Shuru
Apke Nagar Ki App…
భోగాపురం ఎయిర్ పోర్ట్ ట్రయిల్ రన్ కు బయలుదేరిన కూటమి నాయకులు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తో ట్రయిల్ రన్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. గంట్యాడ మండలం నుంచి ఈ కార్యక్రమానికి ఓటమి నాయకుడు వెళ్లారు. బస్ పార్కింగ్, సభ స్థలానికి వెళ్లే ప్రక్రియ, తిరిగి ప్రయాణం చేయు రూట్ మ్యాప్ లో వీరికి అవగాహన కల్పించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
ARIGI SATYARAO
భోగాపురం ఎయిర్ పోర్ట్ ట్రయిల్ రన్ కు బయలుదేరిన కూటమి నాయకులు భోగాపురం ఎయిర్ పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు తో ట్రయిల్ రన్ శుక్రవారం ఉదయం నిర్వహించారు. గంట్యాడ మండలం నుంచి ఈ కార్యక్రమానికి ఓటమి నాయకుడు వెళ్లారు. బస్ పార్కింగ్, సభ స్థలానికి వెళ్లే ప్రక్రియ, తిరిగి ప్రయాణం చేయు రూట్ మ్యాప్ లో వీరికి అవగాహన కల్పించేందుకు ఈ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.1
- ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.1
- అమ్మఒడి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలను నడుపుతున్న అమ్మఒడి టెక్కలి : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. టెక్కలి మండల పరిధిలో ఉన్న అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను వదిలేసి ఇష్టం రాజ్యాంగా శుక్రవారం పాఠశాలను నిర్వహించారు. పాఠశాల నడుస్తుందని తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకొని స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంఈఓ లు దశరధి, చిన్నారావులు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యంకి షో కాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్న అమ్మఒడి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్యామ్, సంతోష్ కుమార్, ప్రశాంత్, పాల్గొన్నారు.1
- కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.1
- శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్వాటర్ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్వాటర్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.1