తుఫాను ప్రభావంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పలమనేరు అక్టోబర్ 26( ప్రజా ప్రతిభ) పలమనేరు మండలంలో రాబోవు మూడు రోజులు 27 ,28,29, తేదీలలో తుఫాను ప్రభావం అధికముగా ఉండడంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలమనేరు మండలం రెవెన్యూ అధికారి ఇన్బునాథన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ అధికారులు అంచనా మేరకు సోమ, మంగళ, బుధవారం ఈ మూడు రోజులు పాటు తుఫాన్ అధికంగా ఉన్నందున ప్రజలు, సురక్షితంగా ఉండాలనే సంకల్పముతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మండల అధికారులు ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే మండల పరిధిలో ఉన్న చెరువులు కుంటలు ,వంకలు ,వాగులు పూర్తిగా నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయని వివరించారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెద్దలు చిన్నపిల్లలు అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని ఎప్పుడు పడితే అప్పుడు చెరువులు ,వంకలు ,వాగులు ,నదులు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పాటించాలని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక చోట్ల నీటి ప్రవాహం వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తుఫాను ప్రభావం సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రజలు వ్యక్తిగత భద్రత తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ,పంటలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సహాయ చర్యల కోసం సంబంధిత విఆర్ఓ, తహసిల్దారును సంప్రదించాలని కోరారు. నీటి ప్రవాహం తక్కువగా ఉందని ప్రజలు మొండి ధైర్యంతో వంకలు ,వాగులు ,నదులు దాటడానికి ఇటువంటి ప్రయత్నం చేయవద్దని తెలిపారు
తుఫాను ప్రభావంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పలమనేరు అక్టోబర్ 26( ప్రజా ప్రతిభ) పలమనేరు మండలంలో రాబోవు మూడు రోజులు 27 ,28,29, తేదీలలో తుఫాను ప్రభావం అధికముగా ఉండడంతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలమనేరు మండలం రెవెన్యూ అధికారి ఇన్బునాథన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ అధికారులు అంచనా మేరకు సోమ, మంగళ, బుధవారం ఈ మూడు రోజులు పాటు తుఫాన్ అధికంగా ఉన్నందున ప్రజలు, సురక్షితంగా ఉండాలనే సంకల్పముతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, మండల అధికారులు ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే మండల పరిధిలో ఉన్న చెరువులు కుంటలు ,వంకలు ,వాగులు పూర్తిగా నిండిపోయి పొంగి ప్రవహిస్తున్నాయని వివరించారు. ప్రత్యేకంగా తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపకుండా ఇంటి వద్దనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెద్దలు చిన్నపిల్లలు అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావద్దని ఎప్పుడు పడితే అప్పుడు చెరువులు ,వంకలు ,వాగులు ,నదులు పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పాటించాలని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక చోట్ల నీటి ప్రవాహం వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తుఫాను ప్రభావం సాధారణ స్థితికి వచ్చేవరకు ప్రజలు వ్యక్తిగత భద్రత తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ,పంటలకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సహాయ చర్యల కోసం సంబంధిత విఆర్ఓ, తహసిల్దారును సంప్రదించాలని కోరారు. నీటి ప్రవాహం తక్కువగా ఉందని ప్రజలు మొండి ధైర్యంతో వంకలు ,వాగులు ,నదులు దాటడానికి ఇటువంటి ప్రయత్నం చేయవద్దని తెలిపారు
- మోడ్రన్ హరిదాసు : విష్ణు నామ సంకీర్తనలు పాడుచు వీధులు తిరుగుచున్న మోడరన్ హరిదాసు1
- సుపరిపాలనకు వాజ్పేయీ మార్గదర్శి మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శ్రీకాకుళం, డిసెంబరు 19: దేశాభివృద్ధికి, సుపరిపాలనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ మార్గదర్శకుడని రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. శ్రీకాకుళం నగరం సూర్యమహాల్ కూడలిలో ఏర్పాటు చేసిన వాజ్పేయీ కాంస్య విగ్రహాన్ని వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. వాజ్పేయీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి వంటి రవాణా వ్యవస్థల ఆధునీకరణే నేటి భారత్ పురోగతికి బలమైన పునాదులని పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీతి, నిజాయితీతో కూడిన పాలనను అందిస్తున్నాయని, సుపరిపాలన ద్వారానే సామాన్యుడికి సంక్షేమ ఫలాలు అందుతాయని వివరించారు. వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు పీపీపీ: వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరతను తీర్చవచ్చని తెలిపారు. కళాశాలల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానిదే ఉంటుందని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రక్రియ సాగుతోందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు.1