Shuru
Apke Nagar Ki App…
పెదకూరపాడు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు గేదెలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. తమ్మవరం గ్రామానికి చెందిన గుడేటి ప్రవీణ్ తన రాడ్ బెండింగ్ పనులు ముగించుకొని, భార్య శ్రావణితో కలిసి అత్తగారి గ్రామం పాడిపంటలు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పరస వద్దకు చేరుకోగానే గేదెలు ఒక్కసారిగా అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనం ద్వారా వారిని పెదకూరపాడు CHCకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం వారిని GGHకి తరలించారు.
Raju Paragati
పెదకూరపాడు ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు గేదెలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. తమ్మవరం గ్రామానికి చెందిన గుడేటి ప్రవీణ్ తన రాడ్ బెండింగ్ పనులు ముగించుకొని, భార్య శ్రావణితో కలిసి అత్తగారి గ్రామం పాడిపంటలు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పరస వద్దకు చేరుకోగానే గేదెలు ఒక్కసారిగా అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో 108 వాహనం ద్వారా వారిని పెదకూరపాడు CHCకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించే నిమిత్తం వారిని GGHకి తరలించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయవాడ వన్ టౌన్ సీఐ నాగరాజును అరెస్టు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విజయవాడ నగర పోలీసులు పటిష్ట బందోబస్తు మధ్య ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుండి తరలించారు.1
- గాదె సాయికృష్ణ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.1
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తగిన స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రైతు ఆశీర్వాదం సభను నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేయడం ద్వారా తన గళాన్ని బలంగా వినిపించి వైరా ప్రాజెక్టుకు గోదావరి జలాలను సాధించుకుంటానని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న లక్షలాది మంది రైతులతో నిర్వహించే ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన రైతాంగాన్ని కోరారు.1
- ఖమ్మంలో లైంగిక దాడి, హత్యాయత్నానికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సభ్యురాలు విజయభారతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాలిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని విజయభారతి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం, బాధితురాలి వెన్నెముక పూర్తిగా చితికిపోయిన కారణంగా ఆమె జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితమవుతుందని పేర్కొన్నారు.1
- పేర్ని నాని పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడినా తమ కార్యకర్తలు ఎవరూ స్పందించవద్దని కోరారు. జనసేన పార్టీకి మత్తు దిగిపోయిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖను తీసుకొని ఆ శాఖకు ఏమైనా న్యాయం చేశారా అని పేర్ని నాని ప్రశ్నించారు. హోమ్ శాఖ తన చేతిలో లేదని పవన్ అంటున్నారని, అయితే ముందు తాను తీసుకున్న శాఖపై దృష్టి పెట్టాలని, దానికి న్యాయం చేస్తేనే ఇతర విషయాల గురించి ఆలోచించవచ్చని సలహా ఇచ్చారు. గ్రామ పంచాయతీల ప్రతి అకౌంట్ సీజ్ అయి ఉందని, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదని ఆయన గుర్తు చేశారు. లా అండ్ ఆర్డర్ పవన్ చేతికి ఇస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీలను, గూండాలను తొక్కి నార తీస్తారా అని పేర్ని నాని వ్యంగ్యంగా అడిగారు. పవన్ కల్యాణ్ కుంకి ఏనుగులు తెచ్చారని చెబుతున్నారని, అయితే ఆ తెచ్చిన ఏనుగుల్లో ఒకటి కుంటిది, ఇంకోటి గుడ్డిది అని ఆయన ఎద్దేవా చేశారు. ఇచ్చిన శాఖకు న్యాయం చేయాలని, వేరే శాఖల గురించి తర్వాత మాట్లాడాలని పవన్ కల్యాణ్ కు పేర్ని నాని స్పష్టం చేశారు. వైసిపి కార్యకర్తలకు తాను ఒక్కటే చెబుతున్నానని, పవన్ కల్యాణ్ “ఆటలో అరటిపండు” లాంటివాడని, అతని గురించి ఎవరూ పట్టించుకోవద్దని పునరుద్ఘాటించారు. జనసేన పార్టీకి మత్తు దిగిందని, మళ్లీ మత్తు ఎక్కించడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని తన వ్యాఖ్యలను ముగించారు.1
- ఖమ్మం జిల్లా మంత్రులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.1
- కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మరియు మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా, అనుమానాస్పద మృతిగా నమోదైన క్రాంతికుమార్ కేసును రీ-ఓపెన్ చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని, ఇప్పటివరకు పలువురు దళితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దళితులపై ప్రేమ ఉందని చెప్పుకునే నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, క్రాంతికుమార్ మరణం అనుమానాస్పదంగా ఉందని, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయం కావడం తీవ్ర అనుమానాలకు దారితీస్తోందని అన్నారు. ఈ కేసుతో పాటు గాదె సాయికృష్ణ ఘటనపై కూడా సమగ్ర సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.1
- సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేస్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని సీనియర్ మంత్రి తుమ్మలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి శూన్యమని, కేవలం అవినీతి కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసింది తానే అని ఓ సీనియర్ మంత్రి చెప్పుకుంటున్నారని, అయితే సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ముఖ్యమని నామా అన్నారు. నామా నాగేస్వరరావు తన విమర్శలను కొనసాగిస్తూ, ఎరువుల కట్టలు ఇవ్వలేక యాప్ పెట్టారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం కోసమే పార్టీ మారారని, సీతారామ ప్రాజెక్టు 80 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేవలం ఒక్క మోటరు పెట్టి నేనే చేశానని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఈ 'ముండ మోపి ప్రభుత్వం' రైతు బంధును ఎగ్గొట్టిందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేసీఆర్ 50 వేల కోట్ల నిధులు తీసుకొచ్చారని, కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ పచ్చగా ఉంటుందని నామా నాగేస్వరరావు స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో కేసీఆర్ లాంటి నాయకుడు లేడని, ఆయన వచ్చాకే సాగునీరు, తాగునీరుకు లోటు లేకుండా పోయిందని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రైతులు, ప్రజలు బాగుపడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా కేసీఆరే దిక్కు అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఎవరూ ఆలోచించని విధంగా కేసీఆర్ ఆలోచించి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ కార్యక్రమాన్ని మోడీతో సహా చాలా రాష్ట్రాలు కాపీ కొట్టాయని నామా నాగేస్వరరావు ప్రశంసించారు.1
- రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో ₹1.40 కోట్లతో నిర్మించిన నూతన జడ్పీ హైస్కూల్ను ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మోపిదేవి పుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంత్రి లోకేష్కి స్వాగతం పలికారు.1