నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం నర్సంపేట: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.35 లక్షల TUFIDC నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. బోడ దస్రు ఇంటి నుంచి కాసుల విజయ ఇంటి వరకు, ఎండీ పాషా ఇంటి నుంచి యాదనాడ్ల ఈశ్వరయ్య ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్లకు PACS డైరెక్టర్, కాంగ్రెస్ 18వ వార్డు ఇన్చార్జి లక్కర్స్ రమేష్, కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్లుగా అంతర్గత రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న 18వ వార్డు ప్రజల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవిష్యత్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి వార్డును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బిట్ల మనోహర్, నకినబోయిన మహేష్, కందికట్ల వీరేష్, దేవోజు సదానందం, రాజు, గుంటి అశోక్, బోళ్ల నవీన్, బత్తుల శివకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.35 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం నర్సంపేట: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు నర్సంపేట మున్సిపాలిటీ 18వ వార్డులో రూ.35 లక్షల TUFIDC నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. బోడ దస్రు ఇంటి నుంచి కాసుల విజయ ఇంటి వరకు, ఎండీ పాషా ఇంటి నుంచి యాదనాడ్ల ఈశ్వరయ్య ఇంటి వరకు నిర్మించనున్న సీసీ రోడ్లకు PACS డైరెక్టర్, కాంగ్రెస్ 18వ వార్డు ఇన్చార్జి లక్కర్స్ రమేష్, కాంగ్రెస్ ఓబీసీ
సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏళ్లుగా అంతర్గత రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న 18వ వార్డు ప్రజల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవిష్యత్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి వార్డును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బిట్ల మనోహర్, నకినబోయిన మహేష్, కందికట్ల వీరేష్, దేవోజు సదానందం, రాజు, గుంటి అశోక్, బోళ్ల నవీన్, బత్తుల శివకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పాడిపశులకు అడ్డాగా మారిన పల్లె ప్రకృతి వనం -------------------------------- యాంకర్: ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం పరిస్థితి దయనీయాంగామారింది. గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బండారుపల్లి గ్రామంలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రజలకు ఉపయోగపడాల్సిన పల్లె ప్రకృతి వనం పశువులకు అడ్డాగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ పల్లె ప్రకృతి వనం నిర్వహణను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తూన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం పాడిపశువులకు మరియు మందుబాబులకు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని గ్రామస్తులు తెలిపారు2
- నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి................. MLG: ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జంపాల రవీందర్ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. జిల్లా రెండో మహాసభ సందర్భంగా నాయి బ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్షౌరవృత్తిలోకి ఇతర కులాల రాకను నిరోధించాలని, దేవాలయాలు, జాతరల్లో తలనీలాల ఆదాయంలో వృత్తిదారులకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏][𝐌𝐀𝐋𝐄][𝐆𝐎𝐕𝐓.𝐊𝐃𝐂-𝐁𝐀.3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑:𝐇𝐍𝐊][𝐈𝐍𝐓𝐀𝐑(𝐁𝐈𝐏𝐂-1992 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔@𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][𝐈𝐍𝐒𝐓𝐀𝐀𝐆𝐑𝐀𝐀𝐌𝐒][[𝐓𝐇𝐎𝐔𝐓𝐌 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏;𝐅𝐀𝐂𝐄 𝐁𝐎𝐎𝐊𝐒][𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃]1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్.. జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1