కో- ఆప్షన్ లో సీనియర్ లకు ప్రాధాన్యం ఇవ్వాలి.... కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ బాపూజీ మెట్ పల్లి, ఏప్రిల్ 21: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ బాపూజీ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.పార్టీ అభివృద్ధికి సంవత్సరాలుగా కృషి చేసిన నాయకులను గుర్తించి కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 20 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఓడిపోయిన వారిలో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు అధికంగా ఉన్నారని తెలిపారు.పార్టీ కోసం నిరంతరం శ్రమించిన సీనియర్లతో పాటు యువత, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బాపూజీ విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
కో- ఆప్షన్ లో సీనియర్ లకు ప్రాధాన్యం ఇవ్వాలి.... కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ బాపూజీ మెట్ పల్లి, ఏప్రిల్ 21: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల నియామకంలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ బాపూజీ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.పార్టీ అభివృద్ధికి సంవత్సరాలుగా కృషి చేసిన నాయకులను గుర్తించి కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించాలని సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో 20 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఓడిపోయిన వారిలో అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులు అధికంగా ఉన్నారని తెలిపారు.పార్టీ కోసం నిరంతరం శ్రమించిన సీనియర్లతో పాటు యువత, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బాపూజీ విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
- పోటీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు యువత, అభ్యర్థులు సిద్ధమవుతుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడారు. విద్యార్హతలు, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు? ఏ ఏ పుస్తకాలు చదువుతున్నారు? ఆరా తీశారు. రోజా ఎంత మంది లైబ్రరీకి వస్తారని గ్రంథాలయ అధికారిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అన్ని సబ్జెక్టులు ప్రణాళిక ప్రకారం.. ప్రతి అంశం క్షుణ్ణంగా చదవాలని సూచించారు. కరెంట్ అఫైర్స్, ఇతర అన్ని అంశాలపై మంచి అవగాహనతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కూడా రిఫరెన్స్ గా తీసుకోవాలని సూచించారు.1
- * మాత శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట * పిల్లలను తమ పిల్లలుగా భావించాలి * గ్రామీణస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచన * అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ * ఇప్పటికే 26 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేశాం నిత్యం పిల్లలతో మమేకమై ఉండే అంగన్వాడీల పాత్ర గ్రామీణస్థాయిలో అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. భీంగల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత,ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం చే అందజేస్తున్న స్మార్ట్ ఫోన్లను మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 72మంది అంగన్వాడీ టీచర్లు, ఇద్దరు సూపర్వైజర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామీణస్థాయిల్లో పిల్లలను తమ పిల్లలుగా భావించి క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత శిశు సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతుందని వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాద్యత అంగన్వాడీ టీచర్ల పై ఉంటుందన్నారు. పిల్లలకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారం అందజేయడంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గంలో మొత్తం అంగన్వాడీ భవనాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అవసరమైన చోట మరిన్ని మంజూరు చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ రాంబాబు, సూపర్ వైజర్లు సవిత,రాజేశ్వర్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ---------------------------------1
- *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.4
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.1
- కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని లింగారెడ్డి హెచ్చరించారు.. మంగళవారం శనగలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జైనథ్ రైతులు రోడ్డెక్కారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా రైతులకు అండగా అఖిలపక్షం మద్దతుగా నిలిచింది రైతులతో పాటు జాతీయ రాజధానిపై బైఠాంచి రాస్తారోకో తెలిపి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.... రైతుబంధు సమన్వయ అధ్యక్షులు లింగారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన శనిగలను ఈనెల 30 వరకు కొంటామని అధికారికంగా ప్రకటించి తీరా ప్రభుత్వ కోట అయిపోయిందంటూ శనిగల కొనుగోలు ఆపేయదంతో రైతులు రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. లక్ష పదివేల కుంటల శనగ పంట వేయగా ప్రభుత్వం కేవలం 24000 మాత్రమే కొనడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే మార్కెట్ ప్రారంభోత్సవంలో ఈనెల 30 వరకు జొన్నలు కొనుగోలు చేస్తామని మోసపూరిత ప్రకటన చేశారని మండిపడ్డారు.. శనగల కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీకి సైతం వినతి పత్రాలను బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేసినప్పటికీని రైతులపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం తగదన్నారు... రైతులకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 18 గ్రామాల శనగల తో పాటు జొన్నలను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తరహాలో ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్, గణేష్ యాదవ్, లింగారెడ్డి, వెంకట్ రెడ్డి,రామ్ రెడ్డి, వెంకన్న, బల్లి గంగన్న అనిత రెడ్డి, స్వామి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు,4
- కాంగ్రెస్ పార్టీకి మహిళలు బుద్ధి చెప్పాలి బిజెపి అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ పిలుపు దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యం దేశాభివృద్ధిలో మహిళలు ముందుకొస్తే అభివృద్ధి లో దూసుకెళ్తుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ అన్నారు మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మేలు చేస్తుందని చేస్తున్న ప్రకటనలు ప్రకటనలకే పరిమితం అన్నారు ఆరు గ్యారెంటీలలో మహిళలకు 2500 నగదు ఏమైందన్నారు యువతకు స్కూటీలు ఇస్తానని మోసం చేశారన్నారు వృద్ధులకు పెన్షన్ పెంచుతామని పెంచలేదన్నారు అన్ని వర్గాలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు మహిళా బిల్లు పవీగి పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మోసాలను మహిళలు గ్రహించాలన్నారు రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తే తమ సీట్లు గల్లంతయితాయని అపోహతో స్వార్థంతో బిల్లును అడ్డుకున్నారన్నారు మోడీ, ఏమిష లు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెస్తారు మహిళలకు 33 శాతం రిజర్వేషన్స్ ఉండాలని బీజేపీ బిల్లు పెట్టారు మహిళా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మా సీట్లను త్యాగాలు చేయడానికి సిద్ధం కాంగ్రెస్, ఇండియా కూటమిని మహిళలు చి కొడుతున్నారు రేవంత్ రెడ్డి వి కేవలం మాటలే చేతల్లో లేవు కెసిఆర్ లాగానే రేవంత్ పాలన సాగుతోంది ఆరు గ్యారెంటీ లు అమలు చేయడంలో రేవంత్ ఫెయిల్ అయ్యారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలనిపిలుపుఇచ్చారు. డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ఏలాంటి సంబంధం లేదు బీజేపీ నార్త్, సౌత్ అనే బేధం లేకుండా నిదులిస్తుంది కమిషన్లు ఇస్తేనే అభివృద్ధి పనుల నిధులు విడుదల అవుతున్నాయి ఓవెసి కి చెందిన ఫాతిమా కాలేజీ ని ఎందుకు కూల్చడం లేదు హైడ్రా పేదోళ్ళవే కూల్చుతున్నారు.. పెద్దలవి వదిలేస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతుందికెసిఆర్ ఫాం హౌజ్ లో కూర్చొని మందు తాగుతున్నారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ కి వచ్చి కొట్లాడాలి బిఆర్ఎస్ అంటేనే భష్టు పట్టిన రాష్ట్ర సమితి ప్రగతి భవన్ పేరు తీసేసి కమిషన్ భవన్ అని పెట్టాలి ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే హైడ్రా కూల్చుతున్న భవనాల అనుమతులు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలి వ్యవస్థ కరెక్ట్ ఉంటే బఫర్ జోన్ లల్లో ఇల్లు ఎందుకు కడుతారు ప్రభుత్వానికి మానవత్వం లేదు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ, ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమి చేస్తుంది ప్రజల హక్కుల కోసం పోరాడే వారి కోసం పనిచేస్తుంది ఎన్నికలకు ముందు రూ లక్ష కోట్ల స్కామ్ తీస్తా అన్నారు.. ఒక లక్ష కూడా తీయలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు . తెలంగాణ లో బిజెపి ఈ కార్య మోసపురిత సీఎం గా మిగిలిపోతారు ఈ సమావేశంలో బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వోల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మెదక్ జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా మోర్చా నాయకురాలు మల్లిక మెదక్ కౌన్సిలర్ పబ్బ రాజమణి లక్ష్మణ్ అఖిల భరత్ సర్పంచ్ శైలజ శ్రీనివాస్ మెదక్ జిల్లా బిజెపి కార్యదర్శి మహేశ్వరి మీడియా ఇన్చార్జి సంగీత మౌనిక లావణ్య విజయ్ పట్టణ అధ్యక్షులు నవీన్ ప్రసాద్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రామంపేట కౌన్సిలర్ శంకర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలికితీతకే పోటీలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పీఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి.. అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటి దాకా చేసిన పనులు వివరిస్తూ.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు.ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఆరుగురు ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హంట్ లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి.. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అన్ని విద్యాలయాలకు కావాల్సిన మరమ్మత్తుల వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచిందని, అన్ని విద్యాలయాల్లో కామన్ డైట్ మెనూ అమలు చేస్తుందని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తరగతి పుస్తకాలతో పాటు దిన పత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఆటలు లేదా ఏదైనా ఒక రంగంలో బాగా సాధన చేసి.. రాణించాలని పేర్కొన్నారు. పరిసరాల పై అవగాహన ఉండాలని, సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని సూచించారు. విలువైన సమయం వృథా చేయవద్దని వివరించారు. విద్యార్థులు అందరూ ఏ నేపథ్యం నుంచి వచ్చినా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని, మంచి స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, గురుకులాల డీసీఓ థెరిస్సా, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సిలివేరి లావణ్య, ప్రిన్సిపాల్ బీ పద్మ తదితరులు పాల్గొన్నారు.2
- పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో ఇలా పోతంగల్పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నూతనంగా రావటం జరిగింది. అయితే తాసిల్దార్ కార్యాలయంలో పది గంటల ఐదు నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10:00 తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10 30 నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉంది, 10 గంటల తర్వాత ఇద్దరు అటెండర్లు ఉండగా, 10:30 తర్వాత భూషణం అనే సిబ్బంది ఉన్నారు. మిగతా సిబ్బంది లేకపోవడంతో జనం వచ్చి పనుల కోసం, అధికారుల రాక కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తాసిల్దార్ కు ఫోన్లు వివరణ కోరగా పదిన్నర సమయంలో అందరూ ఉండాల్సి ఉంటుందని ఆఫీసులో ఎవరైనా ఉంటారు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆఫీసులో వెళుతున్న లైట్లు తిరుగుతున్న ఫ్యాన్లు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి విద్యుత్తు ఇలా వృధా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్న వర్షం కురిపించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నూతనంగా రావటం జరిగింది. అయితే తాసిల్దార్ కార్యాలయంలో పది గంటల ఐదు నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10:00 తర్వాత పరిస్థితి ఇలా ఉండగా 10 30 నిమిషాల తర్వాత పరిస్థితి ఇలా ఉంది, 10 గంటల తర్వాత ఇద్దరు అటెండర్లు ఉండగా, 10:30 తర్వాత భూషణం అనే సిబ్బంది ఉన్నారు. మిగతా సిబ్బంది లేకపోవడంతో జనం వచ్చి పనుల కోసం, అధికారుల రాక కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా తాసిల్దార్ కు ఫోన్లు వివరణ కోరగా పదిన్నర సమయంలో అందరూ ఉండాల్సి ఉంటుందని ఆఫీసులో ఎవరైనా ఉంటారు అని సమాధానం ఇవ్వడం జరిగింది. ఆఫీసులో వెళుతున్న లైట్లు తిరుగుతున్న ఫ్యాన్లు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి విద్యుత్తు ఇలా వృధా చేస్తే ఎలా అని పలువురు ప్రశ్న వర్షం కురిపించుకుంటున్నారు.4
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం.. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..1