logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుష్పాల వాగు వద్ద బురదలో స్కూల్ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం మెదక్ పట్టణ సమీపంలోని పుష్పాల వాగు వద్ద శనివారం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బురదలో చిక్కుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతేడాది వరదల్లో వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు మట్టి పోసి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆ మార్గం పూర్తిగా బురదమయంగా మారింది. ఈ క్రమంలో పాఠశాల బస్సు ముందుకు కదలక నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బస్సు నుంచి దిగి రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న స్థానికులు, వాహనదారులు సహకరించడంతో బస్సును బయటకు తీశారు. శాశ్వత వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి, విద్యార్థులు మరియు ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

1 hr ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 hr ago

పుష్పాల వాగు వద్ద బురదలో స్కూల్ బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం మెదక్ పట్టణ సమీపంలోని పుష్పాల వాగు వద్ద శనివారం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు బురదలో చిక్కుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతేడాది వరదల్లో వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు మట్టి పోసి తాత్కాలికంగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆ మార్గం పూర్తిగా బురదమయంగా మారింది. ఈ క్రమంలో పాఠశాల బస్సు ముందుకు కదలక నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు బస్సు నుంచి దిగి రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న స్థానికులు, వాహనదారులు సహకరించడంతో బస్సును బయటకు తీశారు. శాశ్వత వంతెన నిర్మాణాన్ని వేగవంతం చేసి, విద్యార్థులు మరియు ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.
    1
    ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు
చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    1
    రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు  హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/ తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    4
    మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘానికి నూతన అధ్యక్షుడు
ఏకగ్రీవంగా బాహోజు పాండరి ఎన్నిక

గజ్వేల్ మేడ్చల్, కుత్బుల్లాపూర్. ప్రజా తెలంగాణ న్యూస్/
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ ఎస్ ఎస్ ) అనుబంధంగా నిర్వహించిన మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘం ఎన్నికలు–2026లో బాహోజు పాండరి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం కుత్బుల్లాపూర్ మండలంలోని శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో నిర్వహించిన నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష పదవికి బాహోజు పాండరి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎన్నికల అధికారులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల పరిశీలకుడు వింజమూరి రాఘవాచారి, ఎన్నికల అధికారి చేపూరి వెంకటస్వామి సమక్షంలో నూతన అధ్యక్షుడికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బాహోజు పాండరి మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా స్వర్ణకారుల సంక్షేమం, సంఘ బలోపేతం, సభ్యుల ఐక్యత, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంఘ పెద్దలు, నాయకులు, సభ్యులు బాహోజు పాండరిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో జిల్లా స్వర్ణకార సంఘం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా స్వర్ణకార సంఘంతెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం (టీ జీ యస్ యస్ ) ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    35 min ago
  • అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    3
    అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు.
ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    3
    ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి.
ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది.
ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు.
వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ
    user_CHERUKU RAMESH
    CHERUKU RAMESH
    Chiropractor మేడిపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్
    1
    ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్
ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి
కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం 
ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు 
- పవన్ కళ్యాణ్
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    10 hrs ago
  • జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.
    1
    జిల్లా బాలల  ఉన్నత పాఠశాలకు వంట గ్యాస్ పొయ్యిలు అందజేసిన దాతలు 
పెద్దశంకరంపేట మండలంలోని జిల్లా బాలల ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావాన్ని చాటుతూ గడ్డం వెంకన్న, మల్లన్న వంట గ్యాస్ పొయ్యిలను విరాళంగా అందజేశారు. వర్షాకాలంలో మధ్యాహ్న భోజనాల తయారీలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ శిరీష సమక్షంలో గ్యాస్ పొయ్యిలను పాఠశాలకు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల సిబ్బంది కూడా వారి సేవాభావాన్ని అభినందించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • రేలమడుగు కళ్ళు దుకాణంలో బొమ్మ బోరుసు ఆడుతున్న 9 మంది అరెస్ట్ 7910 రూపాయలు నగదు స్వాధీనం ఆర్ సెల్ ఫోన్లు సీజ్ ఎస్పి శ్రీనివాసరావు బొమ్మా బొరుసు ఆడుతున్న 9 మంది అరెస్టు రూ.7,910 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు మెదక్‌ మండలం ర్యాలమడుగు గ్రామంలో కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మా బొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో శేఖర్‌, యాదగిరి, చంద్రశేఖర్‌, ప్రవీణ్‌, చంద్రం, కిష్టయ్య, పోలె లక్ష్మణ్‌, దుర్గేష్‌, నిఖిల్‌ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, జూదం, పేకాట, బొమ్మా బొరుసు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత జూదం, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
    1
    రేలమడుగు కళ్ళు దుకాణంలో బొమ్మ బోరుసు ఆడుతున్న 9 మంది అరెస్ట్ 7910 రూపాయలు నగదు స్వాధీనం ఆర్ సెల్ ఫోన్లు సీజ్ ఎస్పి శ్రీనివాసరావు
బొమ్మా బొరుసు ఆడుతున్న 9 మంది అరెస్టు
రూ.7,910 నగదు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం
మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు
మెదక్‌ మండలం ర్యాలమడుగు గ్రామంలో కల్లు దుకాణం వెనుకవైపు బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మా బొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,910 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో  శేఖర్‌,  యాదగిరి,  చంద్రశేఖర్‌,  ప్రవీణ్‌,  చంద్రం,  కిష్టయ్య, పోలె లక్ష్మణ్‌, దుర్గేష్‌, నిఖిల్‌ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, జూదం, పేకాట, బొమ్మా బొరుసు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత జూదం, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    45 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.