గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సబ్ సెంటర్ లకు బీపీ యంత్రాల పంపిణీ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నడింపల్లి, రంగాపూర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు ‘మీ కోసం హెల్త్ & ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ’ ఆధ్వర్యంలో, ‘లైఫ్ సేవ్ కంపెనీ’ ఆర్థిక సహకారంతో బీపీ యంత్రాలు ఉచితంగా బుధ వారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ చౌహన్ మాట్లాడుతూ, “హైపర్టెన్షన్ సైలెంట్ కిల్లర్. గ్రామీణ ప్రజలు తరచూ బీపీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు” అన్నారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పెంపుతో పాటు, ముందస్తు జాగ్రత్తల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి సర్పంచ్ గోపి పద్మా అజయ్, రంగాపూర్ సర్పంచ్ సుజాత బాలు నాయక్, దర్గా తండా సర్పంచ్ శివ నాయక్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, యువకులు అఖిల్ రెడ్డి, కాట్రావత్ జ్యోతి, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సబ్ సెంటర్ లకు బీపీ యంత్రాల పంపిణీ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని నడింపల్లి, రంగాపూర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు ‘మీ కోసం హెల్త్ & ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ’ ఆధ్వర్యంలో, ‘లైఫ్ సేవ్ కంపెనీ’ ఆర్థిక సహకారంతో బీపీ యంత్రాలు ఉచితంగా బుధ వారం అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ చౌహన్ మాట్లాడుతూ, “హైపర్టెన్షన్ సైలెంట్ కిల్లర్. గ్రామీణ ప్రజలు తరచూ బీపీ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు” అన్నారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పెంపుతో పాటు, ముందస్తు జాగ్రత్తల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి సర్పంచ్ గోపి పద్మా అజయ్, రంగాపూర్ సర్పంచ్ సుజాత బాలు నాయక్, దర్గా తండా సర్పంచ్ శివ నాయక్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, యువకులు అఖిల్ రెడ్డి, కాట్రావత్ జ్యోతి, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- పెద్దపల్లి టాస్క్ సెంటర్లో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు..1
- ఉపాధి హామీ కూలీల హాజరు నమోదులో మల్దకల్ గ్రామ పంచాయతీ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వచ్చిన ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, 620 మంది కూలీల డేటాను నమోదు చేయడం ద్వారా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 9 మంది వర్కింగ్ మెట్ల కృషితో తెల్లవారుజామునే లక్ష్యాన్ని చేరుకోవడం గమనార్హం. కార్యదర్శి చొరవను జిల్లా అధికారులు అభినందించారు. సాంకేతిక వినియోగంలో మల్దకల్ ఆదర్శనీయమని ప్రశంసించారు. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.1
- బండిఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రహదారిలో డ్రైనేజీ కాలువలు పూడిపోవడంతో మరియు గుండా పుల్లయ్య ఇంటి వద్ద డ్రైనేజీ బ్లాక్ అవ్వడం వల్ల రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి, తక్షణమే కాలువల్లో పూడిక తీయించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1
- వరి పంట లో నూకలు చల్లడం వల్లన కలుపు నివారణ అవుతుంది1
- నాచారం కు చెందిన చెల్లా లక్ష్మీనారాయణ(72) రిటైర్డ్ ఉద్యోగి ఈరోజు ఉదయం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వచ్చి డిపాజిట్ స్లిప్ నింపుతుండగా స్ట్రోక్ రావడంతో కిందపపడిపోయిన లక్ష్మీనారాయణ. వెంటనే బ్యాంక్ సిబ్బంది 108 కు సమాచారం ఇవ్వడంతో..108 సిబ్బంది వచ్చి సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఓయూ పోలీసులు.1
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో నాగుపాముల సందడి నెలకొంది. సుబ్బయ్య కాలనీలోని శివ ఇంటి పరిసరాల్లో రెండు పాములు కనిపించడంతో స్నేక్ క్యాచర్స్ జగన్, కార్తీక్ రంగంలోకి దిగారు. గాయపడిన ఒక పాముకు తక్షణ వైద్యం అందించి, రెండింటినీ బుద్ధారం ఫారెస్ట్ ఏరియాలో వదిలేశారు. సమయానికి స్పందించి వన్యప్రాణులను సంరక్షించిన స్నేక్ క్యాచర్ల సాహసాన్ని గ్రామస్తులు కొనియాడారు3