logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జీవి మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం పట్టణంలోని యూబీ రోడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన జీవి మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా GV Mall అధినేత ఉమామహేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపిక రంగరాజు పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం సందర్శకులు GV Mall‌లో షాపింగ్ చేస్తూ ప్రారంభోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, భద్రాచలం పట్టణంలో ఆధునిక షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాపార సంస్థల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత , వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

1 hr ago
user_Ramprasad Pothuganti
Ramprasad Pothuganti
Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago
774ce759-873e-4f35-973b-4be0bd4643e0

జీవి మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం పట్టణంలోని యూబీ రోడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన జీవి మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా GV Mall అధినేత ఉమామహేశ్వరరావు కి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ టీవీ సీరియల్ నటి దీపిక రంగరాజు పాల్గొని సందడి చేశారు. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అనంతరం సందర్శకులు GV Mall‌లో షాపింగ్

be69189d-ec81-4f14-9789-40fddd64e36a

చేస్తూ ప్రారంభోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ, భద్రాచలం పట్టణంలో ఆధునిక షాపింగ్ మాల్స్ ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాపార సంస్థల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ , ఉపసర్పంచ్ రత్నం కవిత , వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, పట్టణ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    1
    భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది
ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢 కాంగ్రెస్ అంటేనే ఎవుసానికి పట్టిన దరిద్రం! రేవంత్ రెడ్డి అడుగు పడగానే... రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది. నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు, రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు. – అన్నదాత ఆవేదన 😢
    1
    కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!

రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.

నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.

– అన్నదాత ఆవేదన 😢
కాంగ్రెస్ అంటేనే 
ఎవుసానికి పట్టిన దరిద్రం!
రేవంత్ రెడ్డి అడుగు పడగానే...
రాష్ట్రంలో ఎవుసం మొత్తం ఆగమైంది.
నీళ్లు వస్తలేవు, యూరియా దొరుకుతలేదు,
రైతుబంధు లేదు, రుణమాఫీ లేదు.
– అన్నదాత ఆవేదన 😢
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    1
    పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు...
పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన ..
ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • 54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్ వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    1
    54 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి సారపాక కు బూర్గంపాడుకు రాకపోకలు నిలిపివేత 
భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాదక హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి లోతట్టు ప్రాంతాలలో చేరుకున్న వరద నీరు బూర్గంపాడుకు సారపాకకు రాకపోకలు నిలిపివేత లోతుట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న మండల అధికారులు ప్రస్తుతం గోదావరి ఉదయం 6 గంటల సమయం నందు 55. 10 ఫీడ్స్  వద్ద ప్రవహించినది 15,40,412 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించగా  ప్రస్తుతం ఒక అడుగు తగ్గి 54 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • రూ.52 కోట్ల మోసం.. నిందితుడి ఆస్తుల చిట్టా వెలుగులోకి. కొత్తగూడెం: రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో అరెస్టైన బేతంపూడి భరత్‌కుమార్‌ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలోని పాలాలో అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్‌లో మూడు అంతస్తుల భవనం, ప్లాట్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రైల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    రూ.52 కోట్ల మోసం.. నిందితుడి ఆస్తుల చిట్టా వెలుగులోకి.
కొత్తగూడెం: రూ.52 కోట్ల పెట్టుబడి మోసం కేసులో అరెస్టైన బేతంపూడి భరత్‌కుమార్‌ ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కేరళలోని పాలాలో అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బుతో భద్రాచలం రాజీవ్‌నగర్‌లో మూడు అంతస్తుల భవనం, ప్లాట్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలు, మనీ ట్రైల్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.