logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

షాద్‌నగర్‌లో నకిలీ వైద్యుల గుబులు.. అధికారుల నిఘా ఎక్కడ? హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పట్టణం, పరిసర ప్రాంతాల్లో 60కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు కొనసాగుతున్నట్లు సమాచారం.వైద్య రంగంలో అర్హత, రిజిస్ట్రేషన్ అత్యంత కీలకమైనప్పటికీ, కొందరు వ్యక్తులు సరైన వైద్య విద్యార్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కాంపౌండర్లుగా పనిచేసిన అనుభవంతోనే వైద్యులుగా చలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల రిజిస్ట్రేషన్లు, క్లినిక్‌ల అనుమతులు, ఫైర్‌ సేఫ్టీ, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, మందుల లైసెన్సులపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.ముఖ్యంగా గ్రామీణ, తండా ప్రాంతాల్లో ప్రజలకు వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించే అవకాశం లేకపోవడంతో పరిస్థితిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో వెళ్లిన రోగులకు అవసరానికి మించి ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. అత్యవసర చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేని క్లినిక్‌లలో తీవ్రమైన కేసులను నిర్వహించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో షాద్‌నగర్ డివిజన్‌లో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ప్రతి ఆసుపత్రి, క్లినిక్‌లో వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ నంబర్లు, సంబంధిత అనుమతులు స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో షాద్‌నగర్‌లోనూ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం కావడంతో ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హతలు లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారా? ఆసుపత్రులు, క్లినిక్‌లు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? అనే అంశాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

3 hrs ago
user_Dirshinam Shankar
Dirshinam Shankar
Local News Reporter ఫరూఖ్‌నగర్, రంగారెడ్డి, తెలంగాణ•
3 hrs ago
32a617b4-0051-4d27-8cd3-6cfe96d5460f

షాద్‌నగర్‌లో నకిలీ వైద్యుల గుబులు.. అధికారుల నిఘా ఎక్కడ? హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పట్టణం, పరిసర ప్రాంతాల్లో 60కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్‌హోమ్‌లు, క్లినిక్‌లు కొనసాగుతున్నట్లు సమాచారం.వైద్య రంగంలో అర్హత, రిజిస్ట్రేషన్ అత్యంత కీలకమైనప్పటికీ, కొందరు వ్యక్తులు సరైన వైద్య విద్యార్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కాంపౌండర్లుగా పనిచేసిన అనుభవంతోనే వైద్యులుగా చలామణి అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యుల రిజిస్ట్రేషన్లు, క్లినిక్‌ల అనుమతులు, ఫైర్‌ సేఫ్టీ, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, మందుల లైసెన్సులపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.ముఖ్యంగా గ్రామీణ, తండా ప్రాంతాల్లో ప్రజలకు వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించే అవకాశం లేకపోవడంతో పరిస్థితిని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలతో వెళ్లిన రోగులకు అవసరానికి మించి ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తున్నారనే ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. అత్యవసర చికిత్సకు అవసరమైన సౌకర్యాలు లేని క్లినిక్‌లలో తీవ్రమైన కేసులను నిర్వహించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో షాద్‌నగర్ డివిజన్‌లో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. ప్రతి ఆసుపత్రి, క్లినిక్‌లో వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్‌ నంబర్లు, సంబంధిత అనుమతులు స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో షాద్‌నగర్‌లోనూ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం కావడంతో ఫిర్యాదుల కోసం ఎదురుచూడకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హతలు లేని వ్యక్తులు వైద్యం చేస్తున్నారా? ఆసుపత్రులు, క్లినిక్‌లు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా? అనే అంశాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
    1
    కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు
కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
    user_S M S R R
    S M S R R
    Graphic designer కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
భారతరత్న మదర్ థెరిస్సా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చౌరస్తాలో మదర్ థెరీస్సా చిత్రపటానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆమె మార్గంలో నడిచి సేవాకార్యక్రమాలలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీ ముదిరాజ్, రేమండ్ హార్ ఉడ్, నరేష్, డెంజిల్, ప్రభు, ఆంథోనీ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242 Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers
    1
    ANS Comfort Mattresses Manufacturers in Hyderabad Call Now: 9912524242
Orthopedic Mattresses Mattresses Manufacturers company #Hyderabad sleep mattress manufacturers
    user_ANS Mattresses Manufacturers i
    ANS Mattresses Manufacturers i
    Electrician హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా? ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది * మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    1
    భూములను నిషేధిత జాబితాలో ఎవరు పెట్టమన్నారు: హరీష్ రావు 
ఎవడు ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టమని చెప్పాడు
ఇన్ని లక్షల మంది నిద్ర లేని రాత్రులు గడపడానికి కారకుడైన వాడిని శిక్షించాలి
ఈ భూములను రేపు నిషేధిత జాబితా నుండి తీసేసినా, మళ్లీ పెడతారేమో అని భయపడి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారా?
ఇంతమందిని ఆగం చేయడానికి కారణమైనోడు ఎవడో తెలియాలి కదా
అందుకే దీని మీద తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది
* మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    23 hrs ago
  • కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం. కొండా సుష్మిత అదెవతి... దానికెందుకు ఇస్తాం మేము టికెట్.. మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు.. కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.
    1
    కొండా సుష్మిత అదెవతి...

దానికెందుకు ఇస్తాం మేము టికెట్..

మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు..
కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.
కొండా సుష్మిత అదెవతి...
దానికెందుకు ఇస్తాం మేము టికెట్..
మా పార్టీకే సంబంధం లేదు.. మా పార్టీలో సభ్యత్వం లేదు..
కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    1 hr ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    1
    హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    8 hrs ago
  • *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం* హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు.. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం.
    1
    *సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం*

హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు.. 

కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ట్రావెల్స్‌ బస్సు.. 
కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 
ప్రమాదం ధాటికి బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేసినట్లు సమాచారం.
    user_ఏబ్బనూర్ అంజిలయ్య
    ఏబ్బనూర్ అంజిలయ్య
    Electrician Dharur, Vikarabad•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.