అంబం(వై)లో అంగన్ వాడి కేంద్రంను ఆకస్మికంగా సం దర్శించిన సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్....పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం,వివరాలు అడిగి తెలుసుకు న్న సర్పంచ్...... ఎడపల్లి,ఆగస్టు 1: ఎడపల్లి మండలం అంబం(వై)గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం స్థానిక సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు,గర్భిణీలకు,బా లింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని,భోజనంను పరిశీలించారు.చిన్నారుల నమోదు సంఖ్య రిజిస్టర్ ను ఆమె పరిశీలించారు.అలాగే పిల్లల ఆరోగ్యం,ఎత్తు బరువు ను అంగన్ వాడి టీచర్ గంగామణి ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ స్రవంతి సుమన్ మాట్లాడుతూ..చిన్నారులకు అందుతున్న సేవలు,చిన్నారుల సంక్షేమం,పోషకాహార కార్యక్రమాల ను పరిశీలించినట్లు చెప్పారు.చిన్నారుల ఆరోగ్యం, విద్య,సంక్షేమానికి అవసరమైన సహకారాన్ని అందిస్తా మని ఆమె తెలిపారు.
అంబం(వై)లో అంగన్ వాడి కేంద్రంను ఆకస్మికంగా సం దర్శించిన సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్....పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం,వివరాలు అడిగి తెలుసుకు న్న సర్పంచ్...... ఎడపల్లి,ఆగస్టు 1: ఎడపల్లి మండలం అంబం(వై)గ్రామంలోని అంగన్ వాడి కేంద్రాన్ని శనివారం స్థానిక సర్పంచ్ గోపరి స్రవంతి సుమన్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా అంగన్ వాడి కేంద్రంలో చిన్నారులకు,గర్భిణీలకు,బా లింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని,భోజనంను పరిశీలించారు.చిన్నారుల నమోదు సంఖ్య రిజిస్టర్ ను ఆమె పరిశీలించారు.అలాగే పిల్లల ఆరోగ్యం,ఎత్తు బరువు ను అంగన్ వాడి టీచర్ గంగామణి ని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ స్రవంతి సుమన్ మాట్లాడుతూ..చిన్నారులకు అందుతున్న సేవలు,చిన్నారుల సంక్షేమం,పోషకాహార కార్యక్రమాల ను పరిశీలించినట్లు చెప్పారు.చిన్నారుల ఆరోగ్యం, విద్య,సంక్షేమానికి అవసరమైన సహకారాన్ని అందిస్తా మని ఆమె తెలిపారు.
- వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రికల్ ఆటోలొస్తే మా బతుకులు రోడ్డున పడతాయి కంటతడి పెట్టిన సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వేములవాడలోని తిప్పాపూర్ లో ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆటో కార్మికుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా : మున్సిపల్ ఛైర్మన్ ప్రయాణికుల భద్రతే ఆటో డ్రైవర్ల ప్రథమ కర్తవ్యం : డీటీఓ దేవునూరు శ్రీనివాస్ ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపాలి : ఆటో యూనియన్ అధ్యక్షుడు సంద్రగిరి నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ : వేములవాడ ఆటో డ్రైవర్ల సమావేశంలో రవాణా శాఖ అధికారులు1
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- గద్దెనెక్కిoచిన మేము గద్దెనుoడి దిoచగలము కూడా అంటూ చైర్మన్ కు ఎంఐఎం ప్రెసిడెంట్ అత్తర్ అహ్మద్ స్ట్రాంగ్ వార్నింగ్ జహీరాబాద్ మున్సిపాలిటీలో రాజకీయ ప్రకoపనులు మిత్రపక్షం ఎంఐఎం నుంచే చైర్మన్ కు షాక్ జహీరాబాద్ మున్సిపల్ రాజకీయంల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది తమ మద్దతుతో చైర్మన్ పీఠం ఎక్కిన కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ యూనుస్ ఇప్పుడు తమనె విస్మరిస్తూన్నరoటూ ఎంఐఎం పార్టీ జహీరాబాద్ ఇంచార్జ్ అత్తర్ అహ్మద్ బహిరంగంగా విరుచుకు పడ్డారు 8వ వార్డ్ కౌన్సిలర్ సోనీ ఇర్మీయా ఆధ్వర్యంలో వార్డులో పర్యటించిన అత్తర్ అహ్మద్ వార్డులోని అధ్వాన్నoగా పరిస్థితిని స్వయంగా పరిశీలించారు1
- తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో మళ్లీ కురుస్తున్న వర్షం తాంసి మండల కేంద్రంలో శనివారం రాత్రి మళ్లీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. కప్పర్ల, బండల నాగపూర్, జామిడితో పాటు తదితర గ్రామాల్లోనూ వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటలకు అనుకూలిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రంలో లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్స్ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు, అదనపు చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ప్రతి విద్యార్థి నుంచి రూ.4 వేల వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనిపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అలాగే పాఠశాల యాజమాన్యం పుస్తకాలను పాఠశాలలోనే విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిరసన సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.1
- జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.1
- సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మెదక్, శనివారం: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే పిలుపు మేరకు, మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆరోపించారు. విద్యార్థులను అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం పోలీసు అధికారులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకుడు వాల్దాస్ అరవింద్ గౌడ్, బీజేపీ టౌన్ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైఎం నాయకులు ప్రేమ్, గణేష్, నర్సింగ్, రవి, రమేష్, గిరి, ప్రవీణ్, మధు, బబ్లూ, సన్నీ, మహేందర్, శ్యామ్ గౌడ్, చందు, సాయి, రాజేష్, దశరథ్, అనిల్, రాహుల్, విక్రమ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.1