గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా శ్రీ ఖాజావలి 12.07.2026 తేదీన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజా సేవకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ ఖాజావలి మాట్లాడుతూ, దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రౌడీయిజం, గంజాయి రవాణా, దొంగతనాలు మరియు మహిళలపై జరిగే నేరాలపై ఉక్కుపాదం మోపుతామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నూతన సీఐ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 'శాంతిభద్రత - ప్రజా సేవయే మా ధ్యేయం' అనే నినాదంతో ఆయన నాయకత్వంలో దాచేపల్లి ప్రాంతం మరింత సురక్షితంగా, నేరరహితంగా మారుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా శ్రీ ఖాజావలి 12.07.2026 తేదీన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు మరియు ప్రజా సేవకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీ ఖాజావలి మాట్లాడుతూ, దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రౌడీయిజం, గంజాయి రవాణా, దొంగతనాలు మరియు మహిళలపై జరిగే నేరాలపై ఉక్కుపాదం మోపుతామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నూతన సీఐ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 'శాంతిభద్రత - ప్రజా సేవయే మా ధ్యేయం' అనే నినాదంతో ఆయన నాయకత్వంలో దాచేపల్లి ప్రాంతం మరింత సురక్షితంగా, నేరరహితంగా మారుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ సోషల్ మీడియా వర్క్షాప్లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.1
- బాపట్ల జిల్లా చుండూరులో వంగవీటి మోహన రంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. వంగవీటి రంగా కుమార్తె ఆశ కిరణ్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా అని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు కొనియాడారు. రంగా ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు తదితరులు పాల్గొన్నారు.1
- అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పరిధిలోని గంగవరం గ్రామంలో ఒక బావిలో చిక్కుకున్న భారీ రాజనాగును (కింగ్ కోబ్రా) అటవీ శాఖకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ (RRR) బృందం విజయవంతంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ను వన్యప్రాణుల సంరక్షణ కోసం చేపట్టిన "హనుమాన్" (HANUMAN) కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. గంగవరం గ్రామానికి చెందిన గ్రామస్తుడు శ్రీ రమేష్ తమ ఊరి బావిలో పెద్ద పాము పడి ఉండటాన్ని గమనించి వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించడంతో ఈ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే జీనబాడు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్, RRR బృంద నాయకుడు శ్రీ ఆర్. రాజబాబు ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీ పి. శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పి. సాయి ప్రణీత్, ప్రొటెక్షన్ వాచర్లు సత్యనారాయణ, అచ్చిబాబు పాల్గొన్నారు. అటవీ శాఖతో పాటు శ్రీ మూర్తి కంటిమహంతి నేతృత్వంలోని ఈజీడబ్ల్యూఎస్ (EGWS) స్వచ్ఛంద సంస్థ సభ్యులు కృష్ణ, ప్రసాద్ సాంకేతిక సహకారం అందించారు. మొదట పొడవైన వెదురు కర్రకు హుక్ కట్టి పామును రంధ్రం నుండి బయటకు లాగి, ఆపై హ్యాండ్ హెల్డ్ హుక్, పొడవైన సరుగుడు కర్ర సహాయంతో బావి నుండి సురక్షితంగా పైకి తీశారు. ఎలాంటి హాని కలగకుండా అత్యంత జాగ్రత్తగా పామును పైప్-బ్యాగ్లోకి ప్రవేశపెట్టి భద్రపరిచారు. అనంతరం ఈ రాజనాగును జీనాబాడు బీట్ పరిధిలోని సంకరం రిజర్వ్ ఫారెస్ట్ (RL) లో అడవిలోకి వదిలిపెట్టారు. ఈ విజయవంతమైన ఆపరేషన్పై రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. రాజబాబు మాట్లాడుతూ, హనుమాన్ కార్యక్రమం ద్వారా వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామస్తుడు శ్రీ రమేష్ చూపిన అప్రమత్తత, ఆర్ఆర్ఆర్ బృందం నైపుణ్యం, స్వచ్ఛంద సంస్థల సహకారం వల్లే ఈ అరుదైన జీవి ప్రాణాలు కాపాడగలిగామని తెలిపారు. ప్రజలు, అటవీ శాఖ, ఎన్జీవోలు కలిసి పనిచేస్తే వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమవుతుందని ఈ సంఘటన నిరూపించింది.4
- ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ)లో భూ పునఃసర్వే పనుల పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్, సర్వే అధికారులతో కలిసి సరిహద్దులు నిర్ధారించిన గ్రామాల పునఃసర్వే పురోగతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పునఃసర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.1
- ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముద్దుగా పెంచుకునే 'రాఖి' అనే పెంపుడు కుక్క నీటి సంపులో పడి మృతి చెందింది. దీంతో ఆ కుక్క యజమానులైన మామిళ్ళ కోటేశ్వరావు మరియు ఆయన కుమారులు ఆ పెంపుడు కుక్కకు దహన సంస్కారాలు నిర్వహించారు. తమ పెంపుడు కుక్కకు యజమాని కుమారులు స్వయంగా అంత్యక్రియలు జరిపించారు.2
- సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 28 ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు సంబంధించిన 28 మంది ఇన్స్ట్రక్టర్లకు, 28 మంది ఆయాలకు జాయినింగ్ ఆర్డర్లను అందజేశారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఈ పాఠశాలల నియామక పత్రాలను సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి గారికి, మంత్రివర్యులు శ్రీ తుమ్మల గారికి, శ్రీ పొంగులేటి గారికి అందరి తరపున ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, ఆయాలకు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు పలు కీలక సూచనలు చేశారు. పాఠశాలల్లోని చిన్నారులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆటలు, పాటలు ఆడిస్తూ వారికి చదువు చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు పాఠాలు నేర్పాలని, వారి ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే ఆహార విషయాలను స్వయంగా పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని దిశానిర్దేశం చేశారు.1
- బాపట్ల జిల్లా రేపల్లెలోని జగనన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 బైకులు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టణ సిఐ అశోక్, రూరల్ సిఐ సురేష్, సబ్ డివిజన్లోని పోలీసు సిబ్బందితో పాటు ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు.3
- విజయవాడ ఆటోనగర్లోని ఒక మెకానిక్ షెడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షెడ్డులో పార్కింగ్ చేసి ఉంచిన ప్రైవేట్ బస్సులకు మంటలు వ్యాపించడంతో, ఈ ఘటనలో మొత్తం ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.1