Shuru
Apke Nagar Ki App…
ఎల్లారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎల్లారెడ్డి: పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్దివిటీ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు సతీష్, లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీను, నాయకులు కాశీనాథ్, సత్యం, శివ, గజనన్, పండరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Vukkalkar Rajendernath
ఎల్లారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఎల్లారెడ్డి: పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అగల్దివిటీ రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు సతీష్, లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీను, నాయకులు కాశీనాథ్, సత్యం, శివ, గజనన్, పండరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు గంగారం పిలుపు ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలి సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపు గడ్కోల్లో కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న పాలక వర్గాల విధానాలపై ప్రజలు ఐక్యంగా పోరాటాలు నిర్మించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గడ్కోల్లో గురువారం మూడవ రోజు కొనసాగుతున్న రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచుతూ సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పోటు రంగారావు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తదితర విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివల్ల చిరు వ్యాపారులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, పేద వర్గాలపై అదనపు భారం పడే అవకాశం ఉందన్నారు. రైతుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై బోధన రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా మూడవ రోజు ‘భూగోళ చరిత్ర’ అంశాన్ని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు బోధించగా, ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అంశంపై జీ. భార్గవ్ బోధించారు. కార్యక్రమంలో సెక్రటేరియట్ సభ్యులు కెచ్చల రంగయ్య, కట్ట రమా, వి. ప్రభాకర్, వి. కృష్ణ, చిన్న చంద్రన్న, ఎం. కృష్ణ, సూర్యం, హన్మేశ్, ఎస్.ఎల్. పద్మతో పాటు రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, బి. రాము, జి. రామయ్య, సి.వై. పుల్లయ్య, నందిరామయ్య, జిల్లా నాయకులు ఆర్. రమేష్, బి. దేవరం, ఆర్. దామోదర్, బి. బాబన్న, కిషోర్, రమేష్, రమ, సత్తెమ్మ, పుష్ప, జమున, లావణ్య తదితరులు పాల్గొన్నారు.2
- మాల మహానాడు ఆధ్వర్యంలో బోధన్లో నిరసన, అమర ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, అంబేద్కర్ పై అనుచిత వాక్యాలు.. దళిత సంఘ నాయకులు ఆగ్రహం బోధన్, సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా: ప్రతినిధి రాహుల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమర ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆనంపల్లి ఎల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్పై అవమానకర వ్యాఖ్యలు చేయడం, ఆయనపై తప్పుడు ప్రచారానికి దారితీసే విధంగా పుస్తకాన్ని రచించి విడుదలకు ప్రయత్నించడం దళిత సమాజం మనోభావాలను దెబ్బతీసే చర్యలని అన్నారు. అంబేద్కర్ కృషి, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని అవమానించే వ్యాఖ్యలను సహించబోమని స్పష్టం చేశారు.అమర ప్రసాద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో మాల మహానాడు నాయకులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు, ప్రచారాలు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు దళిత సమాజం ఐక్యంగా ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యవర్గ సభ్యులు, బోధన్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, పట్టణ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.4
- మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మలు తమ వృత్తి, ఉపాధికి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను సానుకూలంగా విన్న మంత్రి.. ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్లో అర్ధరాత్రి బుల్లెట్ బైక్ హల్చల్.. శబ్ద కాలుష్యానికి కారణమైన బైక్ సీజ్! నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో బుల్లెట్ బైక్ నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్కు అధిక శబ్దం చేసే సైలెన్సర్ను అమర్చుకొని, అర్ధరాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, పబ్లిక్ న్యూసెన్స్ మరియు శబ్ద కాలుష్యానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పందిస్తూ, అధిక శబ్దం చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లను వాహనాలకు అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనాలు నడపాలని పోలీస్ శాఖ సూచించింది. శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నిజామాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.1
- నిజాంసాగర్లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.1