మహమ్మద్ జావేద్ మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర నాయకులు దయానంద్ విజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి* ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ దుర్మరణం పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యేతీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మోతే వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జావేద్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్, పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు కలిగిన నాయకుడు జావేద్ గారు అని అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. జావేద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఎమ్మెల్యే తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
మహమ్మద్ జావేద్ మృతి పట్ల ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర నాయకులు దయానంద్ విజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి* ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావేద్ దుర్మరణం పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యేతీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మోతే వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జావేద్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖమ్మం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జావేద్, పార్టీ కోసం నిరంతరం అంకితభావంతో పనిచేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజా సమస్యలపై స్పందించే గుణం, పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు కలిగిన నాయకుడు జావేద్ గారు అని అన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. జావేద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని ఎమ్మెల్యే తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- Post by V Ramarao3
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని, వారిని ఇబ్బందులకు గురిచేయకూడదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన స్వగృహంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1