*పత్రికా ప్రకటన* *రైతుకు గిట్టుబాటు ధరే ప్రభుత్వ ధ్యేయం* *జులుకుంటలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్* శ్రీ సత్యసాయి జిల్లా,సోమందేపల్లి, జనవరి 8:రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వమే నేరుగా కందుల కొనుగోలు చేపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం జులుకుంట గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... దళారుల మోసాలకు గురికాకుండా రైతుల వద్దకే అధికారులు వచ్చి కందులు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో కందులతోపాటు మొక్కజొన్న కూడా అధికంగా సాగు చేస్తున్నారని రైతుల ద్వారా తెలుసుకున్నామని, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా, నాణ్యమైన కందులను సక్రమంగా కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. కందుల సేకరణ విధానం, తూకం, నాణ్యత ప్రమాణాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఏపీ మార్క్ఫెడ్ మేనేజర్ గీతా, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మెన్ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి విజయభారతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
*పత్రికా ప్రకటన* *రైతుకు గిట్టుబాటు ధరే ప్రభుత్వ ధ్యేయం* *జులుకుంటలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్* శ్రీ సత్యసాయి జిల్లా,సోమందేపల్లి, జనవరి 8:రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వమే నేరుగా కందుల కొనుగోలు చేపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లి మండలం జులుకుంట గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... దళారుల మోసాలకు గురికాకుండా రైతుల వద్దకే అధికారులు వచ్చి కందులు కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో కందులతోపాటు మొక్కజొన్న కూడా అధికంగా సాగు చేస్తున్నారని రైతుల ద్వారా తెలుసుకున్నామని, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా, నాణ్యమైన కందులను సక్రమంగా కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు. కందుల సేకరణ విధానం, తూకం, నాణ్యత ప్రమాణాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఏపీ మార్క్ఫెడ్ మేనేజర్ గీతా, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మెన్ వెంకటరమణ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డీవీ ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి విజయభారతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం కోర్టు లో బాంబు బెదిరింపు రావడంతో. పరుగులు పెట్టిన న్యాయవాదులు. కుప్పం ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన కలవర పెడుతోంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యంత్రాంగం.. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో పెట్టారనే బెదిరింపుతో అక్కడ ఉన్న న్యాయవాదులు. ప్రజలు పరుగులు తీశారు. బాంబుస్కోడ్ తనిఖీలు చేపడుతున్నారు1
- Post by Bondhu Suresh1
- ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా1
- PPP విధానం ఆపండి1
- *ఎన్నికలలో హామీలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమ కేసుల?* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థి విజన సంఘాల నాయకుల పైన రౌడీషీట!?* *రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నారా లోకేష్* *విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ ను ఎత్తివేయాలి* *రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం* *ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైయస్సార్ విద్యార్థి విభాగం* *రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్ర, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు బాబు, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ జైలుకు పంపడాన్ని ఖండించారు.. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం లేదు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు యువజనలకు వాటిని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి దొంగ కేసులను బయటికి తోడి విద్యార్థి యువజన సంఘాల నాయకులను జైలుకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను కేసుల ద్వారానో జైల్లోకు పంపడం ద్వారానో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారానో విద్యార్థి యువజన ఉద్యమాలను అనిచివేయాలని చూస్తూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెడతారా అని మన ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి నేరుగా తీసుకురండి మేము కేసులు పెట్టడం అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండదని చెప్పిన నారా లోకేష్ ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఎలా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వేయాలని విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు తేజ అరుణ్ నాగరాజు మహేష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*1
- పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డెన్సర్ నిర్వహించడం జరిగింది డీఎస్పీ హనుమంతరావు పాయింట్స్: గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసువారికి సమాచారం ఇవ్వండి పిల్లలపై తల్లిదండ్రులనిగా తప్పనిసరిగా ఉండాలని సూచించారు పల్నాడు జిల్లాలో అసెంఘిక కార్యక్రమాలకి తావులేదని అలాంటివి తమ దృష్టికి వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు,1
- బద్వేల్ పట్టణంలో మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కలసి పన్ను వసూలు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. సత్వరమే పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. టాప్ 100 నుండి బకాయిదారుల జాబితా బహిరంగ ప్రదేశాల్లో కూడళ్లలో త్వరలో ప్రదర్శన చేస్తామన్నారు. ఏళ్ల తరబడి బకాయిలు ఉన్న పన్ను ఎగవేతదారులు తక్షణమే పన్నులు చెల్లించకపోతే వ్యాపార సముదాయాలు సీజ్ చేస్తామన్నారు.1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్.. కుప్పం కోర్టు లో బాంబు బెదిరింపు రావడంతో. పరుగులు పెట్టిన న్యాయవాదులు. కుప్పం ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిన కలవర పెడుతోంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యంత్రాంగం.. కోర్టు ప్రాంగణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కోర్టులో పెట్టారనే బెదిరింపుతో అక్కడ ఉన్న న్యాయవాదులు. ప్రజలు పరుగులు తీశారు. బాంబుస్కోడ్ తనిఖీలు చేపడుతున్నారు1
- ఆసుపత్రిలో తండ్రి ప్రేమను చూపించిన హృదయవిదారక వీడియో. అనారోగ్యంతో ఉన్న తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు తండ్రి నవ్వుతూ, ఆమెతో మాట్లాడుతూ పక్కనే ఉండే దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.1