రాజాం నియోజకవర్గంలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులలో నైతిక విలువలు, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి మరియు ఇతిహాసాలపై అవగాహన కలిగించడానికి వికాస తరంగిణి ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. రాజాంలోని వికాస తరంగిణి కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుండి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పోటీల అనంతరం విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల జూనియర్ విభాగంలో రాజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బి. గాయత్రి ప్రథమ స్థానాన్ని సాధించగా, డోలపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. మణికంఠ ద్వితీయ స్థానాన్ని, మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సౌరోతు హాసిని తృతీయ స్థానాన్ని పొందారు. మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి. పవిత్ర కన్సోలేషన్ బహుమతి సాధించారు. ప్రభుత్వ సీనియర్స్ విభాగంలో డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి. అఖిల ప్రథమ స్థానాన్ని, బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎ. హనీశ్వరి ద్వితీయ స్థానాన్ని, డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రౌతు యామిని తృతీయ స్థానాన్ని గెలుచుకోగా, మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన యడ్ల భారతి కన్సోలేషన్ బహుమతిని అందుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల జూనియర్స్ విభాగంలో ద సన్ స్కూల్ విద్యార్థి పి. దుర్గాప్రసాద్ ప్రథమ బహుమతిని, శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థి బి. ఈక్షిత ద్వితీయ బహుమతిని, జ్ఞాన జ్యోతి విద్యాలయం విద్యార్థి కె. ప్రత్యూష తృతీయ బహుమతిని పొందారు. డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఎస్.టి.వి. రాజ్ కుమార్ కన్సోలేషన్ బహుమతి సాధించారు. ప్రైవేట్ సీనియర్స్ విభాగంలో ద సన్ స్కూల్ విద్యార్థి డి. రిత్విక ప్రథమ బహుమతిని, జ్ఞాన జ్యోతి విద్యాలయం విద్యార్థి చ. ఢిల్లీశ్వరి ద్వితీయ బహుమతిని, ద సన్ స్కూల్ విద్యార్థి పి. శ్రీ వర్ష తృతీయ బహుమతిని సాధించారు. విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి కె. సాయి సంధ్యన మొదటి కన్సోలేషన్, ద సన్ స్కూల్ విద్యార్థి వి. నిహారిక రెండవ కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామంతుల శరత్ కుమార్ హాజరయ్యారు. అలాగే సారధి విజయ కోదండ రామ ఆశ్రమం అధ్యక్షులు టి.టి.వి. రమణమూర్తి, ముఖ్య సమన్వయకర్త అమనాన నీలకంఠం, ప్రజ్ఞా కోఆర్డినేటర్ మురపాక గణేష్, యువ వికాస్ అధ్యక్షులు గడే అప్పలనాయుడు, అబ్బులు, పాలవలస రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలకు కర్రి సితారత్నం, దూబ లీలావతి, గంటా లక్ష్మి, రెడ్డి శంకర్రావు, త్రిమూర్తులు నాయుడు, ముడిల శంకర్రావు, సీతారామమూర్తి, దాసరి మల్లేశ్వరరావు, ఆయి నీలంనాయుడు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
రాజాం నియోజకవర్గంలో ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులలో నైతిక విలువలు, జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి మరియు ఇతిహాసాలపై అవగాహన కలిగించడానికి వికాస తరంగిణి ఆధ్వర్యంలో కథల పోటీలు నిర్వహించారు. రాజాంలోని వికాస తరంగిణి కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుండి 200 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పోటీల అనంతరం విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల జూనియర్ విభాగంలో రాజాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బి. గాయత్రి ప్రథమ స్థానాన్ని సాధించగా, డోలపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఎం. మణికంఠ ద్వితీయ స్థానాన్ని, మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సౌరోతు హాసిని తృతీయ స్థానాన్ని పొందారు. మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన టి. పవిత్ర కన్సోలేషన్ బహుమతి సాధించారు. ప్రభుత్వ సీనియర్స్ విభాగంలో డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పి. అఖిల ప్రథమ స్థానాన్ని, బొద్దాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎ. హనీశ్వరి ద్వితీయ స్థానాన్ని, డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రౌతు యామిని తృతీయ స్థానాన్ని గెలుచుకోగా, మందరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన యడ్ల భారతి కన్సోలేషన్ బహుమతిని అందుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల జూనియర్స్ విభాగంలో ద సన్ స్కూల్ విద్యార్థి పి. దుర్గాప్రసాద్ ప్రథమ బహుమతిని, శ్రీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థి బి. ఈక్షిత ద్వితీయ బహుమతిని, జ్ఞాన జ్యోతి విద్యాలయం విద్యార్థి కె. ప్రత్యూష తృతీయ బహుమతిని పొందారు. డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఎస్.టి.వి. రాజ్ కుమార్ కన్సోలేషన్ బహుమతి సాధించారు. ప్రైవేట్ సీనియర్స్ విభాగంలో ద సన్ స్కూల్ విద్యార్థి డి. రిత్విక ప్రథమ బహుమతిని, జ్ఞాన జ్యోతి విద్యాలయం విద్యార్థి చ. ఢిల్లీశ్వరి ద్వితీయ బహుమతిని, ద సన్ స్కూల్ విద్యార్థి పి. శ్రీ వర్ష తృతీయ బహుమతిని సాధించారు. విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి కె. సాయి సంధ్యన మొదటి కన్సోలేషన్, ద సన్ స్కూల్ విద్యార్థి వి. నిహారిక రెండవ కన్సోలేషన్ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామంతుల శరత్ కుమార్ హాజరయ్యారు. అలాగే సారధి విజయ కోదండ రామ ఆశ్రమం అధ్యక్షులు టి.టి.వి. రమణమూర్తి, ముఖ్య సమన్వయకర్త అమనాన నీలకంఠం, ప్రజ్ఞా కోఆర్డినేటర్ మురపాక గణేష్, యువ వికాస్ అధ్యక్షులు గడే అప్పలనాయుడు, అబ్బులు, పాలవలస రాంబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పోటీలకు కర్రి సితారత్నం, దూబ లీలావతి, గంటా లక్ష్మి, రెడ్డి శంకర్రావు, త్రిమూర్తులు నాయుడు, ముడిల శంకర్రావు, సీతారామమూర్తి, దాసరి మల్లేశ్వరరావు, ఆయి నీలంనాయుడు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
- సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురంలోని పురాతన సీతారామ ఆలయాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. శిల్పకళా వైభవంతో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శిథిలావస్థకు చేరిన భాగాల పునరుద్ధరణ కోసం దేవాదాయ శాఖ ద్వారా నిధులను మంజూరు చేయాలని కోరారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం చోళ్లపాదం పంచాయతీ పరిధిలోని రెబ్బ–వనధార గ్రామాలకు వెళ్లే రహదారి పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల జాప్యం కారణంగా రహదారి అధ్వానంగా తయారవడంతో స్థానిక ప్రజలే స్వయంగా శ్రమదానం చేస్తూ రోడ్డును మరమ్మతు చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో రహదారి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, కాంట్రాక్టర్ కొంత మేర పనులు చేసి మధ్యలోనే వదిలేశారని గ్రామస్తులు ఆరోపించారు. జేసీబీతో రోడ్డును తవ్వడంతో పాటు కల్వర్టుల పనులను కూడా అసంపూర్తిగా వదిలివేయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి మొత్తం బురదమయంగా మారింది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో కూడా గ్రామం నుంచి బయటకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్కు, స్థానిక ఎమ్మెల్యేకు, కొమరాడ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో గ్రామ ప్రజలు, యువకులు స్వయంగా రంగంలోకి దిగారు. ట్రాక్టర్లతో మట్టి, కంకర తెప్పించి పారలతో బురదను తొలగిస్తూ రహదారిని బాగు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి, తమ రోడ్డు దుస్థితిని వీడియోల ద్వారా పరిశీలించాలని, తమ పార్టీ నాయకులను పంపి సమస్యను తెలుసుకోవాలని ఆవేదనతో విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామాల ఈ దయనీయ స్థితిపై వెంటనే స్పందించాలని వారు కోరారు. మరోవైపు, అసంపూర్తిగా పనులు వదిలేసిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కేసులు నమోదు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే రహదారి పనులను పూర్తి చేయకుంటే రెబ్బ, వనధార గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.2
- దేశ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినందుకు గాను నారా బ్రాహ్మణి గారికి ఫార్ట్యూన్ ఇండియా ప్రతిష్టాత్మక 'మోస్ట్ పవర్ఫుల్ లేడీ' జాతీయ అవార్డును అందజేసింది. ఈ నేపథ్యంలో, ఆమె రాజకీయ ప్రవేశం చేయాలని, ఆమె నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖపట్నం అక్కయ్యపాలెం హైవే పోర్ట్ హాస్పిటల్ ఎదురుగా భారీగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి, నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం దక్షిణ కొరియా వెళ్లి పెట్టుబడులు తెచ్చిన నారా లోకేష్ నాయకత్వాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. 2029 ఎన్నికలలో పోటీ బరిలో మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇస్తామని లోకేష్ ప్రకటించడం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. లోకేష్ గారు తన భార్య బ్రాహ్మణి గారికి ఇచ్చిన తోడ్పాటు వల్లే ఆమె దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఈ అవార్డును అందుకున్నారని కొనియాడారు. అలాగే వయసుతో సంబంధం లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన సతీమణికి కూడా ఈ సందర్భంగా పాలాభిషేకం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ, తనకు వచ్చిన ఈ అవార్డును నారా బ్రాహ్మణి గారు రైతులు మరియు ఉద్యోగులకు అంకితం ఇచ్చారు. నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రోజు హర్షం వ్యక్తంచేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ తెలిపారు.2
- భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి గారు సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైయస్ జగన్ కొనియాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఆమె ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని పేర్కొన్నారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఆమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైయస్ జగన్, ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు మరియు సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని రహదారుల దుస్థితిపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రోడ్లు ఏమాత్రం బాగోలేవని, వీటిని ఎవరూ గుర్తించడం లేదని, అసలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ దారుల గుండా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కింద పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎవరిలోనూ చలనం లేదని, తాము చెప్పాల్సింది చెప్పేశామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.2
- 😭🙏1
- 😭🙏1
- కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆదివారం నాడు భక్తులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఒక లారీ ఢీకొట్టింది. తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి ఆటోలో 12 మంది భక్తులు బయలుదేరారు. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఒక కోళ్ల ఫారం దగ్గరకు ఆటో చేరుకోగానే, వెనుక వైపు నుంచి వచ్చిన లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.1