Shuru
Apke Nagar Ki App…
ఎల్నినో ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంటలపై ఏ విధంగా పడుతుందో తెలుసా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుపై ఎల్నినో ప్రభావం పడుతోంది. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా సాధారణ సాగులో కేవలం 30 శాతం మాత్రమే పంటలు సాగులో ఉన్నాయి. సాధారణ సాగు 42 వేల హెక్టార్లు కాగా, కేవలం 14 హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితి వేరుశనగ పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేరుశనగ సాధారణ సాగు 21 వేల హెక్టార్లు కాగా, 2600 హెక్టార్లలో మాత్రమే ప్రస్తుతం సాగు అవుతోంది.
Reporter Pen Ppwer
ఎల్నినో ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంటలపై ఏ విధంగా పడుతుందో తెలుసా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుపై ఎల్నినో ప్రభావం పడుతోంది. ఖరీఫ్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా సాధారణ సాగులో కేవలం 30 శాతం మాత్రమే పంటలు సాగులో ఉన్నాయి. సాధారణ సాగు 42 వేల హెక్టార్లు కాగా, కేవలం 14 హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాభావ పరిస్థితి వేరుశనగ పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వేరుశనగ సాధారణ సాగు 21 వేల హెక్టార్లు కాగా, 2600 హెక్టార్లలో మాత్రమే ప్రస్తుతం సాగు అవుతోంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్ఎస్పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- పీలేరు వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది,ఠాగూర్’ సినిమా తరహాలో వైద్య మోసం? అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం జాండ్రపేట గ్రామానికి చెందిన కె. సురేంద్ర (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, వాటి కారణంగా నొప్పులు వస్తున్నాయని పీలేరులోని ఎస్ కె ఆర్ ఆసుపత్రి వైద్యులను బుధవారం సంప్రదించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం సురేంద్రను గురువారం ఆసుపత్రిలో చేర్చుకుని, కిడ్నీలోని రాళ్లు తొలగించేందుకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పి సుమారు రూ.35,000 తీసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్కు సంబంధించి మత్తు మందు ఇచ్చే సమయంలో సురేంద్ర ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని, అనంతరం ఆయన మరణించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని వెంటనే బంధువులకు స్పష్టంగా తెలియజేయకుండా, అత్యవసర చికిత్స అవసరమంటూ పీలేరు నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి ఎస్ కె ఆర్ ఆసుపత్రి అంబులెన్స్లో తరలించినట్లు వారు ఆరోపించారు. సురేంద్ర అప్పటికే మరణించి ఉన్నప్పటికీ, అంబులెన్స్లో ఆక్సిజన్ అందిస్తున్నట్లు చూపిస్తూ తిరుపతికి తీసుకొచ్చారని కూడా బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో స్విమ్స్ క్యాజువాల్టీకి తీసుకొచ్చిన అనంతరం అక్కడి వైద్యులు సురేంద్రను పరీక్షించి పల్స్ లేదని, ఆయన మరణించినట్లు ప్రకటించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భార్య, పిల్లలు, బంధువుల రోదనలతో స్విమ్స్ ప్రాంగణంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు కందారపు మురళి, టి. సుబ్రహ్మణ్యం బాధిత కుటుంబ సభ్యులను కలిసి ఘటన వివరాలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒక వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులు, పీలేరు ఎస్ కె ఆర్ ఆసుపత్రిలో అందించిన వైద్యం, మత్తు మందు ఇచ్చిన అనంతరం జరిగిన పరిణామాలు, స్విమ్స్కు తరలించే సమయానికి సురేంద్ర ఆరోగ్య పరిస్థితి, అంబులెన్స్లో అందించిన అత్యవసర వైద్యం తదితర అంశాలపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వైద్య నిర్లక్ష్యం లేదా ఇతర తప్పిదాలు జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.1
- ఫోక్ సింగర్ మంగ్లీ విషయంలో అడ్వకేట్ సుబ్బు గారు యొక్క సజెషన్ ఫోక్ సింగర్ మంగ్లీ కేసు విషయంలో అడ్వకేట్ సుబ్బు గారి యొక్క సజెషన్ పూర్తి వీడియో1
- *పోలీస్ ఖాకీ జులుం* నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాది ఈడ్చుకెళ్లిన పోలీసులు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాది, పోలీసుస్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు జమ్మికుంటలోని శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లి ఓ స్వీటు కొనుగోలు చేయగా.. ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ తీసుకుంటున్నాడని యజమానిని నిలదీసిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురై షట్టర్ కిందికి వేసేందుకు యత్నించిన రాజు దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకుని రాజుపై విరుచుకుపడి, పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లిన నలుగురు పోలీసులు కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగి.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసిన రాజు1
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- నేపాల్ వరదలకు కారణం ఇదేనా..? బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలింది..! నేపాల్, టిబెట్ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం... హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగిపోయినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ భారీ మంచుకొండ ఏకంగా 4 వేల అడుగుల లోతున్న లోయలోకి నిట్టనిలువుగా జారిపడినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయని కథనం పేర్కొంది. అంత భారీ మంచు ద్రవ్యరాశి ఒక్కసారిగా లోయలోకి పడిపోవడంతో... భారీగా మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంచుకొండ పడిన ప్రాంతం... బాంబు పేలినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు వివరించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. అంటే... ఇది సాధారణ వర్షాలతో వచ్చిన వరదేనా..? లేక... హిమాలయాల్లో భారీ మంచుకొండ విరిగిపడి... దాని ప్రభావంతో ఒక్కసారిగా నీరు ఉప్పొంగిందా..? అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇది ఇంకా ప్రాథమిక శాస్త్రీయ అంచనా మాత్రమే. ఈ మంచుకొండ విరిగిపడటం, దాని పరిమాణం, లోయలోకి పడిన ప్రభావం, వరదలతో దాని సంబంధం వంటి అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ఒకవైపు భారీ మంచుకొండ విరిగిపడటం... మరోవైపు ఒక్కసారిగా ఉప్పొంగిన వరద... హిమాలయాల్లో ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.1