రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. రంజాన్ మాసం శుభాల వసంతమని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రంజాన్ ఒక మహత్తర మాసమని,ఈ పేరు వినగానే మనస్సు భక్తితో, ఆనందంతో పులకరిస్తుందన్నారు. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిందని, రోజా (ఉపవాస వ్రతం)ఆరాధనను దైవం ఈ మాసంలోనే నిర్ణయించినందున ఈ మాసానికి పవిత్రత, గొప్పదనం వచ్చాయన్నారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలు చేయడం మహా పుణ్య కార్యమన్నారు.ఈ మాసం వాతావరణమంతా పుణ్యకారం, దైవభీతి అనే సుగుణాలతో నిండాలని,ఈ పవిత్ర రంజాన్ మాసం మానవాళికి శాంతి సందేశం అందించాలని ,అందరి ఇంట సుఖ శాంతులు నిండాలని, రంజాన్ శోభతో రాయచోటి ప్రాంతం విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలుకు, ప్రత్యేక ప్రార్థనలుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, మున్సిపాలిటీ శాఖలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి ముస్లిం సోదరులుకు రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. రంజాన్ మాసం శుభాల వసంతమని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.రంజాన్ ఒక మహత్తర మాసమని,ఈ పేరు వినగానే మనస్సు భక్తితో, ఆనందంతో పులకరిస్తుందన్నారు. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించిందని, రోజా (ఉపవాస వ్రతం)ఆరాధనను దైవం ఈ మాసంలోనే నిర్ణయించినందున ఈ మాసానికి పవిత్రత, గొప్పదనం వచ్చాయన్నారు. నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాసాలు చేయడం మహా పుణ్య కార్యమన్నారు.ఈ మాసం వాతావరణమంతా పుణ్యకారం, దైవభీతి అనే సుగుణాలతో నిండాలని,ఈ పవిత్ర రంజాన్ మాసం మానవాళికి శాంతి సందేశం అందించాలని ,అందరి ఇంట సుఖ శాంతులు నిండాలని, రంజాన్ శోభతో రాయచోటి ప్రాంతం విరజిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలుకు, ప్రత్యేక ప్రార్థనలుకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్, మున్సిపాలిటీ శాఖలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్ రెడ్డి ముస్లిం సోదరులుకు రంజాన్ మాసపు ప్రారంభపు శుభాకాంక్షలు తెలిపారు.
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- Post by Chand Basha (సప్తమందిర సముదాయం) official1
- బద్వేలు:రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం కావడంతో బద్వేలు పట్టణంలోని పెద్ద మజీద్ ను మునిసిపల్ కమీషనర్ నరసింహారెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా మసీదు పరిసరాలను పరిశీలించిన కమీషనర్ నరసింహారెడ్డి, మత పెద్దల విజ్ఞప్తి మేరకు రంజాన్ మాసం మొత్తం లైటింగ్, శానిటేషన్, వాటర్ సప్లై సంబంధిత ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా రాత్రి ప్రార్థనల సమయంలో సరిపడా వీధి దీపాలు పనిచేసేలా చూడాలని, మసీదు చుట్టుపక్కల పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ రమణయ్య, ఇంచార్జి టిపిబిఓ నరసయ్య ముస్లిం మత పెద్దలు మహుబూబ్ భాష (బిగ్ బాస్), నూరుల్లా, మస్తాన్ మౌలాలి, భాష తదితరులు పాల్గొన్నారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లె: బాలిక రిషిక ప్రియాను హత్య చేసిన ప్రదేశంలో ఉద్రిక్తత. వందలాదిగా తరలివచ్చిన స్థానికులు.. హిజ్రాలు సైతం రంగ ప్రవేశం.హంతకున్ని అప్పగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు... ప్రజా కోర్టులో నిందితుని శిక్షించాలని సిపిఐ నాయకులు సాంబ డిమాండ్.1