Shuru
Apke Nagar Ki App…
కామాంధుడు చెరువు లో దూకి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఏడేళ్ల బాలిక హత్యాచారం కేసు నిందితుడు మృతి మదనపల్లి పట్టణం నీరు గట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు.
Chandrasekhar Tdp
కామాంధుడు చెరువు లో దూకి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి ఏడేళ్ల బాలిక హత్యాచారం కేసు నిందితుడు మృతి మదనపల్లి పట్టణం నీరు గట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో శవమై తేలాడు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆడపిల్ల గా పుట్టడం ఆ చిట్టి తల్లి చేసుకున్న కర్మ అని అందమా?.... సిగ్గుపడాలి ఈ సమాజం మన కంటే అడవిలో వుండే మృగాలు వంద రెట్లు బెటర్ గా వున్నాయి... తల్లి నీ మరణానికి కారణం ఈ సమాజమే ప్రతి ఒక్కరు బాద్యులే1
- RTCని ప్రైవేటీకరణ చేస్తే సహించం: JAC గుంటూరు:ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని గుంటూరు-2 డిపో ఎంప్లాయిస్ JAC ఆరోపించింది. కమిటీ ఆధ్వర్యంలో బుధవారం APSRTC ఉద్యోగులు గుంటూరు NTR బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను RTC సంస్థ నేరుగా నడపాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని పేర్కొన్నారు.1
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- వేమలపల్లి మండలం శేట్టిపాలెం గ్రామంలో యూరియా ఆన్లైన్ విధానాన్ని తీసివేయాలని, రైతాంగానే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు గ్రామ రైతులు పెద్ద ఎత్తున శేట్టిపాలెం గ్రామ కో-ఆపరేటివ్ బ్యాంక్ ను ముట్టడి చేశారు మరియు యూరియా పంపిణి అడ్డుకున్నారు. పోలీసులు బిజెపి శ్రేణులతో వాగ్వాదం జరగడంతో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూ యూరియా ఆన్లైన్ విధానం వల్ల రైతులు గోసపడుతున్నారని,, బుకింగ్ సమయం లో రెండు మూడు నిమిషాల్లోనే యూరియా పూర్తిగా అయిపోతుందని, అన్ని గ్రామాలకు సంబంధించిన కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఆ గ్రామానికి సంబంధించిన రైతులకు యూరియా అందించాలని పక్క ఊరి రైతులకు ఇవ్వడం వల్ల ఇక్కడి గ్రామ రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆన్లైన్ విధానం వల్ల పాస్ పుస్తకాలు పట్టుకొని రైతులు రోడ్ల వెంట తిరుగుతున్నారని ఆన్లైన్ విధానం తెలియని రైతులు ఒక్క దశలోనూ యూరియా అందలేదని వరి పొలాలకు ఇప్పుడు యూరియా అత్యవసరమని యూరియా అందకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని నిరక్షరాశులయిన రైతులు,మహిళా రైతులు,ఆన్లైన్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని, శెట్టిపాలెం గ్రామానికి సంబంధించిన రైతాంగానికి యూరియా దొరకడం లేదు అని ప్రతిరోజు టన్నుల కొద్దీ యూరియా వస్తున్న యూరియా కొరత గ్రామంలో తీవ్రంగా ఉంది, కోపరేట్ సొసైటీ ఉన్నప్పటికీ యూరియా దొరకపోవడం బాధాకరమని తక్షణమే ప్రత్యేకంగా శెట్టిపాలెం గ్రామ రైతులకు యూరియా తీసుకురావాలని AEO కిషన్ నాయక్ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవ్వాజి సత్యనారాయణ యాదవ్, బీజేపీ జిల్లా నాయకులు బోల్లేదు లవయ్య,బీజేపీ గ్రామ వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, ఇరుగుదిండ్ల జ్యోతి నవీన్, బిజెపి నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేకర్, కోల చంద్రయ్య, ఆలకుంట్ల మధు, ఈట మహేష్,జగినాల రమేష్ దుండిగల రేణుక, బోగారి సైదులు, పాలడుగు శంకర్, సతీష్, శీను, మహేష్, రామకృష్ణ, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- పురుగుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం....... - ఇదేమిటి అని అడిగితే బూతు మాటలతో ఎదురుదాడి...... - ఇట్లనే చేస్తే హాల్ టికెట్ ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి...... వెల్దండ: మండల కేంద్రాల్లోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినిలు వారం రోజుల నుండి ఉడికి ఉడకని పురువుల అన్నం తినలేక పస్తులు ఉంటున్నాం,బుధవారం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి పై బైఠాయించి ప్రిన్సిపాల్ డాం డాం అంటూ ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ స్వర్ణ రత్నం ను సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.మాట్లాడుతూ పురుగుల అన్నం పెడుతూ, అడిగితే పురుగులను తీసేసి తినండి అంటున్నారని, సమస్య ఎవరికైన చెప్పిన మమ్మల్ని టార్గెట్ చేసేవారని తెలిపారు. ప్రతి నెల విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసుకునేదని, ఎందుకు మేడం అంటే పాఠశాల లో మౌలిక వసతుల కోసమని చెప్పేది కానీ ఆ డబ్బులతో ఏమీ చేయకుండా సొంతంగా ఖర్చులకు ఉపయోగించుకునేదని తెలిపారు. ఫెస్టివల్ పార్టీ కానీ, ఫ్రెషర్ పార్టీ కానీ ప్రిన్సిపల్ మైక్ లోనే దుర్భాషలాడేదని, పురుగుల అన్నం తిని అస్వస్థతకు గురవుతున్నామని, మా ఆరోగ్యాలతో ప్రిన్సిపల్ చెలగాటం ఆడుతున్నారని,ఈ ప్రిన్సిపల్ మాకొద్దని, వెంటనే ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తేనే మేము పాఠశాల వెళ్తామన్నారు. ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని కార్తీక్ కుమార్, గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఎస్సై కురుమూర్తి హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు ఆగ్రహం.......... పురుగుల అన్నం తినలేక గురుకుల పాఠశాల విద్యార్థినీలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారని దళిత సంఘాల నాయకులు జంగిలి నిరంజన్, పోలే అశోక్, జంగిలి ఆనంద్, సామెల్, కొయ్యల పుల్లయ్య, గోరటి సుధాకర్, గోరటి సంజీవ, జంగిల్ ప్రవీణ్, ఏకుల వెంకటేష్, దుళ్ల పెద్దయ్య లతో పాటు మరి కొంతమంది నాయకులు ఆగ్రం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల చెందిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్నారని, వారికి పురుగుల అన్నం ఎట్లా పెడతారని, ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి సర్వీస్ రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ అలీ, పంచాయతీ కార్యదర్శి గిరి, ఆయా ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.6
- గుంటూరు జిల్లా ప్రజలు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని మంగళవారం SP వకుల్ జిందాల్ సూచించారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుల పేరుతో వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా RTOchallan.APK, echallan.APK ລ້ అనధికార లింకులు వస్తున్నాయని అన్నారు. ప్రజలు తెలియక ఈ లింకులను క్లిక్, డౌన్లోడ్ చేయడంవల్ల వారి మొబైల్ ఫోన్లు హ్యాక్కు గురవుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు చోరీ అవుతాయన్నారు.1