Shuru
Apke Nagar Ki App…
ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చేలా బోధన చేయాలి ఏలూరులో వెంకటరావుపేట స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలను బోధించే విధానాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠ్య పుస్తకాలలో అంశాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రతీ విద్యార్ధీ ఇష్టంతో విద్య అభ్యసించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. విద్యార్థులతో మమేకమై వారికి ఇష్టమైన రీతిలో విద్యా బోధనా చేయాలన్నారు.
Ram
ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చేలా బోధన చేయాలి ఏలూరులో వెంకటరావుపేట స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలను బోధించే విధానాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠ్య పుస్తకాలలో అంశాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రతీ విద్యార్ధీ ఇష్టంతో విద్య అభ్యసించేలా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. విద్యార్థులతో మమేకమై వారికి ఇష్టమైన రీతిలో విద్యా బోధనా చేయాలన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో జిల్లా కోర్టు ఉద్యోగి అర్జా లక్ష్మీ ఇంట్లో గ్యాస్ లీకేజ్తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.7 లక్షల నష్టం వాటిల్లగా కుటుంబం ప్రాణాలతో బయటపడింది. బాధితులకు లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ చైర్మన్ లంకిశెట్టి బాలాజీ నిత్యావసర వస్తువులు, బియ్యం, బట్టలు, వంట సామాగ్రి, రూ.5,000 నగదు అందజేశారు. ప్రభుత్వం అగ్ని బాధితులకు పక్కా ఇల్లు, ఆర్థిక సాయం కల్పించాలని ఆయన కోరారు.1
- *గుంటూరు జిల్లా పోలీస్...* *గుంటూరు ట్రాఫిక్ విభాగం* _*//గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించేందుకు బైకుపై క్షేత్రస్థాయిలో పర్యటించిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 గుంటూరు నగరంలోని ట్రాఫిక్ పరిస్థితులను, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రదేశాలను, ట్రాఫిక్ డైవర్షన్లను పరిశీలించేందుకు గౌరవ జిల్లా ఎస్పీ గారు ఈ రోజు సాయంత్రం గుంటూరు నగరం మొత్తం ద్విచక్ర వాహనంపై క్షేత్ర స్థాయిలో పర్యటించి, పరిశీలించారు. 📍 శంకర్ విలాస్ నిర్మాణం నేపథ్యంలో గుంటూరు నగరంలో అప్పుడప్పుడు, అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గౌరవ ఎస్పీ గారికి అందిన సమాచారం మేరకు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. 📍కంకర గుంట అండర్ పాస్ - గుజ్జనగుండ్ల సెంటర్ - కోరిటపాడు రోడ్డు - NTR స్టేడియం సర్కిల్ - లక్ష్మీ పురం మెయిన్ రోడ్ - మదర్ థెరిస్సా స్టాట్యూ సెంటర్ - లాడ్జ్ సెంటర్ - శ్రీనగర్ మెయిన్ రోడ్ - మూడు వంతెనల అండర్ పాస్ - కొత్తపేట శివాలయం జంక్షన్ - గుంట గ్రౌండ్ సెంటర్ - RTC బస్టాండ్ ప్రాంతం - BR స్టేడియం సర్కిల్ - హిమనీ సెంటర్ - MTB సెంటర్ - ఉమెన్ కాలేజ్ సెంటర్ - నాజ్ సెంటర్ - రైల్వే స్టేషన్ - కోర్ట్ రోడ్డు - SBI బ్యాంక్, నగరం పాలెం - జిల్లా పోలీస్ కార్యాలయం.ఈ విధంగా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ డైవర్షన్ ప్రదేశాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్రధాన సిగ్నలింగ్ ప్రదేశాలు మొదలగు వాటివి పరిశీలించి, ఎక్కడెక్కడ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో! పరిశీలించి, ఆయా ప్రాంతాల్లో తీసుకోవలసిన ట్రాఫిక్ నియంత్రణ చర్యల గురించి, అదనపు ట్రాఫిక్ సిబ్బందిని నియమించవలసిన అవశ్యకత గురించి చర్చించారు. 📍రోడ్లపై ఎక్కడైనా ఆక్రమణలు గమనిస్తే మున్సిపల్ వారి సహకారంతో వెంటనే తొలగించాలని, వ్యాపార సముదాయాల ముందర వాహనాలు రోడ్లపై నిలపకుండా వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. 📍RTC బస్టాండ్ వద్ద ప్రైవేటు బస్సులు, ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆగకుండా నిర్ణీత పార్కింగ్ ప్రదేశాలను కేటాయించే విధంగా, అదే విధంగా బస్సులు, ట్రావెల్ బస్సులు నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా వాటికి నిర్ణీత బస్టాప్ లను కేటాయించే విధంగా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం జరిమానా విధించాలని సూచించారు. 📍నగరంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సమయానికి తమ విధి నిర్వహణ ప్రదేశానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైతే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. 📍వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, పోలీస్ వారికి సహకరించాలని లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 📍 గౌరవ ఎస్పీ గారికి నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల గురించి నగర ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ అశోక్ గారు, వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య గార్లు వివరించారు. 👉 ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ట్రాఫిక్ డీఎస్పీ గారు,ట్రాఫిక్ సీఐలు, ఈస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, కొత్తపేట సీఐ వీరయ్య గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు..1
- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.3