logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

1 hr ago
user_Routhu srikanth
Routhu srikanth
నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago

నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.

More news from తెలంగాణ and nearby areas
  • నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    1
    నిత్యజీవితంలోని ఉరుకుల పురుగుల నుంచి ఒక్కరోజు విరామం తీసుకుని, సదాశివనగర్ మండలం వజ్జేపల్లి తాండా ప్రజలంతా కలిసి సరదాగా గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, గ్రామంలోని సుమారు 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేసి, గ్రామ సమీపంలో ఉన్న పంట చేనులో సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ వేడుక సాయంత్రం వరకు కొనసాగింది, వజ్జేపల్లి తాండా ప్రజలందరికీ ఈ సందడి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఆంజనేయులు తన ప్రసంగంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో ఆయన ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, సిద్ధాంతకర్త, ఉద్యమ మేధావి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలు, అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని, ఆయన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువలేనివని పేర్కొన్నారు.

ఆంజనేయులు తన ప్రసంగంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరించి, ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం "మన నీళ్లు – మన నిధులు – మన ఉద్యోగాలు" అనే నినాదంతో ఉద్యమాన్ని బలోపేతం చేసిన ప్రముఖుల్లో ఆయన ముందువరుసలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, నేడు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా జీవించిన జయశంకర్ సార్ పోరాటం, జీవితం యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కోకన్వీనర్ గడ్డమీది క్రిష్ణ గౌడ్, కౌన్సిలర్ దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, నాయకులు ఏనుగుల రాజు, ఇస్మాయిల్, సునీల్, బబ్లు, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    20 hrs ago
  • జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    3
    జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే తన సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది కూడా పాల్గొని యోగ సాధన చేశారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    3
    ఆదివారం వీర్నపల్లి మండల కేంద్రంలో సీఐటీయూ అనుబంధ రంగాల కార్మికుల విస్తృత స్థాయి సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని భవన నిర్మాణం, హమాలీ, గ్రామపంచాయతీ, ఆశా, బీడీ, విద్యుత్ మరియు అన్ని రంగాల కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా 15 మంది సభ్యులతో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సమావేశంలో మాట్లాడిన సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి కోడం రమణ, కేంద్ర బిజెపి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం కార్మిక చట్టాలను రద్దుచేసి, తమ కష్టంతో దేశానికే సంపదను సృష్టిస్తున్న కార్మికుల హక్కులను హరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రంగాల కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.

నూతనంగా ఎన్నికైన మండల కమిటీ నాయకులు వీర్నపల్లి మండలంలోని అన్ని రంగాల కార్మికులు, కష్టజీవులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ఉద్యమ పోరాటాలు నిర్వహించి వారికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ నూతన వీర్నపల్లి మండల కమిటీకి గుంటుకు నరేందర్ మండల కన్వీనర్​గా, ఈసంపేల్లి రాజెల్లయ్య, అన్నారం రాజేశం కో కన్వీనర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజెల్లయ్య, అంజయ్య, చంద్రయ్య, లింగయ్య, రాజు, కత్తిలాల్, శ్రీహరి, నర్సయ్య, మనోహర్, నవత, అనిత, లావణ్యలు మండల కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, వివిధ రంగాల యూనియన్ల నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తూప్రాన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ధాన్యం-బియ్యం లెక్కలపై కనీస అవగాహన లేకుండానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చిందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ధాన్యం నుంచి బియ్యం ఉత్పత్తి అయ్యే నిష్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రంపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వివరించాలని రఘునందన్‌రావు సూచించారు.
    1
    మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తూప్రాన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ధాన్యం-బియ్యం లెక్కలపై కనీస అవగాహన లేకుండానే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు అనుమతి ఇచ్చిందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ధాన్యం నుంచి బియ్యం ఉత్పత్తి అయ్యే నిష్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రంపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఆయన విమర్శించారు.

రైతుల ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వివరించాలని రఘునందన్‌రావు సూచించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    1
    రేగోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపల్ ప్రవీణ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజూ యోగా చేయాలని ఆమె సూచించారు.
    user_ఎనగండ్ల జైపాల్
    ఎనగండ్ల జైపాల్
    Regode, Medak•
    18 hrs ago
  • తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 29న జరగనున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ప్రతినిధి మిర్జాపురం రాహుల్ కూడా పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ జూన్ 21న జరిగింది. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29న ఆదిలాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ జిల్లా వరకు 101 కార్లతో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు ఉద్యమకారులు, ప్రాంతమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు గౌరవాన్ని ఆశిస్తున్నారని, దీనిని ప్రజలు కూడా ఆమోదంతో గ్రహించాలని ఆయన కోరారు. నలువైపుల నుంచి ఉద్యమకారులు తప్పకుండా హాజరై ఈ యాత్రను బ్రహ్మాండంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతను చాటాలని, భవిష్యత్తులోనూ ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    4
    తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 29న జరగనున్న విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆదివారం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ ప్రాంతానికి చెందిన ప్రతినిధి మిర్జాపురం రాహుల్ కూడా పాల్గొన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ జూన్ 21న జరిగింది.

ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 29న ఆదిలాబాద్ నుండి అలంపూర్ జోగులాంబ జిల్లా వరకు 101 కార్లతో నిర్వహించనున్న విజయ సంకల్ప యాత్రకు ఉద్యమకారులు, ప్రాంతమిత్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు గౌరవాన్ని ఆశిస్తున్నారని, దీనిని ప్రజలు కూడా ఆమోదంతో గ్రహించాలని ఆయన కోరారు. నలువైపుల నుంచి ఉద్యమకారులు తప్పకుండా హాజరై ఈ యాత్రను బ్రహ్మాండంగా నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతను చాటాలని, భవిష్యత్తులోనూ ఇదే పోరాట స్ఫూర్తితో ఉద్యమకారుల హక్కులను సాధిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
    user_RAHUL
    RAHUL
    బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం కోరెం గ్రామంలో, మంచి వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు అవుతున్నా వరుణ దేవుడు కరుణించకపోవడంతో, గ్రామ ప్రజలు కప్పతల్లి ఆట ఆడి గ్రామంలోని దేవాలయాల్లోని దేవతామూర్తులకు జలాభిషేకాలు చేశారు. అనంతరం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం కష్టాలు తొలగి, పంటలు బాగా పండాలని, చెరువులు, కుంటలు నిండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని దేవుళ్లను ప్రార్థించినట్లు తెలిపారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.