*భార్య ఉరి వేసుకుంటుండగా వీడియో తీసిన భర్త… రాజంపేటలో విషాదం* అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*భార్య ఉరి వేసుకుంటుండగా వీడియో తీసిన భర్త… రాజంపేటలో విషాదం* అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
- మాజీ డీజీపీ హెచ్. జె. దొరకు అనారోగ్యంతో నిన్న మరణించగా, ఈ రోజు హైదరాబాద్లో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. పోలీస్ శాఖలో పవర్ఫుల్ ఆఫీసర్గా గుర్తింపు పొందిన దొరకు, పోలీస్ అధికారులు, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరై పాడె మోసి, హృదయపూర్వకంగా వీడ్కోలు పలికారు. తన కర్తవ్యం, కృషి, మరియు నిబద్ధతతో ఎంతోమంది పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయనకు అశ్రునయనాలతో చివరి నివాళి అర్పించబడింది. ఈ సందర్భంలో పలువురు అధికారులు, సీనియర్ సిబ్బంది దొర సేవలను కొనియాడుతూ, ఆయన కృషి, దృఢ నిబద్ధత, మరియు పోలీస్ శాఖలో చూపిన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని గుర్తుచేశారు. పోలీస్ కమ్యూనిటీలో ఆయన పేరు ఎల్లప్పుడూ గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మాజీ డీజీపీ దొరకు, పవర్ఫుల్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా, ఓ హృదయపూర్వక నాయకుడిగా పోలీస్ సిబ్బందికి, మరియు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు, అనుభవాలు, మరియు ధైర్యం తరం తర్వాతి పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిగా మారతాయి.1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా, మల్కిపురం లక్కవరం గ్రామంలో మూడవ తరగతి చదువుతున్న శృతి అనే 8 ఏళ్ళ బాలికపై అదే గ్రామానికి చెందిన 44 ఏళ్ల మేడిది నాగబాబు అత్యాచార ప్రయత్నం చేశారు. బాలికను ఇంటి పక్క ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్ళి1
- ప్రత్తిపాడు, శంఖవరం మండలాల సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. మాసంపల్లి వద్ద అధికారులు బోనును ఏర్పాటు చేసి, అందులో దూడను ఉంచారు. అయితే పులి చాకచక్యంగా మార్గాన్ని మార్చుకుని ఎస్.జగ్గంపేట సమీపంలోని పెద్దబాపన్నదొర చెరువు పరిసరాలకు చేరుకుంది. అటవీ శాఖ బృందాలు GPS రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను నిశితంగా గమనిస్తూ, బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి1
- కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.4
- Post by Venkata laxmi Kothapalli4
- Post by Shyam1
- ఉపవాసం ఉన్న వారికి భోజనం వండుతున్న వెంకటేశ్వరరావు గుంటూరులోనీ గుజ్జనగుండ్ల మసీదులో రంజాన్ నెల లో రోజా ఉన్నవారికి మసీదు కమిటీ సహారీ ఏర్పాటు చేయడం జరిగింది. నెల రోజుల నుండి రోజా ఉన్నవారికి రాత్రి 12 గంటల నుంచి సహారీ ఏర్పాటు చేస్తూ అల్తాఫ్ క్యాటరింగ్ వంట మాస్టర్ సుభాని, వెంకటేశ్వరరావు మతసామరస్యాన్ని చాటుతున్నారు.1
- అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1