రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో లోపాలు వేంటేనే అధికారులు చేర్యలు తీసుకోండి రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో తీవ్ర లోపాలు *నిద్ర వ్యవస్థలో విద్యశాఖ అధికారులు* – *ఉన్నత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్* SFI, YSRSU రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో పలు కీలక చట్టపరమైన, పరిపాలనా మరియు భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించబడుతున్నాయని తీవ్రంగా ఖండిస్తూ నేడు ఆ పాఠశాల వద్ద ధర్నా చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ..... రిషి పాఠశాల చెన్నెకొత్తపల్లి మండలం పరిధిలో ఉండగా, హాస్టల్ ధర్మవరం ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఒకే విద్యాసంస్థ రెండు వేర్వేరు మండలాల్లో కార్యకలాపాలు నిర్వహించడం పరిపాలనా పరంగా చెల్లని విధానం. దీని వలన పర్యవేక్షణలో గందరగోళం, బాధ్యత నిర్ధారణలో లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా, పాఠశాల మరియు హాస్టల్ మధ్య దూరం 2 కి.మీ కంటే ఎక్కువగా ఉండటం వల్ల చిన్నారుల భద్రతపై తీవ్రమైన ప్రమాదం నెలకొంది. రోజువారీ ప్రయాణం వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది రోడ్ సేఫ్టీ మరియు చైల్డ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ రిషి పాఠశాల యాజమాన్యం ధర్మవరం విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ మాయ మాటలు చెబుతూ డొనేషన్లు పేర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) మరియు రోబోటిక్స్ ఇలా వగైరా వగైరా.. కొత్త రకమైన పేర్లతో దోపిడీఏ లక్ష్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ ముందస్తుగా ప్రచారం నిర్వహించడమే కాకుండా అడ్మిషన్లు చేయడం వీటన్నిటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖ అధికారులు ఏ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. మరి విద్యాశాఖ అధికారులు రిషి పాఠశాలపై గాడమైన ప్రేమతో మొద్దు నిద్ర పోతున్నట్టు నటిస్తూ వారి అక్రమ ప్రచార అడ్మిషన్లను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు తక్షణం స్పందించి అనుమతులు లేకుండా 8 9 10 తరగతులకు నిర్వహించే అడ్మిషన్లు అడ్డుకోవాలి ఈ పాఠశాలకు గుర్తింపును తక్షణం రద్దు చేయాలి. - పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి - హాస్టల్ అనుమతులపై స్పష్టత ఇవ్వాలి - విద్యార్థుల భద్రతా ప్రమాణాలు పాటించే వరకు అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల భద్రత, విద్యా వ్యవస్థ సమగ్రత మరియు చట్టపరమైన ప్రమాణాల పరిరక్షణ కోసం ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు తక్షణ జోక్యం చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు అమన్ కార్యదర్శి శ్రీనాథ్ పట్టణ ఉపాధ్యక్షులు బాలాజీ గోవర్ధన్ ప్రణీత్ నవీన్ సాయి చరణ్ వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు విగ్నేష్ వివేక్ పాల్గొన్నారు. విప్లవ అభివందనాలతో.... నామాల నాగార్జున SFI జిల్లా కార్యదర్శి
రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో లోపాలు వేంటేనే అధికారులు చేర్యలు తీసుకోండి రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో తీవ్ర లోపాలు *నిద్ర వ్యవస్థలో విద్యశాఖ అధికారులు* – *ఉన్నత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్* SFI, YSRSU రిషి పాఠశాల అనుమతి ప్రక్రియలో పలు కీలక చట్టపరమైన, పరిపాలనా మరియు భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించబడుతున్నాయని తీవ్రంగా ఖండిస్తూ నేడు ఆ పాఠశాల వద్ద ధర్నా చేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ..... రిషి పాఠశాల చెన్నెకొత్తపల్లి మండలం పరిధిలో ఉండగా, హాస్టల్ ధర్మవరం ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఒకే విద్యాసంస్థ రెండు వేర్వేరు మండలాల్లో కార్యకలాపాలు నిర్వహించడం పరిపాలనా పరంగా చెల్లని విధానం. దీని వలన పర్యవేక్షణలో గందరగోళం, బాధ్యత నిర్ధారణలో లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా, పాఠశాల మరియు హాస్టల్ మధ్య దూరం 2 కి.మీ కంటే ఎక్కువగా ఉండటం వల్ల చిన్నారుల భద్రతపై తీవ్రమైన ప్రమాదం నెలకొంది. రోజువారీ ప్రయాణం వారికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇది రోడ్ సేఫ్టీ మరియు చైల్డ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధం. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ రిషి పాఠశాల యాజమాన్యం ధర్మవరం విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ మాయ మాటలు చెబుతూ డొనేషన్లు పేర్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI ) మరియు రోబోటిక్స్ ఇలా వగైరా వగైరా.. కొత్త రకమైన పేర్లతో దోపిడీఏ లక్ష్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ ముందస్తుగా ప్రచారం నిర్వహించడమే కాకుండా అడ్మిషన్లు చేయడం వీటన్నిటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖ అధికారులు ఏ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. మరి విద్యాశాఖ అధికారులు రిషి పాఠశాలపై గాడమైన ప్రేమతో మొద్దు నిద్ర పోతున్నట్టు నటిస్తూ వారి అక్రమ ప్రచార అడ్మిషన్లను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు తక్షణం స్పందించి అనుమతులు లేకుండా 8 9 10 తరగతులకు నిర్వహించే అడ్మిషన్లు అడ్డుకోవాలి ఈ పాఠశాలకు గుర్తింపును తక్షణం రద్దు చేయాలి. - పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి - హాస్టల్ అనుమతులపై స్పష్టత ఇవ్వాలి - విద్యార్థుల భద్రతా ప్రమాణాలు పాటించే వరకు అనుమతులు ఇవ్వకూడదు. విద్యార్థుల భద్రత, విద్యా వ్యవస్థ సమగ్రత మరియు చట్టపరమైన ప్రమాణాల పరిరక్షణ కోసం ప్రభుత్వం మరియు విద్యాశాఖ అధికారులు తక్షణ జోక్యం చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు అమన్ కార్యదర్శి శ్రీనాథ్ పట్టణ ఉపాధ్యక్షులు బాలాజీ గోవర్ధన్ ప్రణీత్ నవీన్ సాయి చరణ్ వైయస్సార్ విద్యార్థి విభాగం నాయకులు విగ్నేష్ వివేక్ పాల్గొన్నారు. విప్లవ అభివందనాలతో.... నామాల నాగార్జున SFI జిల్లా కార్యదర్శి
- మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు1
- రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం కాదలూరు గ్రామంలో ఎమ్మెల్యే కాలువ ఆధ్వర్యంలో ప్రగతి పదం ముగింపు వేడుకలు. ఎంపీ పార్థసారథి, రాష్ట్ర సలహాదారుడు షరీఫ్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూర్తయిన 6 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.1
- ఆలూరు నియోజకవర్గం లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోరుతూ ఆలూరు పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే విరుపాక్షి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు... గత 25 రోజుల నీళ్లు రాకపోవడంతో వైసీపీ నేతలు గ్రామస్తులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు... అధికారులకు పలుమార్లు విన్నవించిన స్పందించలేదని అగ్రహం వ్యక్తం చేశారు.. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది..1
- సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామం పరిధిలోని సచివాలయం, 1 మంగళవారం ఉదయం 11 గంటలు కావస్తున్న సచివాలయం తలుపులు తెరచకపోవడంతో సచివాలయ ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేసి నిరసన చేసిన గ్రామస్తులు1
- *అర్ధరాత్రి రైలులో బంగారందోపిడి* *ప్రయాణికులను కత్తులతో బెదిరించి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు* బెంగుళూరు-నరసాపురం (07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో.. 4 కోచ్లలో అర్ధరాత్రి దోపిడీ. ప్రధానంగా S7, S11, S12, S13 కోచ్లలో ప్రయాణికుల నుంచి సుమారు 11 తులాలు బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు అప్పికట్లలో రైలును ఆపి సుమారు పది మంది దుండగులు దిగి పారిపోయిన వైనం. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నరైల్వే పోలీసులు.1
- చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం కరివేన చెరువు పంట కాలువ వద్ద " జలధార " కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికతీత, సాగునీటి కాలువలను శుభ్రం చేశారు.భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం అన్నారు.చెరువుల పునరుద్ధరణతో వర్షపునీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తామన్నారు.1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- తాగునీటి కొరత తీర్చిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుకు గుడీబండ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల మండలంలో తాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తెలిపారు. ఎమ్మెల్యే స్పందిస్తూ మంగళవారం బోరు వేయించగా నీరు పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామికి, బాలల హక్కులకు కమిషన్ చైర్మన్ డాక్టర్ డి శ్రీనివాసమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు1