ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కూటమి నేతలతో కలిసి ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరిస్తున్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్.. కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న .. భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు . ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం కోసం వచ్చిన వినతులను స్వీకరించారు.. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.. బాధితులకు కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు... 54 డివిజన్, వించి పేటకు చెందిన కమల్ ఖాన్ (51) హృద్రోగంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను బుద్ధా వెంకన్న కూటమి నేతలతో కలిసి అందజేశారు కూటమి నేతలు గుర్రం కొండ, కామ దేవరాజ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, తిరుపతి అనూష, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కూటమి నేతలతో కలిసి ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరిస్తున్న టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్.. కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న .. భవానిపురం ,ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్ధా వెంకన్న, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు . ప్రజల నుండి అర్జీలు స్వీకరించి బాధితుల సమస్యలను ఓపికగా విని వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, వైద్య సహాయం కోసం వచ్చిన వినతులను స్వీకరించారు.. వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.. బాధితులకు కూటమి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు... 54 డివిజన్, వించి పేటకు చెందిన కమల్ ఖాన్ (51) హృద్రోగంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6 లక్షల 50 వేల విలువైన ఎల్ ఓ సీ ను బుద్ధా వెంకన్న కూటమి నేతలతో కలిసి అందజేశారు కూటమి నేతలు గుర్రం కొండ, కామ దేవరాజ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, తిరుపతి అనూష, తిరుపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు..
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ1
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.2