జర్నలిస్టుల హక్కుల సాధనకై కృషి చేస్తాం.. ...పరిగి నియోజక వర్గ అడహక్ కమిటి కన్వీనర్ వి. శ్రీనివాస రావు. టియు డబ్ల్యూజే - హెచ్ 143 పరిగి నియోజక వర్గ అడహక్ కమిటి నియామకం టియు డబ్ల్యూజే - హెచ్ 143 ( తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ - ఎచ్ 143 ) పరిగి నియోజకవర్గం అడహక్ కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్ట్ వి .శ్రీనివాస్ రావు నియమితులయ్యారు. కో కన్వీనర్లుగా పర్షమోని బాబయ్య, పండాల సురేష్, సీమ ఆనంద్,జి.అనంత రాములు,కుమార్, సతీష్ లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ మారుతి సాగర్ ఆధ్వర్యంలో జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ రవీందర్ , కో కన్వీనర్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ... గత ఉద్యమ కాలం నుండి జర్నలిస్టుల పక్షాన నిలబడి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఏకైక సంఘం టియు డబ్ల్యూ జె -హెచ్ 143 అని అన్నారు. అటు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలోనూ,ఇటు జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సమీక్షిస్తూ ముందుకు సాగుతుందన్నారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులను చిన్న చూపు చూసి దూరం పెట్టిన సంఘాలకు కనువిప్పు కలిగేలా , ప్రతి జర్నలిస్టును అక్కున చేర్చుకుంటామని అన్నారు. జర్నలిస్టుల కోసం పనిచేసే ఈ సంఘంలో చేరేందుకు ఆసక్తి ఉన్న జర్నలిస్టులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని కోరారు. సంఘంలో సభ్యత్వ నమోదు చేయించుకోవడం ద్వారా తమ హక్కుల సాధనకై కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దుర్గాప్రసాద్, జ్యోతిర్లింగం, రఘు, చాంద్ పాషా, నర్సింలు, శ్రీనివాస్, రాఘవేంద్ర చారి, ఆంజనేయులు, సురేష్, కళ్యాణ్, నర్సింహ, మాణిక్యం,సత్యనారాయణ,రాజేందర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల హక్కుల సాధనకై కృషి చేస్తాం.. ...పరిగి నియోజక వర్గ అడహక్ కమిటి కన్వీనర్ వి. శ్రీనివాస రావు. టియు డబ్ల్యూజే - హెచ్ 143 పరిగి నియోజక వర్గ అడహక్ కమిటి నియామకం టియు డబ్ల్యూజే - హెచ్ 143 ( తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ - ఎచ్ 143 ) పరిగి నియోజకవర్గం అడహక్ కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్ట్ వి .శ్రీనివాస్ రావు నియమితులయ్యారు. కో కన్వీనర్లుగా పర్షమోని బాబయ్య, పండాల సురేష్, సీమ ఆనంద్,జి.అనంత రాములు,కుమార్, సతీష్ లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ మారుతి సాగర్ ఆధ్వర్యంలో జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్ రవీందర్ , కో కన్వీనర్ కొత్త శ్రీనివాస్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ... గత ఉద్యమ కాలం నుండి జర్నలిస్టుల పక్షాన నిలబడి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఏకైక సంఘం టియు డబ్ల్యూ జె -హెచ్ 143 అని అన్నారు. అటు తెలంగాణ సాధన ఉద్యమ పోరాటంలోనూ,ఇటు జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సమీక్షిస్తూ ముందుకు సాగుతుందన్నారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులను చిన్న చూపు చూసి దూరం పెట్టిన సంఘాలకు కనువిప్పు కలిగేలా , ప్రతి జర్నలిస్టును అక్కున చేర్చుకుంటామని అన్నారు. జర్నలిస్టుల కోసం పనిచేసే ఈ సంఘంలో చేరేందుకు ఆసక్తి ఉన్న జర్నలిస్టులు సభ్యత్వం నమోదు చేయించుకోవాలని కోరారు. సంఘంలో సభ్యత్వ నమోదు చేయించుకోవడం ద్వారా తమ హక్కుల సాధనకై కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దుర్గాప్రసాద్, జ్యోతిర్లింగం, రఘు, చాంద్ పాషా, నర్సింలు, శ్రీనివాస్, రాఘవేంద్ర చారి, ఆంజనేయులు, సురేష్, కళ్యాణ్, నర్సింహ, మాణిక్యం,సత్యనారాయణ,రాజేందర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
- మానవ వనరులు,మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం: కలెక్టర్ దీపక్ తివారి. వికారాబాద్ : మానవ వనరులను, మిషనరీ సామర్థ్యాన్ని పెంచుకొని ఎడ్యుకేషన్ హబ్లో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. శుక్రవారం ముత్యాల మండలం, హకీంపేట్ ఎడ్యుకేషన్ Mhnun కల్చర్ దీపక్ తివారి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిష్టాత్మక చేపడుతున్న ఎడ్యుకేషన్ పనులను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ పనులను వేగవతం చేయాలని ఎడ్యుకేషన్ హాఫ్ లో చేపట్టే ప్రతి పని వద్ద ఇంచార్జిగా పర్యవేక్షణ నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిర్మాణం లో చేపడుతున్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలను అమర్చారని అధికారులకు సూచించారు. అనంతరం నర్సింగ్ హాస్టల్ పారామెడికల్ ఫిజియోథెరపీ కళాశాల ఇన్ ఇండియా ఇండికేటర్ స్కూల్ నర్సింగ్ వెటర్నరీ కళాశాల సంబంధించిన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.1
- దౌల్తాబాద్: వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.......... దౌల్తాబాద్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్నందున శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు వాగులు, చెరువులు, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన వైర్ల దగ్గరకు వెళ్లకూడదని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ టీయూ లోగో ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం టీఆర్ టీయూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.1
- గద్దెనెక్కిoచిన మేము గద్దెనుoడి దిoచగలము కూడా అంటూ చైర్మన్ కు ఎంఐఎం ప్రెసిడెంట్ అత్తర్ అహ్మద్ స్ట్రాంగ్ వార్నింగ్ జహీరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ ప్రకoపనులు మిత్రపక్షం ఎంఐఎం నుంచే చైర్మన్ కు షాక్ జహీరాబాద్ మున్సిపల్ రాజకీయంల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది తమ మద్దతుతో చైర్మన్ పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ యూనుస్ ఇప్పుడు తమనె విస్మరిస్తూన్నరoటూ ఎంఐఎం పార్టీ జహీరాబాద్ ఇంచార్జ్ అత్తర్ అహ్మద్ బహిరంగంగా విరుచుకు పడ్డారు 8వ వార్డ్ కౌన్సిలర్ సోనీ ఇర్మీయా ఆధ్వర్యంలో వార్డులో పర్యటించిన అత్తర్ అహ్మద్ వార్డులోని అధ్వాన్నoగా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు1
- ఏ సంపాదన లేకపోయినా ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నిలిచి, ప్రజల గుండెల్లో చెరగని ప్రేమను ఆస్తిగా మలుచుకున్న పెద్ది సుదర్శన్ అన్న నిజమైన ధనవంతుడు!1
- పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును చేదించిన పోలీసులు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో గత నెలలో జరిగిన పట్టపగటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు గోపాల్ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకున్నామని, చోరీ సొత్తును బాధితులకు అప్పగించే ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.1
- వర్షంలో కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర వర్షంలో కొనసాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు.1