Shuru
Apke Nagar Ki App…
Aaj Mecca Masjid Me Pehla Iftar Me DCP Kiran Khare Rozedaro Me Iftari Taqseem Kiye Aur Har Saal Ki Tarha Is Saal Bhi Sahara Team Trust Ki Janib Se Rozedaro Ke Liye Iftar Ka Intezam Kiya Gaya.
Ali ammu
Aaj Mecca Masjid Me Pehla Iftar Me DCP Kiran Khare Rozedaro Me Iftari Taqseem Kiye Aur Har Saal Ki Tarha Is Saal Bhi Sahara Team Trust Ki Janib Se Rozedaro Ke Liye Iftar Ka Intezam Kiya Gaya.
More news from తెలంగాణ and nearby areas
- ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సెంట్రల్ జోన్ వైస్ చాన్సలర్ల సదస్సు ను ఈ నెల 19 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అం శంపై రెండు రోజుల పాటు విస్తృత చర్చలు జరుగుతాయని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఓయూలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిధిగా హాజరై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సదస్సు లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 40 మందికి పైగా వీసీలు, ఉన్నత విద్యా నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. మారుతున్న సాంకేతిక యుగంలో ఉన్నత విద్యా విదానాల రూపకల్పనపై చర్చ ఉంటుందన్నారు. ఈ చర్చల్లో వచ్చి ప్రధాన అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.1
- హైదరాబాద్లో బయోఏషియా-2026 సదస్సును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates BioAsia 2026 in Hyderabad1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 19 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో Bharatiya Janata Party ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముదిరాజ్ బిఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కడం, పార్టీ లోపలే విభేదాలు రెచ్చగొట్టడం, స్వార్థ ఎజెండాతో వ్యవహరించడం బిఆర్ఎస్ నేతల లక్ష్యమైందని ఆయన ఆరోపించారు. Bharat Rashtra Samithi లో పనిచేస్తూ నియోజకవర్గంలో ఉద్యమకారులకు, నిజమైన కేడర్కు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని, తన అనుచరులకు మాత్రమే పదవులు కట్టబెట్టే రాజకీయాలు నడుపుతున్నారని ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. “పార్టీ పతనం కోసం లోపలే కుయుక్తులు పన్నేవాడు నాయకుడా?” అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మచ్చలేని నాయకుడు Raghunandan Rao కోటి రూపాయలు తీసుకుని వేరే పార్టీకి మద్దతిచ్చారనే ఆరోపణలు చేసిన వారు గజ్వేల్ కోట మైసమ్మ దేవాలయం వద్ద వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. “నిజం ఉంటే దేవాలయం వద్ద ప్రమాణం చేయి… లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకో” అని ఘాటుగా హెచ్చరించారు. గతంలో K. Chandrashekar Rao ను ఓడించాలని T. Harish Rao ఫోన్ చేశారని ప్రచారం చేసి, బిఆర్ఎస్ నేతల వద్ద ఎంత డబ్బులు దోచుకున్నావో గజ్వేల్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “ఇతరులపై ఆరోపణలు చేసి డబ్బులు సంపాదించడం నీ రాజకీయ జీవన విధానమా?” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.సర్పంచ్ ఎన్నికల సమయంలో పార్టీ ఫండ్ పంపకాలపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డితో జరిగిన రచ్చను ప్రజలు మర్చిపోలేదన్నారు. “బ్లాక్మెయిల్ రాజకీయాలతో జీవితం గడిపేవాడిని ప్రజలు ఇక నమ్మరు” అని భైరి శంకర్ ముదిరాజ్ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయిని సందీప్, ఎల్కంటి సురేష్, టెలికం బోర్డు మెంబర్ కమ్మరి శ్రీనివాస్, నత్తి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.4
- కాకునూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల ప్రభను ఘనంగా నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో ప్రభను ఊరేగించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజామున వరకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు కొనసాగనున్నది.అనంతరం నిప్పుకణుకలపై నడుస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో, హారతులు, నాదస్వరాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.1
- *వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ కు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం* మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతి నరేష్ గౌడ్ ను గురువారం మెదక్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ, ఇతర కార్యక్రమాలలో చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు. రానున్న రోజుల్లో సైతం నరేష్ గౌడ్ పట్టణ ప్రజలతో పాటు ఇటు జర్నలిస్టుల సంక్షేమానికి కోసం కూడా కృషి చేయాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ నరేష్ గౌడ్ అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు నాగరాజు, జర్నలిస్టులు కామాటి కీషన్, సురేంద్ర రెడ్డి ప్రకాష్, కె. రామకృష్ణ, గోపాల్ గౌడ్, లక్ష్మణ్, శ్యామ్, రాము, సంగమేశ్వర్ లతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.1
- టి.లింగంపల్లిలో శివాజీ జయంతి వేడుకలు రేగోడ్ మండలం టి.లింగంపల్లిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దిగంబర్ రావు, పీసీసీ సభ్యుడు కిషన్ శివాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. స్త్రీ గౌరవం, రైతు సంక్షేమం కోసం శివాజీ చేసిన కృషిని వారు కొనియాడారు. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి, మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఓయూలో నేటి నుంచి ఏఐయూ సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సు ప్రారంభం.. హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల రెండు రోజుల సదస్సు ఈ నెల 19 (నేడు), 20 తేదీల్లో ఘనంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి సంబంధించిన వివరాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం సాంకేతికతతో కూడిన ఉన్నత విద్యా సంస్థల రూపకల్పన" అనే అంశంపై ఈ సదస్సులో లోతైన చర్చలు జరగనున్నాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి సుమారు 40 మందికి పైగా వైస్ ఛాన్సలర్లు (VCs), ఉన్నత విద్యా రంగ నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మారుతున్న సాంకేతిక యుగానికి అనుగుణంగా ఉన్నత విద్యా విధానాలను ఎలా తీర్చిదిద్దాలనే దానిపై చర్చించి, ఆ కీలక అంశాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.1
- బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో దుర్గా మీరా కాలనీ బంజారాలకు కేటాయించిన స్థలం నందు సేవలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా సందర్భంగా సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేశారు.. బంజారాల అభివృద్ధి కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని గుర్తు చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని మీరా కాలనీలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారన్నారు. బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు1