తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ మహబూబాబాద్ జిల్లా నిజాం నిరంకుశ పాలన రజాకార్ల దౌర్జన్యాలు భూస్వాముల వెట్టిచాకిరి దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూని స్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ అన్నా రు 1946–48 కాలంలో సాగిన ఈ వీరోచిత పోరాటంలో వేలాది మంది రైతులు కూలీలు పేద ప్రజలు ప్రాణాలను త్యాగం చేసి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడారని తెలిపారు ఈ పోరాటం ద్వారా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందని గ్రామాల్లో ప్రజాస్వామ్య విలువలకు పునాది పడిందని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో నేటి తరంలో కూడా దోపిడీ అన్యాయం అసమానతలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని పెంపొందిం చాల్సిన అవసరం ఉందన్నారు రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోరాట చరిత్రను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సెప్టెంబర్ 17, 2026న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ లోని VRN గార్డెన్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహి స్తున్నట్లు తెలిపారు ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు యువత విద్యా ర్థులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజ యవంతం చేయాలని బానోత్ సీతారాం నాయక్ కోరారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభను జయప్రదం చేయండి సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ మహబూబాబాద్ జిల్లా నిజాం నిరంకుశ పాలన రజాకార్ల దౌర్జన్యాలు భూస్వాముల వెట్టిచాకిరి దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూని స్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయిందని సీపీఎం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారాం నాయక్ అన్నా రు 1946–48 కాలంలో సాగిన ఈ వీరోచిత పోరాటంలో వేలాది మంది రైతులు కూలీలు పేద ప్రజలు ప్రాణాలను త్యాగం చేసి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడారని తెలిపారు ఈ పోరాటం ద్వారా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందని గ్రామాల్లో ప్రజాస్వామ్య విలువలకు పునాది పడిందని పేర్కొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో నేటి తరంలో కూడా దోపిడీ అన్యాయం అసమానతలకు వ్యతిరేకంగా పోరాట స్ఫూర్తిని పెంపొందిం చాల్సిన అవసరం ఉందన్నారు రైతులు వ్యవసాయ కార్మికులు పేదలు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోరాట చరిత్రను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సెప్టెంబర్ 17, 2026న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ లోని VRN గార్డెన్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ నిర్వహి స్తున్నట్లు తెలిపారు ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రజాసంఘాల నాయకులు యువత విద్యా ర్థులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజ యవంతం చేయాలని బానోత్ సీతారాం నాయక్ కోరారు.
- జిన్నెల వాగు ఉధృతంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి చిన్నగూడూర్ ఎమ్మార్వో కిరణ్ కుమార్.. జీన్నెల వాగు వద్ద అప్రమత్తంగా ఉండాలి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రం నుంచి గుండంరాజుపల్లి, పగిడిపల్లి, బాబోజీ తండా గ్రామాలకు వెళ్లే మార్గంలోని జీన్నెల వాగు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ కిరణ్ కుమార్ సూచించారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో రాకపోకలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1
- ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ ఒక ఎకరంతో మొదలు.. 30 ఎకరాలకు విస్తరణ.. మామిడి నర్సరీ రైతు విజయగాథ *మామిడి మొక్కల నర్సరీతో ఉపాధి బాట.. భరద్వాజ రాంబాబు విజయగాథ** మామిడి సాగులో నాణ్యమైన మొక్కే.. మంచి దిగుబడికి తొలి అడుగు. ఈ సూత్రాన్ని నమ్మిన ఓ రైతు.. కేవలం ఒక ఎకరంతో ప్రారంభించిన మామిడి నర్సరీని నేడు ఏకంగా 30 ఎకరాలకు విస్తరించారు. నాణ్యమైన మామిడి అంటుమొక్కలను తయారు చేస్తూ.. వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన భరద్వాజ రాంబాబు.. సాగులోనే కాదు.. నర్సరీ రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నర్సరీలో మొక్కల తయారీ.. అంటుకట్టే విధానం.. మార్కెట్ డిమాండ్.. రైతులకు అందిస్తున్న సేవలు మామిడి నర్సరీలో మొక్క తయారీ ప్రక్రియ ఎంతో జాగ్రత్తగా సాగుతుంది. ముందుగా నాణ్యమైన మామిడి టెంకలను సేకరించి.. వాటితో నారు పెంచుతారు. మొలకెత్తిన మొక్కలను ప్రత్యేక బ్యాగుల్లోకి మార్చి.. సుమారు రెండున్నర నెలల పాటు పెంచుతారు. అనంతరం అంటుకట్టేందుకు మొక్కలను సిద్ధం చేస్తారు. మంచి దిగుబడినిచ్చే మామిడి చెట్ల నుంచి సయాన్ స్టిక్స్ను సేకరించి.. స్పాట్ కటింగ్ పద్ధతిలో అంటుకడతారు. అనుభవజ్ఞులైన గ్రాఫ్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒక్కో గ్రాఫ్టర్ రోజుకు సుమారు 400 నుంచి 700 మొక్కలకు అంటుకట్టే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. అంటుకట్టిన మొక్కల్లో సుమారు 12 రోజులకు చిగుర్లు రావడం ప్రారంభమవుతుంది. సరైన సంరక్షణతో ఏడాది కాలంలో మొక్కలు ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. మొక్క నాణ్యత.. రకం.. పెరుగుదలను బట్టి ఒక్కో అంటుమొక్కను రూ.120 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నారు. 1989లో కేవలం ఒక ఎకరంతో ప్రారంభమైన అవీవ్ నర్సరీ.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ నేడు 30 ఎకరాలకు విస్తరించింది. నర్సరీలో ప్రతిరోజూ సుమారు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో కుటుంబాలకు నిరంతర ఉపాధి లభిస్తోంది.1
- ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.1
- హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.టైటిల్: 🚨 హయత్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్.. 20 మందికి తీవ్ర గాయాలు హయత్నగర్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కుంట్లూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కుంట్లూర్ సమీపంలో కొద్దిసేపు భయాందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. అర్చకులు ఊరుగొండ మణిదీప్ నేతృత్వంలో ఘనంగా ప్రత్యేక పూజలు.. తరలివచ్చిన భక్తులు వరంగల్, సెప్టెంబర్ 14: గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఆధ్వర్యంలో కొలువుదీరిన విఘ్నేశ్వరునికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ పూజా కార్యక్రమాలను అర్చకులు ఊరుగొండ మణిదీప్ శాస్త్రోక్తంగా, విశేష క్రతువులతో నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గత సంవత్సరం నుండి ఈ ఉత్సవాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ సేన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవా సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పూజలతో మండప పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.2
- భూ వివాదం లో ఎస్ ఐ తలదూర్చారంటు దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ కుటుంబం ధర్నా.. మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి పోలీస్ స్టేషన్ ముందు తూర్పు తండా కు చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి కి చెందిన కుటుంబం ధర్నా దిగింది.. దంతాల పల్లి ఎస్ ఐ రవి కుమార్ మా భూమి విషయం లో కలుగ చేసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు.. మాకు న్యాయం చేయాలనీ లేనట్టాయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు.. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలనీ బాధిత కుటుంబం వేడుకుంటుంది..1