రాష్ట్ర ప్రభుత్వం త్వరగా కొత్త పింఛన్లు మంజూరు చెయ్యాలి: భీశెట్టి రాష్ట్రంలోని కొత్త పింఛన్లు కోసం అర్హులైన వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగులు, దీర్ఘకాళిక రోగులు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు.బుధవారం జామిలో విలేకరులతో మాట్లాడుతూ సామాజిక పింఛను వయోపరిమితిని 65P ఏళ్ళ నుండి 60 కి కుదిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మౌనం గా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాళిక రోగులు తమకి పింఛను మంజూరు చెయ్యమని ప్రజా ప్రతినిధుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ నిత్యం తిరుగుతున్నారన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక నియోజకవర్గం లో ఎమ్మెల్యేలు అధికారులు తిరగలేని పరిస్థితి ఉందని ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర కేబినెట్ లో చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకోవాలని భీశెట్టి కోరారు. గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన జిల్లా కలెక్టర్, ఎస్పీల సమావేశంలో ప్రతి జిల్లాకి రెండువందల అత్యవసర పింఛన్ లు మంజూరు చేసే అధికారం జిల్లాకలెక్టర్ లకు ఇచ్చినట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటికి ఏడు మాసాలు అయినా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని భీశెట్టి ఆరోపించారు.దీనివలన ప్రీమిటివ్ గిరిజనులు, హిజ్రాలు, జిల్లాల్లో తీవ్ర అనారోగ్యం తో ఉన్నవారు పింఛన్ తప్ప మరే ఆధారం లేనివారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.లోక్ సత్తా నుండి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని,చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా కోరామని అయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరగా కొత్త పింఛన్లు మంజూరు చెయ్యాలి: భీశెట్టి రాష్ట్రంలోని కొత్త పింఛన్లు కోసం అర్హులైన వృద్ధాప్య, వితంతువు, దివ్యాంగులు, దీర్ఘకాళిక రోగులు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు.బుధవారం జామిలో విలేకరులతో మాట్లాడుతూ సామాజిక పింఛను వయోపరిమితిని 65P ఏళ్ళ నుండి 60 కి కుదిస్తామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మౌనం గా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాళిక రోగులు తమకి పింఛను మంజూరు చెయ్యమని ప్రజా ప్రతినిధుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాలచుట్టూ నిత్యం తిరుగుతున్నారన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక నియోజకవర్గం లో ఎమ్మెల్యేలు అధికారులు తిరగలేని పరిస్థితి ఉందని ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర కేబినెట్ లో చంద్రబాబు తగిన నిర్ణయం తీసుకోవాలని భీశెట్టి కోరారు. గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన జిల్లా కలెక్టర్, ఎస్పీల సమావేశంలో ప్రతి జిల్లాకి రెండువందల అత్యవసర పింఛన్ లు మంజూరు చేసే అధికారం జిల్లాకలెక్టర్ లకు ఇచ్చినట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటికి ఏడు మాసాలు అయినా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదని భీశెట్టి ఆరోపించారు.దీనివలన ప్రీమిటివ్ గిరిజనులు, హిజ్రాలు, జిల్లాల్లో తీవ్ర అనారోగ్యం తో ఉన్నవారు పింఛన్ తప్ప మరే ఆధారం లేనివారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.లోక్ సత్తా నుండి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశామని,చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కూడా కోరామని అయన అన్నారు.
- శ్రీకాకుళం, ఏప్రిల్ 14: భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల తలరాతను మార్చిన మహాశక్తి అని కొనియాడారు. పేద దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆయన, చదువుతోనే ఏదైనా సాధ్యమని నిరూపించారన్నారు. అందుకే ఎన్టీ రామారావు హయాంలో ఎస్సీ, బీసీ వర్గాల కోసం పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి విద్యా విప్లవానికి నాంది పలికారని గుర్తు చేశారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలో రక్షణలు కల్పించారని, దానికి కొనసాగింపుగా త్వరలోనే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని సృష్టించబోతోందని తెలిపారు. జిల్లాలోని సంజీవయ్య పార్కును సుందరంగా తీర్చిదిద్దుతామని, హాస్టల్ పాఠశాలల్లో మౌలిక వసతులు, స్వచ్ఛమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చట్టాలు సక్రమంగా అమలు జరిగినప్పుడే సామాన్యులకు మేలు: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం మనకు ఎన్ని గొప్ప హక్కులు కల్పించినా, వాటిని అధికారులు, పాలకులు చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా అనేక హాస్టళ్లు, గురుకుల పాఠశాలలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న కాలంలోనే అంబేద్కర్ కు 'భారతరత్న' దక్కిందని, ఆయన స్ఫూర్తితోనే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని అన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరి రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే ఆత్మాభిమానం, వ్యక్తి వికాసం సాధ్యమని, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిని సమానంగా గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, చౌదరి బాబ్జి, రమణ మాదిగ, బొడ్డేపల్లి నరసింహులు మాదారపు వెంకటేష్, దుర్గారావు, మన్మధ, కొవ్వాడ సుశీల, రాయి వేణు, గేదెల రమణమూర్తి, టైక్వాండో శ్రీను, పలువురు నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- Post by Kundoori Prakash1
- కర్ణాటక::మంగళూరులో ఒక మహిళ, రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో అతను ఆమెను తప్పించబోయి, అదుపుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది. ఆటో అప్పుడే అదే రోడ్డుపై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది. అది సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశారు.1
- monthly Passive income Start Cheyandi1
- రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కురుపాం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు కార్యక్రమంలో బిజెపి నాయకులు బోటు అనిల్ కుమార్, సీనియర్ నాయకులు నడుకూరు దూళికేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు దూలకేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు నేడు, ఏప్రిల్ 14. దేశ నిర్మాణంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన అలుపెరగని కృషికి గుర్తుగా జరుపుకునే అంబేద్కర్ జయంతి నేడు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తుచేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ గెంబలి ప్రదీప్ కుమార్, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ ఎన్ పురం శ్రీనివాసరావు, అద్దేపల్లి నిర్మల పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు1
- *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*1
- దళిత, నిమ్నకులాలు ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంభేడ్కర్ అని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు సిర్ల ప్రసాద్ అన్నారు. ఆయన 135.వ.జయంతి సందర్భంగా మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలో ఆయన శిలావిగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. నేటికి ఏనాటికైనా ఆయన రచించిన రాజ్యాంగం శిలా శాసనమని అన్నారు. ప్రజాసంఘాలు నేతలు పాల్గొన్నారు.8
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నివాసం ఉంటున్న దేవి పాపా వింత అనారోగ్యంతో బాధపడుతుంది పుట్టిన్నుంచి వెన్నెముక వంకరగా నడవడానికి ఇబ్బంది పడుతూ రోజురోజుకు నరకయాతన అనుభవిస్తుంది. నిటారుగా నిలవలేని పరిస్థితి ఏర్పడింది వైద్య చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనస్థితిలో ఉండి తమ తల్లి కూతుర్ని కాపాడుకోవాలని అందరిని ప్రాధేయ పడుతోంది.1