Shuru
Apke Nagar Ki App…
శాంతియుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కరుపుకోవాలి: సీఐ. రాజిరెడ్డి ఎల్లారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎల్లారెడ్డి సీఐ.రాజిరెడ్డి సూచించారు. పట్టణంలోని వినాయక మండపాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని దర్శించుకుని నిర్వాహకులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించడం మంచిదని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Vukkalkar Rajendernath
శాంతియుతంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కరుపుకోవాలి: సీఐ. రాజిరెడ్డి ఎల్లారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎల్లారెడ్డి సీఐ.రాజిరెడ్డి సూచించారు. పట్టణంలోని వినాయక మండపాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని దర్శించుకుని నిర్వాహకులతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే వినియోగించడం మంచిదని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు1
- నాగిరెడ్డిపేట:పోచారం ప్రాజెక్టులోకి 306 క్యూసెక్కుల వరద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షాలకు మంగళవారం ఉదయం 6 గంటలకు 306 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ అక్షయ్కుమార్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరో 38 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని పేర్కొన్నారు.ప్రాజెక్టు నుండి ప్రతిరోజు మీరు విడుదల కావడంతో రెండు అడుగుల ప్రాజెక్టు నీటిమట్టం తగ్గి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 కాడులు కాగా 19 అడుగులకు చేరింది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ పొంగిపొర్లి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నదిలోకి చేరి నిజం సార్ ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ఈరోజు ప్రత్యేక అభిషేకం పూజలు మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం స్వయంభుగా వెలసిన శ్రీ ఏడుపాయలవల దుర్గా భవాని మాత ఆలయంలో పూజారి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఆలయ పూజారులుమంజిరానది జలాలతో అభిషేకము పట్టు వస్తలంకరణ పుష్పాలంకరణ పసుపు కుంకుమ సుందరంగా అలంకరించారు కోరిన కోరికలు తీరిన భక్తులు అమ్మవారికి బోనాలు ఓడి బియ్యం తలనీలాల సమర్పిస్తున్నారు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే.1
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- కాచాపూర్ లో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో కరెంటు కోతలపై బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్యవసాయానికి 18 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కరెంటు కోతల వల్ల రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామని హెచ్చరించారు.1
- 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేత లొంగుబాటు నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన సీపీఐ మావోయిస్టు పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు నిక్కా శశీల అలియాస్ రాజి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 57 ఏళ్ల నిక్కా శశీల 1992లో పీపుల్స్ వార్లో చేరి.. 34 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. అనారోగ్య సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీని వీడి సాధారణ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన శశీలకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్తో పాటు 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిగిలిన మావోయిస్టు కేడర్లు కూడా హింసా మార్గాన్ని వీడి లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.1
- భజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద చిన్నారులు పెద్దలచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని బజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం సందర్బంగా చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగ వినాయకునికి ఆంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.1