*TDP సీనియర్ నేతను గోరంగా అవమానించిన MLA* *మరోసారి టీడీపీ నేత కాదంటూ రుజువు చేసుకున్న నేత* *షాక్ అవుతున్న TDP క్యాడర్* మదనపల్లి: నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న నేత, ప్రజాభిమానం ఉన్న నాయకుడు, YCP ప్రభుత్వ సమయంలో విరోచిత పోరాటం చేసిన కార్యకర్త, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా జిల్లా స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడు R J వెంకటేష్ తన తల్లి మూడు రోజుల ముందు మరణించడం ఆ కుటుంబానికి భాధాకరణమే అయినా,ఈ సందర్బంగా పక్క నియోజకవర్గం MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,టీడీపీ నాయకులు బాబు రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డిశాహెబ్ ఇలా ప్రతి ఒక్కరూ R J వెంకటేష్ ని పరామశించారు. అయితే మదనపల్లి స్థానిక MLA షాజహాన్ భాషా మాత్రం టీడీపీ నాయకుడిపై తన నిజస్వరూపం చూపించాడు. పట్టుమని పది కిలోమీటర్లు లేని వెంకటేష్ గ్రామానికి వెళ్లి పరామశించకపోవడంతో ఇటు వెంకటేష్ తో పాటు, నియోజకవర్గ టీడీపీ క్యాడర్ అవాక్కాయారు. గత ఎన్నికల సమయంలోను, మీడియా సమావేశంలోను, టీడీపీ పార్టీ గెలుపు కోసం, MLA గెలుపుకోసం పనిచేసిన R J వెంకటేష్ ని పట్టించుకుపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. పార్టీ కార్యకర్తలకే కాదు, సీనియర్ నాయకుడి సైతం పట్టించుకోని MLA తీరుపై గుర్రుమంటున్నారు. #SHAJAHANBHASHA #madanapalle MLA #RJVENKATES
*TDP సీనియర్ నేతను గోరంగా అవమానించిన MLA* *మరోసారి టీడీపీ నేత కాదంటూ రుజువు చేసుకున్న నేత* *షాక్ అవుతున్న TDP క్యాడర్* మదనపల్లి: నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న నేత, ప్రజాభిమానం ఉన్న నాయకుడు, YCP ప్రభుత్వ సమయంలో విరోచిత పోరాటం చేసిన కార్యకర్త, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా జిల్లా స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలబడిన నాయకుడు R J వెంకటేష్ తన తల్లి మూడు రోజుల ముందు మరణించడం ఆ కుటుంబానికి భాధాకరణమే అయినా,ఈ సందర్బంగా పక్క నియోజకవర్గం MLA నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,టీడీపీ నాయకులు బాబు రెడ్డి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డిశాహెబ్ ఇలా ప్రతి ఒక్కరూ R J వెంకటేష్ ని పరామశించారు. అయితే మదనపల్లి స్థానిక MLA షాజహాన్ భాషా మాత్రం టీడీపీ నాయకుడిపై తన నిజస్వరూపం చూపించాడు. పట్టుమని పది కిలోమీటర్లు లేని వెంకటేష్ గ్రామానికి వెళ్లి పరామశించకపోవడంతో ఇటు వెంకటేష్ తో పాటు, నియోజకవర్గ టీడీపీ క్యాడర్ అవాక్కాయారు. గత ఎన్నికల సమయంలోను, మీడియా సమావేశంలోను, టీడీపీ పార్టీ గెలుపు కోసం, MLA గెలుపుకోసం పనిచేసిన R J వెంకటేష్ ని పట్టించుకుపోవడంతో ఆయన అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు. పార్టీ కార్యకర్తలకే కాదు, సీనియర్ నాయకుడి సైతం పట్టించుకోని MLA తీరుపై గుర్రుమంటున్నారు. #SHAJAHANBHASHA #madanapalle MLA #RJVENKATES
- చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాతి పని లేక 20 వేల మంది వడ్డెర కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 120 ఆలయాలకు అవసరమైన రాళ్లను ప్రైవేటు భూముల నుండి సేకరిస్తున్నారని, తమకు పని కల్పించాలని కడపిడికి వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు.1
- అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలం జీడిపల్లిలో కుక్కల దాడిలో ఒకేసారి 52 గొర్రెపిల్లలు మృతి చెందాయి. ఎర్రిస్వామి అనే గొర్రెల కాపరికి చెందిన ఈ గొర్రెపిల్లల మృతితో రైతుకు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఈ ఘటనతో ఎర్రిస్వామి తీవ్ర విషాదంలో మునిగిపోయారు.1
- రాయదుర్గం పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ధర్నా చేపట్టింది. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ముందస్తు అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు అధిక ధరలకు అమ్ముతుండడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు బైఠాయించి నిరసన తెలిపారు.2
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా1
- కడపలో ఎప్పుడూ చూడని విధంగా వివాదాస్పద ఘటన జరగడం దు*రదృష్టకరం. ఈ ఘటనలో కొందరు అమాయకులపై, మై*నర్లపై కూడా పోలీ*సులు కే*సులు నమోదు చేసి జై*ల్లో పెట్టారు. అసలైన దో*షులపై చ*ర్యలు తీసుకుని, కే*సుతో సంబంధం లేని వారిని వెంటనే వి*డుదల చేయాలని కోరుతున్నాం. -వైయస్ అవినాష్ రెడ్డి గారు, కడప ఎంపీ1
- ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవులు తమకు ఎస్సీ హోదా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ను తక్షణమే నెరవేర్చాలని వారు ఈ సందర్భంగా నినదించారు.1
- ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1