Shuru
Apke Nagar Ki App…
భరణిపాడులో చిన్నారిపై వీధి కుక్కల దాడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గుల్లపూడి నరసింహారావు కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
V Ramarao
భరణిపాడులో చిన్నారిపై వీధి కుక్కల దాడి ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. గుల్లపూడి నరసింహారావు కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ఛాతీ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని గ్రామస్థులు, బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు.... భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.1
- వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం.. ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు . మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు1
- ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*2
- నేలకొండపల్లిలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం.. రైతుల హర్షం! నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని పైనంపల్లి, కొత్త కొత్తూరు, అనంతనగర్, నేలకొండపల్లి, చెరువు మాదారం, తిరుమలాపురం తదితర గ్రామాల్లో వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని భావించిన ప్రాంతీయ రైతన్నలు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు.1
- హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదు హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పాడు హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలను అలాగే వేధిస్తున్నాడు హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారు తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడు హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్1
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.1
- కోయంబత్తూర్లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....1