నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే.. సెప్టెంబర్ 17 తెలంగాణ సాయిధ పోరాట స్ఫూర్తి చిహ్నం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 15... నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమేనని.. అలాంటి సాయుధ పోరాట వారోత్సవాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మూడు కోట్ల జంక్షన్లో ప్రభుత్వం అధికారులు సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ పట్టణ మండల ముఖ్య నేతల సమావేశం వెలుగు శ్రావణ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 17న అధికారికంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ నిర్మించిన సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం వద్ద అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని తెలిపారు. నాటి సాయుధ పోరాటం లో వేలాదిమంది అమరవీరులు బలి అయ్యారని నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విడుదల అయిందని సెప్టెంబర్ 17న అధికారికంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మానుకోట ప్రాంతం సాయుధ పోరాటంలో విరోచిత పోరాటం నిర్వహించిందని ఈ ప్రాంతంలో సాయుధ పోరాట వీరులు అమరులయ్యారని వారిని స్మరిస్తూ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ నిజాం ను తరిమి కొట్టిందని ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో 11 నుండి 17 వరకు ఘనంగా సాయుధ పోరాటాలు జిల్లాలో నిర్వహించామని 17వ తేదీన ముగింపు కార్యక్రమం లో సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, తండా సందీప్, వీరవెల్లి రవి, నర్ర శ్రావణ్, బానోతు లింగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే.. సెప్టెంబర్ 17 తెలంగాణ సాయిధ పోరాట స్ఫూర్తి చిహ్నం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 15... నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమేనని.. అలాంటి సాయుధ పోరాట వారోత్సవాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం మూడు కోట్ల జంక్షన్లో ప్రభుత్వం అధికారులు సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని బి అజయ్ సారధి రెడ్డి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ పట్టణ మండల ముఖ్య నేతల సమావేశం వెలుగు శ్రావణ్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 17న అధికారికంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ నిర్మించిన సాయుధ పోరాట స్ఫూర్తి చిహ్నం వద్ద అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడారని తెలిపారు. నాటి సాయుధ పోరాటం లో వేలాదిమంది అమరవీరులు బలి అయ్యారని నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విడుదల అయిందని సెప్టెంబర్ 17న అధికారికంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మానుకోట ప్రాంతం సాయుధ పోరాటంలో విరోచిత పోరాటం నిర్వహించిందని ఈ ప్రాంతంలో సాయుధ పోరాట వీరులు అమరులయ్యారని వారిని స్మరిస్తూ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలని సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని తెలిపారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ నిజాం ను తరిమి కొట్టిందని ఈ సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో 11 నుండి 17 వరకు ఘనంగా సాయుధ పోరాటాలు జిల్లాలో నిర్వహించామని 17వ తేదీన ముగింపు కార్యక్రమం లో సిపిఐ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిళ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగ చారి, తండా సందీప్, వీరవెల్లి రవి, నర్ర శ్రావణ్, బానోతు లింగ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- ఇంటి దారి వివాదం ఇరువైపులా ఆవేదనే న్యాయం చేయాలని పోలీస్స్టేషన్ ఎదుట బాధిత కుటుంబం ధర్నా రెండేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి పరిష్కారం చూపాలని డిమాండ్.. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అధికారులు మహాబుబాబాద్ -దంతాలపల్లి:- ఇంటి దారి విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ తూర్పు తండాకు చెందిన ఓ కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పూర్వం నుంచి తమ కుటుంబం రాకపోకలకు ఉపయోగిస్తున్న బాటను కొందరు పూడ్చివేయడంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తమ తాతల కాలం నుంచి అదే దారిలో రాకపోకలు సాగిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లుగా బాట విషయంలో తమ దగ్గరి బంధువులతో వివాదం కొనసాగుతోందని, ఈ కారణంగా తమ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని వాపోయారు. కొంతమంది వ్యక్తులు కుమ్మక్కై తమ కుటుంబాన్ని ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఇంటి వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ వాటిని తొలగించారని, తరచూ గొడవలు జరుగుతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ విషయంపై గత రెండేళ్లుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తమ దగ్గరి బంధువుల నుంచి ప్రాణహాని ఉందని, అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్ కి వెలితే మీరు ఎవ్వరు రాకూడదని బయటకి పోవాలి అని ఎస్ ఐ ధూచించడాని వాళ్ళు ఆరోపించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించాం: ఎస్ఐ బాట పూడ్చివేశారంటూ ఫిర్యాదు అందిన వెంటనే తహసీల్దార్, ఎంపీడీవోలతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్ఐ తెలిపారు. బాటకు సంబంధించిన వ్యక్తిని దారి ఇవ్వాలని కోరగా, స్థలం ఇస్తే తన పిల్లలకు గృహాలు పడవని, అందువల్ల స్థలం ఇవ్వలేనని చెప్పినట్లు వివరించారు. అదేవిధంగా తండాలోని సుమారు 30 కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తిపై కూడా వివాదం ఉందని, బాధితుడు ఆ ఉమ్మడి ఆస్తిని కబ్జా చేసినట్లు స్థానికులు చెబుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు. ఇంటి బాట, ఉమ్మడి ఆస్తికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరినీ వ్యక్తిగతంగా గానీ, కుటుంబపరంగా గానీ దూషించలేదని, కించపరచలేదని స్పష్టం చేశారు.4
- ఎస్సై వేధింపులంటూ పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన ఎస్సై రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పు తండా గ్రామానికి చెందిన కుటుంబసభ్యులు గూగులోత్ రూప్సింగ్ వారి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ చేశారు. కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు. ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.1
- తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..1
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- రైల్వే లో GM ఉద్యోగాలు 👌పరీక్ష లేదు, వెంటనే అప్లికేషన్ పెట్టు /సెంట్రల్ govt job. #railwayjobs #see1
- నర్సింహులపేట వైన్ షాప్ ముందు భార్య, భర్తల ఆత్మహత్య యత్నం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్రం లోని మధుర వైన్ షాప్ ముందు బొజ్జన్న పేట గ్రామానికి చెందిన భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్ననికి పాల్పడ్డారు.. బెల్ట్ షాప్ కోసం వైన్ షాప్ నిర్వాహకుల వద్ద నుంచి 40వేల రూపాయల విలువ చేసే మద్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు.. అబ్కారి శాఖ, వైన్ షాప్ వాళ్ళు తమ వద్ద ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.. అమ్మిన వల్లే తమ దగ్గర ఉన్న మధ్యాన్ని తీసుకెళ్లడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.. తమ మధ్యాన్ని తమకు ఇప్పించాలని లేనట్టియితే ఆత్మహత్య చేసుకుంటామని వైన్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు..1