నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ వేళ ఉదయం 11 గంటలకు స్థానిక ప్రకాష్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో "ఎన్డీఏ కూటమి మహిళా నాయకుల విలేకరుల సమావేశం" జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మూడు పార్టీలకు చెందిన మహిళా మోర్చా, తెలుగు మహిళ, వీర మహిళలు పాల్గొని వారి గళాన్ని వినిపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల అత్యంత సానుకూల ధోరణితో 33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు తీసుకు వస్తే, దుష్ట కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి మహిళల స్వాభిమానాన్ని కాలరాస్తూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఊరా సుజాత గారు మాట్లాడుతూ దేశంలోని మహిళలందరికీ మోడీ గారు వరాలు ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండికూటమి ఆ వరాలను అందుకోనీకుండా చేస్తున్నారని మండిపడ్డారు, తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కథం నాగజ్యోతి గారు మాట్లాడుతూ ఒకపక్క దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళాభ్యుదయాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ సునీత విలియమ్స్ కల్పనా చావ్లా లాంటి ఎంతోమంది మహిళాశక్తి అభివృద్ధిపథాన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళుతూ ఉంటే దుష్ట కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళలను ఎదగనివ్వకుండా మోకాలు అంటుతున్నారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన వీర మహిళ ఉపాధ్యక్షురాలు జక్కం నిర్మల గారు మాట్లాడుతూ భారతదేశంలో అద్భుత రీతిన NDA ఆధ్వర్యంలో మహిళా శక్తికి 33% రిజర్వేషన్ తో పట్టంకట్టి వారిని చట్టసభలలో కూర్చోబెట్టాలని ఆలోచనకు తూట్లు పొడిచి దేశంలోని మహిళలందరికి తీరని ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి అని మండిపడ్డారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావుగారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఆర్ నాగలక్ష్మి గారు, జనసేన పార్టీ వీర మహిళ దండూరి లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ పాలడుగు కుమారి గారు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు చలువారి సరస్వతి గారు, యువ మోర్చా ఉపాధ్యక్షురాలు దేవిశెట్టి సుధారాణి గారు, సంయుక్త కార్యదర్శి చిలకల పద్మప్రియ గారు, చిలకల ప్రియాంక గారు, రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్ గారు, రూరల్ మండల అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు నాగసరపు ఆంజనేయులు గారు, రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి దయిండే కిషోర్ గారు, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి ధారా గుప్తా గారు, జిల్లా కార్యాలయ సహాయకులు మిట్ట చిరంజీవి గారు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది నరసరావుపేట భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో NDA కూటమి మహిళా నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ వేళ ఉదయం 11 గంటలకు స్థానిక ప్రకాష్ నగర్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో "ఎన్డీఏ కూటమి మహిళా నాయకుల విలేకరుల సమావేశం" జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మూడు పార్టీలకు చెందిన మహిళా మోర్చా, తెలుగు మహిళ, వీర మహిళలు పాల్గొని వారి గళాన్ని వినిపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మహిళల పట్ల అత్యంత సానుకూల ధోరణితో 33% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా పార్లమెంటులో బిల్లు తీసుకు వస్తే, దుష్ట కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి మహిళల స్వాభిమానాన్ని కాలరాస్తూ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఊరా సుజాత గారు మాట్లాడుతూ దేశంలోని మహిళలందరికీ మోడీ గారు వరాలు ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండికూటమి ఆ వరాలను అందుకోనీకుండా చేస్తున్నారని మండిపడ్డారు, తెలుగుదేశం పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కథం నాగజ్యోతి గారు మాట్లాడుతూ ఒకపక్క దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళాభ్యుదయాన్ని తుంగలో తొక్కే విధంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కనుమూరి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ సునీత విలియమ్స్ కల్పనా చావ్లా లాంటి ఎంతోమంది మహిళాశక్తి అభివృద్ధిపథాన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళుతూ ఉంటే దుష్ట కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి మహిళలను ఎదగనివ్వకుండా మోకాలు అంటుతున్నారని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన వీర మహిళ ఉపాధ్యక్షురాలు జక్కం నిర్మల గారు మాట్లాడుతూ భారతదేశంలో అద్భుత రీతిన NDA ఆధ్వర్యంలో మహిళా శక్తికి 33% రిజర్వేషన్ తో పట్టంకట్టి వారిని చట్టసభలలో కూర్చోబెట్టాలని ఆలోచనకు తూట్లు పొడిచి దేశంలోని మహిళలందరికి తీరని ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఇండికూటమి అని మండిపడ్డారు. కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావుగారు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య గారు, జిల్లా ఉపాధ్యక్షులు కాటా అంజనారెడ్డి గారు, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల విజయలక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి ఆర్ నాగలక్ష్మి గారు, జనసేన పార్టీ వీర మహిళ దండూరి లక్ష్మి గారు, తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళ పాలడుగు కుమారి గారు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు చలువారి సరస్వతి గారు, యువ మోర్చా ఉపాధ్యక్షురాలు దేవిశెట్టి సుధారాణి గారు, సంయుక్త కార్యదర్శి చిలకల పద్మప్రియ గారు, చిలకల ప్రియాంక గారు, రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్ గారు, రూరల్ మండల అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు గారు, సీనియర్ నాయకులు నాగసరపు ఆంజనేయులు గారు, రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి దయిండే కిషోర్ గారు, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి ధారా గుప్తా గారు, జిల్లా కార్యాలయ సహాయకులు మిట్ట చిరంజీవి గారు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Ramprasad islavath1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- 👉 రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి నల్గొండ ఆర్ & బి శాఖ మాత్యుల క్యాంప్ కార్యాలయం (ఇందిరా భవన్)లో జిల్లా కలెక్టర్ మరియు అధికారులతో రబీ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. 👉 యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 👉 అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. 👉 రాత్రి, పగలు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. 👉 ఎక్కువగా ధాన్యం వచ్చే గ్రామాలను గుర్తించి ప్రత్యేకంగా విశ్లేషణ చేయాలని సూచించారు. 👉 ఆ గ్రామాలకు అదనపు లారీలు పంపి రవాణా వేగవంతం చేయాలని చెప్పారు. 👉 రోడ్లపై ధాన్యం పేరుకుపోకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాళ్ల వద్ద తాత్కాలిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 👉 రైతులు మరియు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. 👉 నల్గొండ నియోజకవర్గంలో సుమారు 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోయే అవకాశం ఉందని అంచనా. ➡️ ధాన్యం సేకరణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.1
- Post by V Ramarao1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1