విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు మూడు రోజులుగా విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ఆదివారం రోజు విజయవంతంగా ముగిసాయి. యూనియన్ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్ని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించగా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, 26 రాష్ట్రాల నుండి దాదాపు 400 మంది ఐజేయు ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో హైదరాబాద్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల సదస్సు నిర్వహణకు ప్లీనరీ నిర్ణయించింది. కార్మికులతో పాటు, వర్కింగ్ జర్నలిస్టులకు తీరని ద్రోహం తలపెట్టనున్న లేబర్ కోడ్ పై ప్లీనరీలో సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ అంశంపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ప్రసంగించారు.
విజయవాడలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు మూడు రోజులుగా విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) జాతీయ 11వ ప్లీనరీ సమావేశాలు ఆదివారం రోజు విజయవంతంగా ముగిసాయి.
యూనియన్ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్ని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించగా, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు, 26 రాష్ట్రాల నుండి దాదాపు
400 మంది ఐజేయు ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో హైదరాబాద్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టుల సదస్సు నిర్వహణకు ప్లీనరీ నిర్ణయించింది. కార్మికులతో పాటు, వర్కింగ్ జర్నలిస్టులకు తీరని ద్రోహం తలపెట్టనున్న లేబర్ కోడ్
పై ప్లీనరీలో సుధీర్ఘ చర్చ జరిగింది. ఈ అంశంపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(TUWJ) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ ప్రసంగించారు.
- హనుమకొండలో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఉద్ధృతం: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల రాకపై అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన! హనుమకొండ: ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని నిరసిస్తూ హనుమకొండలో బస్టాండ్ వద్ద టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుల వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈదుల వెంకన్న మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆర్టీసీని ప్రైవేటీకరించడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఆర్టీసీని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు.1
- తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3లక్షల కోట్లతో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అందరికీ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఓయూ జేఏసీ నాయకుడు సలీం హర్షం వ్యక్తం చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కల చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులకు భారీ నిధుల కేటాయింపుతో పాటు, సామాజిక న్యాయానికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేశారన్నారు. సామాన్యుడి పై ఆర్థిక భారం పడకుండా బడ్జెట్ ను రూపొందించారు అన్నారు. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు ఎలాంటి పాలన అందించాలని తెలుసుకున్న వ్యక్తి అని కొనియాడారు.2
- "Auto drivers struggling due to gas shortage." "No gas, no work: Auto drivers in distress." "Fuel crisis hitting auto drivers hard."1
- ప్రజావాణిలో 50 అర్జీలు, నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య1
- జగిత్యాల ఎస్టీ హాస్టల్లో అమానుష ఘటన చీపురుతో విద్యార్థులను చితకబాదిన హాస్టల్లో కూరగాయలు కోసే వ్యక్తి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న శ్రీనివాస్ నాలుగు నెలలుగా విద్యార్థులను వేధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని హాస్టల్ నిర్వాహకులు చిన్నారులని చూడకుండా చీపురుతో చితకబాదిన వైనం1
- Post by Tagore1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరిట వేధిస్తున్న సీనియర్ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ డిమాండ్ చేశారు. ర్యాగింగ్ చేస్తున్న అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ లిస్ట్ సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డెంటల్ కళాశాల యజమాన్యానికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థుల పై ర్యాగింగ్ గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారని, వెంటనే పోలీసులు కళాశాల సిబ్బందితో విద్యార్థులతో అవేర్నెస్ ప్రోగ్రాములు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ర్యాగింగ్లు ఎక్కడ జరగకుండా జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.1
- తమిళనాట మొదలైన ఎన్నికల కురుక్షేత్రం: నామినేషన్ దాఖలు చేసిన టీవీకే (TVK) అధినేత విజయ్! చెన్నై/హైదరాబాద్:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగు వేశారు. సోమవారం నాడు ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుండి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన తొలి ఎన్నికల బరిలో విజయ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి చెన్నైలోని పెరంబూర్ కాగా, మరొకటి తిరుచ్చి (ఈస్ట్) నియోజకవర్గం. భారీ భద్రత నడుమ, వేలాది మంది అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల కోలాహలం మధ్య విజయ్ రిటర్నింగ్ కేంద్రానికి చేరుకున్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన పెరంబూర్ నియోజకవర్గంలో భారీ ఎన్నికల ర్యాలీని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సీఎం స్టాలిన్ వర్సెస్ విజయ్: మరోవైపు, ఇదే రోజున తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్ కూడా తన సొంత నియోజకవర్గమైన కొలత్తూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి మరియు రాష్ట్రంలో ఎదుగుతున్న కొత్త రాజకీయ శక్తి విజయ్ ఒకే రోజు నామినేషన్లు వేయడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తోందని, అవినీతి రహిత పాలనే తన లక్ష్యమని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో యువత మరియు మహిళా ఓటర్లే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు.1