logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అదృశ్యం కేసు హత్యగా మారింది -గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 3 ప్రజా తెలంగాణ న్యూస్ ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుల్ల నెహ్రూ (వయసు 35) జూలై 28వ తేదీ ఉదయం ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ములుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు ములుగు ఎస్ఐ విజయ్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, కేసు పరిశోధనలో భాగంగా ప్రాధమిక దర్యాప్తులో సీసీటీవీలు, నూతన సాంకేతిక విధానం ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్, మజిద్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. హత్యకు దారితీసిన పరిస్థితులు (వివరాలు): ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్ మేజిద్‌పల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి 2011లో పిడిచేడ్ గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఒకరు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతూ ఉండగా, అక్కడ PET (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పనిచేస్తున్న నిషా రాణితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం తరచూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సాగి, తరువాత వివాహేతర సంబంధంగా మారింది. నిషారాణి కూడా వివాహితురాలే. 2019లో మహేష్‌కు ములుగు ఐకేపీ సెంటర్లో పనిచేసే తిగుల్ల నెహ్రూతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మరియు చిట్ ఫండ్ లావాదేవీల్లో పాల్గొంటూ, వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు. నెహ్రు కి కొంత మంది మహిళల తో వివాహేతర సంబందాలు ఉన్న విషయం కూడా మహేష్ కు తెలియడం వలన మహేష్ అసూయ పెంచుకొన్నాడు అయితే, ఇటీవల చిట్ ఫండ్ కమీషన్ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ అనేకసార్లు కమీషన్ మొత్తాన్ని తన ఒంటరిగా తీసుకోవడం, నిషారాణిపై అసభ్యంగా మాట్లాడడం, ఆమెతో శారీరక సంబంధం కోరినట్టు వ్యాఖ్యలు చేయడం వల్ల మహేష్ తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. 2025 జూలై 28న నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మహేష్ తీసుకొని మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ – వర్గల్ బ్రాంచ్ వద్ద ₹58,600 రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును చిట్ ఫండ్ బాకీల కోసం వినియోగించనున్నట్టు ఆమెకు చెప్పినా ఆమె నమ్మలేదు. అందుకే, నెహ్రూను హామీదారుగా తీసుకురావాలని ఆమె చెప్పింది. ములుగు వద్ద నెహ్రూను కారులో తీసుకుని వెళ్లి నిషారాణి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నెహ్రూ మళ్ళీ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో, మహేష్ కోపంతో అతన్ని గుద్దడంతో ఆయన అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే, ఇంట్లో ఉన్న వైర్‌తో బిగించి గొంతునులిమి హత్య చేశాడు. శవాన్ని కారులో ఉంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం, నిషారాణికి విషయం తెలియజేసి, ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో మృతదేహాన్ని దాచేందుకు గగ్గిళ్లాపూర్ గ్రామానికి వెళ్లాడు. మొదట మృతదేహాన్ని పొలాల్లో దాచి, తర్వాత సరైన వాహనం లభించిన తరువాత, మృతదేహాన్ని రాళ్లతో కట్టి చెరువులో పడేశాడు. ఉబ్బని వినయ్ అనే వ్యక్తి, నెహ్రూ ఫోన్ నుండి ఆయన భార్యకు ఫేక్ కాల్ చేసి “అన్న రాడు, రేపు వస్తాడు” అని చెప్పాడు. నిందితుడు మహేష్, నెహ్రూ భార్యకు ₹15,000 చిట్ ఫండ్ డబ్బును ఇచ్చి అతను బాగానే ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం, మహేష్, నెహ్రూ యొక్క మొబైల్‌ను ములుగు కొండపోచమ్మ కెనాల్ పడేసి ట్రేస్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. స్వయంగా పోలీసులకు మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, చూపించాడు. దర్యాప్తులో రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక TVS ఎక్సెల్ మోటార్ బైకు, మైక్రో ఫైనాన్స్ లోపడ్డ బంగారు రుణపు రసీదు (Inventory No: IN40930700001754 – ₹58,600), నిషారాణి ఇంటి వివరాలు, నెహ్రూ మొబైల్ కాల్ ట్రేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు స్వయంగా మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, వాహనాల వివరాలను పోలీసులకు చూపించాడు. ప్రధాన నిందితుడు 1 గామిలీపురం మహేష్, 2 సహ నిందితులు నిషారాణి, 3 ఉబ్బని వినయ్, 4 నారదాసు కొమురయ్య నలుగురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.

on 3 August
user_Gousuddin Md
Gousuddin Md
Reporter Hyderabad•
on 3 August

అదృశ్యం కేసు హత్యగా మారింది -గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఆగస్టు 3 ప్రజా తెలంగాణ న్యూస్ ములుగు గ్రామానికి చెందిన ఐకేపీ ఉద్యోగి తిగుల్ల నెహ్రూ (వయసు 35) జూలై 28వ తేదీ ఉదయం ఐకేపీ కార్యాలయానికి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ములుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు ములుగు ఎస్ఐ విజయ్, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, కేసు పరిశోధనలో భాగంగా ప్రాధమిక దర్యాప్తులో సీసీటీవీలు, నూతన సాంకేతిక విధానం ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్, మజిద్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు. హత్యకు దారితీసిన పరిస్థితులు (వివరాలు): ప్రధాన నిందితుడు గామిలీపురం మహేష్ మేజిద్‌పల్లి గ్రామంలో నివసిస్తున్నాడు. ఇతనికి 2011లో పిడిచేడ్ గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో

be85a9ba-cbfc-40df-9c78-49b40b7bed19

ఒకరు కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతూ ఉండగా, అక్కడ PET (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పనిచేస్తున్న నిషా రాణితో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పరిచయం తరచూ ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా సాగి, తరువాత వివాహేతర సంబంధంగా మారింది. నిషారాణి కూడా వివాహితురాలే. 2019లో మహేష్‌కు ములుగు ఐకేపీ సెంటర్లో పనిచేసే తిగుల్ల నెహ్రూతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి మరియు చిట్ ఫండ్ లావాదేవీల్లో పాల్గొంటూ, వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు. నెహ్రు కి కొంత మంది మహిళల తో వివాహేతర సంబందాలు ఉన్న విషయం కూడా మహేష్ కు తెలియడం వలన మహేష్ అసూయ పెంచుకొన్నాడు అయితే, ఇటీవల చిట్ ఫండ్ కమీషన్ విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. నెహ్రూ అనేకసార్లు కమీషన్ మొత్తాన్ని తన ఒంటరిగా తీసుకోవడం, నిషారాణిపై అసభ్యంగా మాట్లాడడం, ఆమెతో శారీరక సంబంధం కోరినట్టు వ్యాఖ్యలు చేయడం వల్ల మహేష్ తీవ్రంగా కోపం పెంచుకున్నాడు. 2025 జూలై 28న

9ee7c8fb-7990-4399-aa92-fa9594025f21

నిషారాణి వద్ద ఉన్న బంగారాన్ని మహేష్ తీసుకొని మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ – వర్గల్ బ్రాంచ్ వద్ద ₹58,600 రుణం తీసుకున్నాడు. ఆ డబ్బును చిట్ ఫండ్ బాకీల కోసం వినియోగించనున్నట్టు ఆమెకు చెప్పినా ఆమె నమ్మలేదు. అందుకే, నెహ్రూను హామీదారుగా తీసుకురావాలని ఆమె చెప్పింది. ములుగు వద్ద నెహ్రూను కారులో తీసుకుని వెళ్లి నిషారాణి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నెహ్రూ మళ్ళీ అసభ్య వ్యాఖ్యలు చేయడంతో, మహేష్ కోపంతో అతన్ని గుద్దడంతో ఆయన అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే, ఇంట్లో ఉన్న వైర్‌తో బిగించి గొంతునులిమి హత్య చేశాడు. శవాన్ని కారులో ఉంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం, నిషారాణికి విషయం తెలియజేసి, ఆమె తండ్రి నారదాసు కొమురయ్య సాయంతో మృతదేహాన్ని దాచేందుకు గగ్గిళ్లాపూర్ గ్రామానికి వెళ్లాడు. మొదట మృతదేహాన్ని పొలాల్లో దాచి, తర్వాత సరైన వాహనం లభించిన తరువాత, మృతదేహాన్ని రాళ్లతో కట్టి చెరువులో పడేశాడు. ఉబ్బని వినయ్ అనే వ్యక్తి, నెహ్రూ ఫోన్ నుండి ఆయన భార్యకు ఫేక్ కాల్ చేసి

8cd8a5f2-127c-4a52-8c63-352cb3c10016

“అన్న రాడు, రేపు వస్తాడు” అని చెప్పాడు. నిందితుడు మహేష్, నెహ్రూ భార్యకు ₹15,000 చిట్ ఫండ్ డబ్బును ఇచ్చి అతను బాగానే ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం, మహేష్, నెహ్రూ యొక్క మొబైల్‌ను ములుగు కొండపోచమ్మ కెనాల్ పడేసి ట్రేస్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. స్వయంగా పోలీసులకు మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, చూపించాడు. దర్యాప్తులో రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక TVS ఎక్సెల్ మోటార్ బైకు, మైక్రో ఫైనాన్స్ లోపడ్డ బంగారు రుణపు రసీదు (Inventory No: IN40930700001754 – ₹58,600), నిషారాణి ఇంటి వివరాలు, నెహ్రూ మొబైల్ కాల్ ట్రేసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు స్వయంగా మృతదేహాన్ని పడేసిన ప్రదేశాన్ని, నిషారాణి నివాసాన్ని, వాహనాల వివరాలను పోలీసులకు చూపించాడు. ప్రధాన నిందితుడు 1 గామిలీపురం మహేష్, 2 సహ నిందితులు నిషారాణి, 3 ఉబ్బని వినయ్, 4 నారదాసు కొమురయ్య నలుగురిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని సీఐ ఒక ప్రకటనలో తెలిపారు.

More news from Spsr Nellore and nearby areas
  • నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్ సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్ గ్యాలరీ ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
    3
    నెల్లూరు  నగరంలోని మాగుంట లేఔట్ మినీ బైపాస్ అన్నమయ్య సర్కిల్  సమీపంలో గల పి వి ఆర్ కళ్యాణమండపం నందు మహా నగరాలకు దీటుగా అంగరంగ వైభవంగా ఘనంగా ఇండియన్ సిల్క్స్  గ్యాలరీ  ఎక్స్ ప్రో ప్రారంభించారు.డిసెంబర్ 20 తారీకు నుండి 25వ తారీకు వరకు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేతుల మీదగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ ఇండియన్ గెలాక్సీ ఎక్స్ ప్రో  నందు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుండి 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు . ప్రత్యేకంగా ఉత్పత్తిదారుల నుండి అమ్మకం చేయటం తమ ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. తమ వద్ద  మహిళలకు శారీస్ చుడిదార్స్ కలంకారి పోచంపల్లి ఉప్పాడ గద్వాల్ జైపూర్ రాజస్థాన్ బనారస్ పట్టు ప్రత్యేకంగా రానున్న క్రిస్టమస్ జనవరి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు వస్త్రప్రియలు తమ గ్యాలరీ ఎక్స్ ప్రో ని ఒకసారి వీక్షించవలసిందిగా కార్యనిర్వాహకులు ఎర్ర శ్రీనివాసరావు  మీడియాతో తెలిపారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా డిస్కౌంట్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పడం జరిగింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారని ఈ సదవకాశాన్ని నెల్లూరు ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    Journalist Spsr Nellore•
    16 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada•
    21 hrs ago
  • పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
    1
    పోలాకి: అర్హత కలిగిన వారికి గృహాలు మంజూరు చెయ్యండి.. జడ్పిటిసి
అర్హత కలిగిన నిరుపేదలకు గృహాలు అందించేందుకు కృషి చేయాలని జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య ఆదేశించారు. శనివారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా నిరుపేదలకు అందాల్సిన పథకాలను అందించాలని సూచించారు. గత ప్రభుత్వంలో నిర్మించుకున్న గృహాలకు అవసరమైన బిల్లులు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    Journalist Srikakulam•
    16 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    20 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    21 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳 బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు
    1
    భారత్ మాత కి జై 🇮🇳 
బిజెపి మహిళా నాయకురాలు మౌనిక సుంకర హైకోర్టు అడ్వకేట్ గారు
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    22 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    22 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    22 hrs ago
  • మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ... స్వామియే శరణం అయ్యప్ప
    1
    మల్కాజ్ గిరి నేరేడు మెట్ గ్రామంలో శ్రీ సంఘన బోయిన రాజు యాదవ్ @ గొట్ల రాజు యాదవ్ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మహా పడి పూజ...
స్వామియే శరణం అయ్యప్ప
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Medchal Malkajgiri•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.