logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, కాలుష్య ధ్రువపత్రాలతో పాటు వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు తమ వెంట అన్ని అవసరమైన పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

2 hrs ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
2 hrs ago

చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పోలీసులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, కాలుష్య ధ్రువపత్రాలతో పాటు వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనదారులు తమ వెంట అన్ని అవసరమైన పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు గట్టిగా హెచ్చరించారు. ప్రజల భద్రతను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • శ్రీశైలం గౌడ్ మూడు సార్లు ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరణకు గురై డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వ్యక్తి అని, అలాంటి ఆయనకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిపై మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డుకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొబ్బరి కాయలు కొట్టిన సందర్భంగా, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ. వివేకానంద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సురేష్ రెడ్డి తప్పుబట్టారు. కొబ్బరి కాయలు కొట్టినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
    1
    శ్రీశైలం గౌడ్ మూడు సార్లు ఎన్నికల్లో ప్రజల చేత తిరస్కరణకు గురై డిపాజిట్లు కూడా దక్కించుకోలేని వ్యక్తి అని, అలాంటి ఆయనకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ గారిపై మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దూలపల్లి–జీడిమెట్ల ఇండస్ట్రియల్ రోడ్డుకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కొబ్బరి కాయలు కొట్టిన సందర్భంగా, కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ. వివేకానంద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను సురేష్ రెడ్డి తప్పుబట్టారు. కొబ్బరి కాయలు కొట్టినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.
    user_Hanumadri Srinivas Goud
    Hanumadri Srinivas Goud
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణాల్లో పెరుగుతున్న ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో "వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో" (వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువు తయారీ)పై ప్రత్యేక అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సీడీఓ హేమలత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టణాల్లో సేకరించే తడి చెత్తను విండ్రో విధానంలో శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి, తక్కువ వ్యయంతో నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా ఎలా తయారు చేయాలనే అంశంపై అధికారులకు మరియు శానిటేషన్ సిబ్బందికి ఆచరణాత్మక శిక్షణను అందించారు. ఈ శిక్షణలో గాలి ప్రసరణ, తేమ శాతం నిర్వహణ, మరియు ఎరువు తయారీ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మరియు మున్సిపల్ కమిషనర్ పి. గణేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛ పట్టణాల నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు. చెత్తను రీసైక్లింగ్ చేసి సేంద్రీయ ఎరువుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపాలిటీలకు ఉపయోగకరమైన ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌తో పాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, అలియాబాద్, మూడిచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మరియు శానిటేషన్ విభాగ సిబ్బంది హాజరై విండ్రో పద్ధతిపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న శానిటేషన్ సిబ్బంది సేవలను అధికారులు అభినందించారు.
    4
    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పట్టణాల్లో పెరుగుతున్న ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో "వేస్ట్ టు కంపోస్ట్ విండ్రో" (వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువు తయారీ)పై ప్రత్యేక అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సీడీఓ హేమలత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, పట్టణాల్లో సేకరించే తడి చెత్తను విండ్రో విధానంలో శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి, తక్కువ వ్యయంతో నాణ్యమైన సేంద్రీయ ఎరువుగా ఎలా తయారు చేయాలనే అంశంపై అధికారులకు మరియు శానిటేషన్ సిబ్బందికి ఆచరణాత్మక శిక్షణను అందించారు. ఈ శిక్షణలో గాలి ప్రసరణ, తేమ శాతం నిర్వహణ, మరియు ఎరువు తయారీ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరంగా వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ మరియు మున్సిపల్ కమిషనర్ పి. గణేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛ పట్టణాల నిర్మాణానికి దోహదపడతాయని తెలిపారు. చెత్తను రీసైక్లింగ్ చేసి సేంద్రీయ ఎరువుగా మార్చడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మున్సిపాలిటీలకు ఉపయోగకరమైన ఫలితాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు.

ఈ ప్రాంతీయ స్థాయి శిక్షణా కార్యక్రమానికి గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌తో పాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, అలియాబాద్, మూడిచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీల కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మరియు శానిటేషన్ విభాగ సిబ్బంది హాజరై విండ్రో పద్ధతిపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న శానిటేషన్ సిబ్బంది సేవలను అధికారులు అభినందించారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • చార్మినార్ జోన్ డిఐజి ఎల్.ఎస్. చౌహన్ ఈరోజు గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర డిఐజి చౌహాన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. డిఐజి జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిపిఓ సెక్షన్లు, డిసిఆర్బి, డిఎస్పి, డిఎఆర్ పరిపాలన శాఖలు, రికార్డు విభాగాలు, ఆయుధగారం, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన వివిధ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ అనంతరం, డిఐజి చౌహన్ మాట్లాడుతూ అన్ని విభాగాల పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. కార్యాలయ నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని, కార్యాలయ నిర్మాణంలో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
    1
    చార్మినార్ జోన్ డిఐజి ఎల్.ఎస్. చౌహన్ ఈరోజు గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర డిఐజి చౌహాన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. డిఐజి జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిపిఓ సెక్షన్లు, డిసిఆర్బి, డిఎస్పి, డిఎఆర్ పరిపాలన శాఖలు, రికార్డు విభాగాలు, ఆయుధగారం, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన వివిధ విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీ అనంతరం, డిఐజి చౌహన్ మాట్లాడుతూ అన్ని విభాగాల పనితీరును పరిశీలించినట్లు తెలిపారు. కార్యాలయ నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని, కార్యాలయ నిర్మాణంలో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    5 hrs ago
  • తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా కనిపించింది. సాధారణంగా భక్తులతో రద్దీగా ఉండే ఆలయ ప్రదేశాలన్నీ మంచు దుప్పట్లో కప్పుకున్నాయి. చిరుజల్లులతో కూడిన చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయ ప్రాంగణమంతటికీ మరింత శోభను తెచ్చింది. ఈ అందమైన వాతావరణాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రాకారాలను వీక్షిస్తూ, వీడియోలు తీస్తూ వారు సంతోషంగా గడిపారు. ఈరోజు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట అందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
    1
    తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లుగా కనిపించింది. సాధారణంగా భక్తులతో రద్దీగా ఉండే ఆలయ ప్రదేశాలన్నీ మంచు దుప్పట్లో కప్పుకున్నాయి. చిరుజల్లులతో కూడిన చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఆలయ ప్రాంగణమంతటికీ మరింత శోభను తెచ్చింది.

ఈ అందమైన వాతావరణాన్ని చూసి భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రాకారాలను వీక్షిస్తూ, వీడియోలు తీస్తూ వారు సంతోషంగా గడిపారు. ఈరోజు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట అందాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
    user_కిరణ్ కుమార్ గౌడ్
    కిరణ్ కుమార్ గౌడ్
    Yoga instructor భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • కేంద్ర మంత్రి జేపీ నడ్డా గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్‌ను పరిశోధనాత్మక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్శనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డా. లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు పాలుపంచుకున్నారు.
    1
    కేంద్ర మంత్రి జేపీ నడ్డా గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీబీనగర్ ఎయిమ్స్‌ను పరిశోధనాత్మక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్శనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయనతో పాటు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు డా. లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ అమిత్ అగర్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు పాలుపంచుకున్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    9 hrs ago
  • మనోహరాబాద్ మండలం రంగరాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంపై గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం నకిలీ ఎన్జీవో గుర్తింపు కార్డులను ఉపయోగించి ప్రజలకు తప్పుడు సమాచారం అందించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, ఇది ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. తప్పు నిర్ధారణ అయితే, పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించరాదని ఆయన అన్నారు.
    1
    మనోహరాబాద్ మండలం రంగరాయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యంపై గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిశ్రమ యాజమాన్యం నకిలీ ఎన్జీవో గుర్తింపు కార్డులను ఉపయోగించి ప్రజలకు తప్పుడు సమాచారం అందించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని, ఇది ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య అని వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. 

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. తప్పు నిర్ధారణ అయితే, పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించరాదని ఆయన అన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తల్లి కవితపై హత్యాయత్నం జరిగినట్లు జగదేవ్‌పూర్ పోలీసులు వల్లెపు కనకయ్యపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు కనకయ్యకు బాధితురాలైన కవితతో గత ఏడెనిమిది సంవత్సరాలుగా పరిచయం ఉంది. కవిత తన అవసరాల కోసం రూ.10 వేల అప్పు కోరగా, డబ్బు ఇస్తానని చెప్పి కనకయ్య ఆమెను రాత్రి బయటకు పిలిచాడు. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత కవిత డబ్బులు అడగగా, ప్రస్తుతం లేవని, తర్వాత ఇస్తానని నిందితుడు చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో, కవిత ఇతరులతో కూడా సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆగ్రహించిన కనకయ్య, ఆమె జుట్టు పట్టుకుని సమీపంలోని ఇంటి వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఉన్న తలుపు చెక్కతో పాటు రాళ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కవితను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి, భువనగిరిలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు దాడికి ఉపయోగించిన తలుపు చెక్కతో పాటు, బాధితురాలిని తీసుకెళ్లేందుకు వినియోగించిన ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
    1
    సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె తల్లి కవితపై హత్యాయత్నం జరిగినట్లు జగదేవ్‌పూర్ పోలీసులు వల్లెపు కనకయ్యపై కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు కనకయ్యకు బాధితురాలైన కవితతో గత ఏడెనిమిది సంవత్సరాలుగా పరిచయం ఉంది. కవిత తన అవసరాల కోసం రూ.10 వేల అప్పు కోరగా, డబ్బు ఇస్తానని చెప్పి కనకయ్య ఆమెను రాత్రి బయటకు పిలిచాడు. అనంతరం ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత కవిత డబ్బులు అడగగా, ప్రస్తుతం లేవని, తర్వాత ఇస్తానని నిందితుడు చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో, కవిత ఇతరులతో కూడా సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆగ్రహించిన కనకయ్య, ఆమె జుట్టు పట్టుకుని సమీపంలోని ఇంటి వద్దకు తీసుకెళ్లి, అక్కడ ఉన్న తలుపు చెక్కతో పాటు రాళ్లతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు కవితను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి, భువనగిరిలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు దాడికి ఉపయోగించిన తలుపు చెక్కతో పాటు, బాధితురాలిని తీసుకెళ్లేందుకు వినియోగించిన ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సంయమనం పాటించి పార్టీ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మందుల సామేల తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పదవుల కేటాయింపులో కార్యకర్తల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఆయన, పదవుల కోసం విభేదాలు సృష్టించకుండా ప్రజల కోసం కలిసి పనిచేయాలని సూచించారు.
    1
    భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు సంయమనం పాటించి పార్టీ ఐక్యతను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మందుల సామేల తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పదవుల కేటాయింపులో కార్యకర్తల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరిన ఆయన, పదవుల కోసం విభేదాలు సృష్టించకుండా ప్రజల కోసం కలిసి పనిచేయాలని సూచించారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మహిళ కూడా రోడ్డుపై పడిపోయారు. అయితే, బైకర్ హెల్మెట్ ధరించడం వల్ల, తలకు బలమైన గాయం కాకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టంగా తెలియజేసింది.
    1
    ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న మహిళ కూడా రోడ్డుపై పడిపోయారు. అయితే, బైకర్ హెల్మెట్ ధరించడం వల్ల, తలకు బలమైన గాయం కాకుండా పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటన హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టంగా తెలియజేసింది.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.