శివరాత్రి వేడుకలలో రాజకీయ ప్రచారమా? • ఎంపీ ఉదయ శ్రీనివాస్ పై వంగా గీత ఫైర్! పిఠాపురం,ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పర్వదినాన పిఠాపురం లోని పవిత్ర పాదగయ క్షేత్రంలో తిరుమల లడ్డు పై దుష్ప్రచారం చేసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పై వంగా గీత మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు తిరుపతి లడ్డులో ఏదో కల్తీ జరిగిపోయింది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ భక్తులు మనోభావాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు బృందం నివేదికలను సైతం వక్రీకరించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ కరపత్రాలను పంచడం అత్యంత దారుణమన్నారు. దిగజారుడు రాజకీయాలు కాకినాడ జిల్లాలో జరుగుతున్నాయని ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. *రాజకీయ స్వార్థానికి పుణ్యక్షేత్రాలా?* కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్యాత్మిక క్షేత్రాలను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భక్తితో వచ్చే భక్తులకు తమ స్వార్థపు రాజకీయాల కోసం ప్రచార పత్రాలను ముద్రించి పంచడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం, వారి నాయకులు తిరుపతి లడ్డు అంశాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. కూటమి నాయకులు కేవలం పబ్లిసిటీ కోసమే ఇటువంటి పనులు చేస్తున్నారని, హిందూ ధర్మంపై వారికి నిజమైన గౌరవం ఉంటే ఇలాంటి పనులు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడామని, కానీ నేడు రాజకీయ లబ్ధి కోసం ఆ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మండలి సభ్యుడు గండేపల్లి బాబి, పిఠాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత,నాయకులు కొత్తెం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు,బోను దేవా, బత్తుల సాయి, పశ్చిమల్ల అప్పలరాజు, ఉలవల భూషణం, పైలా నాయుడు, గోపు హరిబాబు, రాజాల చక్రం తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
శివరాత్రి వేడుకలలో రాజకీయ ప్రచారమా? • ఎంపీ ఉదయ శ్రీనివాస్ పై వంగా గీత ఫైర్! పిఠాపురం,ఫిబ్రవరి 17: మహాశివరాత్రి పర్వదినాన పిఠాపురం లోని పవిత్ర పాదగయ క్షేత్రంలో తిరుమల లడ్డు పై దుష్ప్రచారం చేసిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పై వంగా గీత మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక వైసీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులకు తిరుపతి లడ్డులో ఏదో కల్తీ జరిగిపోయింది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ భక్తులు మనోభావాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు బృందం నివేదికలను సైతం వక్రీకరించి ఎంపీ ఉదయ శ్రీనివాస్ కరపత్రాలను పంచడం అత్యంత దారుణమన్నారు. దిగజారుడు రాజకీయాలు కాకినాడ జిల్లాలో జరుగుతున్నాయని ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. *రాజకీయ స్వార్థానికి పుణ్యక్షేత్రాలా?* కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్యాత్మిక క్షేత్రాలను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. భక్తితో వచ్చే భక్తులకు తమ స్వార్థపు రాజకీయాల కోసం
ప్రచార పత్రాలను ముద్రించి పంచడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం, వారి నాయకులు తిరుపతి లడ్డు అంశాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. కూటమి నాయకులు కేవలం పబ్లిసిటీ కోసమే ఇటువంటి పనులు చేస్తున్నారని, హిందూ ధర్మంపై వారికి నిజమైన గౌరవం ఉంటే ఇలాంటి పనులు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడామని, కానీ నేడు రాజకీయ లబ్ధి కోసం ఆ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మండలి సభ్యుడు గండేపల్లి బాబి, పిఠాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినిడి సుజాత,నాయకులు కొత్తెం దత్తుడు, తలిశెట్టి వెంకటేశ్వరరావు,బోను దేవా, బత్తుల సాయి, పశ్చిమల్ల అప్పలరాజు, ఉలవల భూషణం, పైలా నాయుడు, గోపు హరిబాబు, రాజాల చక్రం తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
- దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.4
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు.1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- 🙏😭1