ఆదివాసి హక్కులను పరిరక్షించాలి. ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90 పోలవరం జిల్లా, చింతూరు డివిజన్ ,చింతూరు నేటి యువతరం గూడూరు గ్రామపంచాయతీ ఆదివాసుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90 మండల కార్యదర్శి ధూబి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13న ఆదివాసుల హక్కుల పరిరక్షణ దినం సందర్భంగా గూడూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసులు తరతరాలుగా అడవులు, భూములు, జల వనరులపై ఆధారపడి జీవిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివాసి మహిళలకు రక్షణ కల్పించాలి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసి మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ధూబి లక్ష్మయ్య కోరారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు, హక్కుల ఉల్లంఘనలను అరికట్టి, బాధితులకు తక్షణ న్యాయం అందించే విధంగా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల్లో రాజకీయ చైతన్యం పెరగాలి* ఆదివాసి సమాజంలో రాజకీయ చైతన్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ హక్కులు, చట్టాలు, రాజ్యాంగ పరిరక్షణలపై అవగాహన పెంచుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివాసి యువత, మహిళలు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. *షెడ్యూల్డ్ ప్రాంతాల ఆదివాసి యువతకు ప్రత్యేక ఉద్యోగ చట్టం చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేక ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి చదువుకున్నప్పటికీ స్థానిక ఆదివాసి యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదని, దీనివల్ల యువత వలసలకు గురవుతున్నారని అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసి యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించేందుకు ఆదివాసి సమాజం ఐక్యంగా ఉద్యమించాలని ధూబి లక్ష్మయ్య పిలుపునిచ్చార ఈ కార్యక్రమంలో మడివి ముత్తయ్య అడవి రాజీవ్ గాంధీ మడవి రాజయ్య,, గంగయ్య ఒగ్గేలా బజారు మడివి బీముడు తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసి హక్కులను పరిరక్షించాలి. ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90 పోలవరం జిల్లా, చింతూరు డివిజన్ ,చింతూరు నేటి యువతరం గూడూరు గ్రామపంచాయతీ ఆదివాసుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ 3898/90 మండల కార్యదర్శి ధూబి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13న ఆదివాసుల హక్కుల పరిరక్షణ దినం సందర్భంగా గూడూరు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసులు తరతరాలుగా అడవులు, భూములు, జల వనరులపై ఆధారపడి జీవిస్తున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కులు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు సమర్థవంతంగా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివాసి మహిళలకు రక్షణ కల్పించాలి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసి మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ధూబి లక్ష్మయ్య కోరారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు, హక్కుల ఉల్లంఘనలను అరికట్టి, బాధితులకు తక్షణ న్యాయం అందించే విధంగా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల్లో రాజకీయ చైతన్యం పెరగాలి* ఆదివాసి సమాజంలో రాజకీయ చైతన్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. తమ హక్కులు, చట్టాలు, రాజ్యాంగ పరిరక్షణలపై అవగాహన పెంచుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివాసి యువత, మహిళలు, ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. *షెడ్యూల్డ్ ప్రాంతాల ఆదివాసి యువతకు ప్రత్యేక ఉద్యోగ చట్టం చేయాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేక ఉద్యోగ నియామక చట్టాన్ని ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి చదువుకున్నప్పటికీ స్థానిక ఆదివాసి యువతకు తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదని, దీనివల్ల యువత వలసలకు గురవుతున్నారని అన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక ఆదివాసి యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసుల హక్కులు, భూమి, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని పరిరక్షించేందుకు ఆదివాసి సమాజం ఐక్యంగా ఉద్యమించాలని ధూబి లక్ష్మయ్య పిలుపునిచ్చార ఈ కార్యక్రమంలో మడివి ముత్తయ్య అడవి రాజీవ్ గాంధీ మడవి రాజయ్య,, గంగయ్య ఒగ్గేలా బజారు మడివి బీముడు తదితరులు పాల్గొన్నారు.
- ఇన్స్టా లవ్... ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి...భార్యను చూసి భర్త షాక్...!! గుజరాత్ లో ఓ యువకుడికి ఇన్స్టాగ్రామ్లో ఓ యువతి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో సుమారు 10 నెలల పాటు ఫోన్లోనే వారి రొమాన్స్ సాగింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి ఆ నవవధువు భర్తకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వధువు ముఖంపై ఉన్న ముసుగు తొలగించి అసలు నిజం బయటపెట్టడంతో ఖాకీలు సైతం అవాక్కయ్యారు. ముసుగు వెనుక ఉన్నది వధువు కాదని, స్వయంగా ఓ అబ్బాయని పెళ్లి కోసం ఈ వేషధారణ వేసినట్లు తేలింది. ఈ వింత ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.1
- భద్రాచలం: గరుడ ఆకారంలో గణనాథుడు.. ఆకట్టుకుంటున్న అలంకరణ భద్రాచలం బస్టాండ్ ఎదురుగా అశోక్నగర్ కాలనీలో గరుడ పక్షి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగురంగుల లైట్లతో ప్రత్యేక డెకరేషన్ చేసి మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ‘భద్రాద్రి కా మహారాజ్’ పేరుతో మూడో ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహం, డెకరేషన్కు సుమారు రూ.14 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.1
- ప్రత్యేక ఆకర్షణ: బేగంబజార్లో అద్భుతం.. 48 కిలోల ‘బంగారు గణేశుడు *ప్రత్యేక ఆకర్షణ:* వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్ఖానాలో కొలువుదీరిన దివ్య మూర్తి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. *స్వర్ణ శోభ:* సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్ మరియు 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా ఈ విగ్రహాన్ని అలంకరించారు. *కళా నైపుణ్యం:* అత్యంత నిపుణులైన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో ఈ అరుదైన విగ్రహం రూపుదిద్దుకుంది. *ప్రత్యేక ప్రేరణ:* ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, తిరుపతి బాలాజీ రూపాల స్ఫూర్తితో ఈ స్వర్ణ గణనాథుడిని అద్భుతంగా మలిచారు. ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ మరియు అరుదైన వినాయక విగ్రహంగా బేగంబజార్లోని ఈ స్వర్ణ గణేశుడు భక్తుల పూజలందుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1
- హైదరాబాద్లో దారునా హత్యా సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గోదావ *లైవ్ మర్డర్ వీడియో..!* హైదరాబాద్లో ఇదీ లా అండ్ ఆర్డర్ దుస్థితి హత్యతో నగరంలో భయాందోళనలు ఇద్దరు రౌడీషీటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగానే హత్య ప్రాణ స్నేహితుడినే దారుణంగా హత్య నాగోల్ బండ్లగూడలో పాత కక్షల నేపథ్యంలోనే మహమ్మద్ నహీమ్ను దారుణంగా హత్య చేసిన మహేష్ హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్లో నివాసముంటున్న మహమ్మద్ నహీమ్ సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ఘర్షన ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1