*వృద్ధులకు మాయ మాటలు చెప్పి పింఛను అపహరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి* *లబోదిబోమంటున్న బాధితురాళ్ళు* మండపేట. ఎనిమిది వేలు రావాల్సిన పింఛను నాలుగువేలె రావడం ఏంటి అంటూ ఓ వ్యక్తి వృద్ధులను మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ పట్టణంలో అందినకాడికి డబ్బులు అపహరించుకుపోతున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే మండపేట సెయింట్ ఆన్స్ స్కూల్ వీధిలో కాసిలంక సుబ్బారావు అనే వ్యక్తి కి ఈ రోజు ఉదయమే 4 వేల రూపాయల పింఛను అందింది. కాలి సమస్య కారణంగా ఇతను నడవలేడు. భార్యే అన్ని చూసుకుంటుంది. కాగా ఈ రోజు ఉదయం 9.30 సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వీరి వద్దకు వచ్చాడు. వస్తూనే అమ్మా మీకు పింఛను ఎంత వస్తుంది అని సుబ్బారావు భార్య గంగా భవాని నీ ప్రశ్నించాడు. నాలుగు వేలు అని చెప్పగా అదేంటి నీకు ఎనిమిది వేలు ఇవ్వలేదా అని ప్రశ్నించాడు. లేదని చెప్పగా నీ భర్త నడవలేడుగా మీలాంటి వారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటూ ప్రేమగా నాలుగు మాటలు కలిపాడు. మీ ఆధార కార్డు, ఫోటోలు కావాలి అని చెప్పాడు. మీకు ఎంత డబ్బులు ఇచ్చారో ఇలా చూపించండి అంటూ చేతిలో నాలుగు వేలు పెట్టీ ఫోటో తీసుకున్నాడు. ఆపై ఎవరికో ఫోన్ చేసి పేరు వివరాలు చెప్పి వెంటనే 8 వేలు పట్టుకుని రావాలని చెప్పాడు. మీ దగ్గరి డబ్బులు ఇలా ఇచ్చేయండి వేరొకరు వచ్చి 8 వేలు ఇస్తారని చెప్పి అక్కడ నుండి ఉడాయించాడు. కాగా తాజా గా అందిన సమాచారం ప్రకారం 29వార్డులో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఇద్దరికి ఆ పింఛనే ఆధారమని, అది కాస్తా మొత్తం పోయిందని, ఇక ఈ నెల అంతా ఎలా గడపాలి అంటూ మోసానికి గురైన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాగా ఈ మోసగాడు పట్టణం లోనే తిరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు పింఛనుదారులను, అమాయకులను అప్రమత్తం చేయాల్సి ఉంది.
*వృద్ధులకు మాయ మాటలు చెప్పి పింఛను అపహరిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి* *లబోదిబోమంటున్న బాధితురాళ్ళు* మండపేట. ఎనిమిది వేలు రావాల్సిన పింఛను నాలుగువేలె రావడం ఏంటి అంటూ ఓ వ్యక్తి వృద్ధులను మాయ మాటలు చెప్పి మోసం చేస్తూ పట్టణంలో అందినకాడికి డబ్బులు అపహరించుకుపోతున్నాడు. ఇక వివరాల్లోకి వెళితే మండపేట సెయింట్ ఆన్స్ స్కూల్ వీధిలో కాసిలంక సుబ్బారావు అనే వ్యక్తి కి ఈ రోజు ఉదయమే 4 వేల రూపాయల పింఛను అందింది. కాలి సమస్య కారణంగా ఇతను నడవలేడు. భార్యే అన్ని చూసుకుంటుంది. కాగా ఈ రోజు ఉదయం 9.30 సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వీరి వద్దకు వచ్చాడు. వస్తూనే అమ్మా మీకు పింఛను ఎంత వస్తుంది అని సుబ్బారావు భార్య గంగా భవాని నీ ప్రశ్నించాడు. నాలుగు వేలు అని చెప్పగా అదేంటి నీకు ఎనిమిది వేలు ఇవ్వలేదా అని ప్రశ్నించాడు. లేదని చెప్పగా నీ భర్త నడవలేడుగా మీలాంటి వారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు అంటూ ప్రేమగా నాలుగు మాటలు కలిపాడు. మీ ఆధార కార్డు, ఫోటోలు కావాలి అని చెప్పాడు. మీకు ఎంత డబ్బులు ఇచ్చారో ఇలా చూపించండి అంటూ చేతిలో నాలుగు వేలు పెట్టీ ఫోటో తీసుకున్నాడు. ఆపై ఎవరికో ఫోన్ చేసి పేరు వివరాలు చెప్పి వెంటనే 8 వేలు పట్టుకుని రావాలని చెప్పాడు. మీ దగ్గరి డబ్బులు ఇలా ఇచ్చేయండి వేరొకరు వచ్చి 8 వేలు ఇస్తారని చెప్పి అక్కడ నుండి ఉడాయించాడు. కాగా తాజా గా అందిన సమాచారం ప్రకారం 29వార్డులో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ ఇద్దరికి ఆ పింఛనే ఆధారమని, అది కాస్తా మొత్తం పోయిందని, ఇక ఈ నెల అంతా ఎలా గడపాలి అంటూ మోసానికి గురైన వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. కాగా ఈ మోసగాడు పట్టణం లోనే తిరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు పింఛనుదారులను, అమాయకులను అప్రమత్తం చేయాల్సి ఉంది.
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- Post by SS NEWS1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀1
- Post by Adimlamrambabu Adimlamrambabu1