాలకొండయ్య,వాసు తదితరులు పాల్గొన్నారు.
- 💐✌️తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐2
- ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి అధికారులు దృష్టికి వెళ్లే వరకు షేర్ చేయండి అప్పుడు మన బాధలు అర్థమవుతాయి1
- వైయస్ఆర్సీపీ మీడియా వ్యవహారాలు చూస్తున్న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారి అరె*స్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం దుర్మా*ర్గంగా వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఈ అ*రెస్ట్ సాక్ష్యం రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకు లేదా? -వరుదు కళ్యాణి గారు, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ.....1
- ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ డిమాండ్ చేశారు. బండి ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద కూలీలు, మేటీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీ రూ. 600 చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని కోరారు. పెండింగ్ నిధులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- జలధార జల హారతి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ నిశాంత్ కుమార్ మండలంలో జరుగుతున్న జలధార జలహారతి పనులను వేగవంతం చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జలధర జలహారతి కార్యక్రమం లో భాగంగా చేపట్టిన వందరోజుల పనుల ప్రగతిపై మండల అధికారులతో సమీక్షించారు అనంతరం మండలంలోని దిగువపల్లి కాకతి పంచాయతీలలో చెరువులను సప్లై చానల్స్ లను పర్యవేక్షించారు అదేవిధంగా మండలంలో భూ సమస్యల పరిష్కారం పై చెరువుల వద్ద రైతులతో ఆయన మాట్లాడారు చెరువుకు అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న కట్టను తొలగించాలని రైతుల అభ్యర్థనపై స్పందిస్తూ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ పార్వతి ఎంపీడీవో లీలా మాధవి పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ మండలంలోని అధికారులు పాల్గొన్నారు4
- చిత్తూరు జిల్లా,పలమనేరు అగ్నిమాపక కేంద్రం ఏప్రిల్ 15 తేదీన అగ్నిమాపక వారాఛవాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు రిలయన్స్ మార్ట్ నందు Awareness and mock drill నిర్వహించడమైనది. ఈ ఏడాది నినాదం: "సురక్షిత పాఠశాలలు, సురక్షితమైన ఆసుపత్రులు మరియు అగ్ని మాపక భద్రతపై స్పృహ ఉన్న సమాజం మంటలను నివారించడానికి కలిసి పనిచేస్తాయి."వారోత్సవాల కార్యక్రమ ప్రణాళిక లో భాగంగా 2 వ రోజు పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ నందు మరియు Reliance S-mart నందు mock drill and awareness programme లలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల యందు ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం మరియు ఆస్తిరక్షణ చేసుకోవడం గురించి తెలియపరచడమైనది మరియు ప్రజలలో అగ్ని ప్రమాదాల గూర్చి అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ పి మనోగరన్, అగ్నిమాపక కేంద్రాధికారి వారు, సుమన్, లీడింగ్ ఫైర్ మాన్, మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- Post by Bondhu Suresh1
- ✒️- ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో తండ్రి చేత తిట్లు తినడంతో, 9వ తరగతి బాలుడు రాత్రికి రాత్రే నంద్యాలకు 100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించిన ఘటనను ఈ చిత్రం తెలియజేస్తుంది. ఆ అబ్బాయి చివరకు నంద్యాల నుంచి రాయచూర్కు రైలు ఎక్కాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అతడిని గుర్తించి రక్షించారు. ఈ సంఘటన యువతరం సున్నితత్వంపై ఆందోళనను రేకెత్తించింది••£1
- ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత మొట్టమొదటి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం సంతోషంగా ఉంది. విజ్ఞానమే సామాజిక ప్రగతికి చిహ్నం అని చెప్పిన అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని అమరావతిలో క్వాంటం చరిత్రను ప్రారంభించుకున్నాం. #QuantumRevolutionInAP #AmaravatiQuantumValley1