Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ విజయ సునీత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.మార్కాపురంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి మొత్తం 222 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 170, ఇతర అర్జీలు 52 వచ్చాయన్నారు
M. ADINARAYANA
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపిన కలెక్టర్ విజయ సునీత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వేగవంతంగా చేరవేస్తూ, వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.మార్కాపురంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి మొత్తం 222 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 170, ఇతర అర్జీలు 52 వచ్చాయన్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కనిగిరి నియోజకవర్గం లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.177 కోట్లతో తాగునీటి వసతుల అభివృద్ధి చేపడుతుండగా, జగనన్న లేఅవుట్, మోడల్ స్కూల్ పరిసరాల్లో రూ.4 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. 5.5 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా వెయ్యికి పైగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంతో పాటు, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో 11,500 ఇళ్లకు ఇంటింటికీ కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తూరు, కనిగిరి, కాశిరెడ్డి కాలనీ, ఎం.ఎన్.ఎం. కళాశాల సమీపంలో నాలుగు ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకులకు అనుమతులు మంజూరు కాగా, పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రామతీర్థం రిజర్వాయర్ నీటిని వినియోగించడంతో పాటు, భవిష్యత్లో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి కనిగిరి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు.1
- అల్లూరి జిల్లా కేంద్రంలో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ!! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లతో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాలతో కూడిన బ్యానర్ను ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నందీశ్వరునికి ప్రదోషకాల పూజలు. ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన నందీశ్వరునికి వేద పండితులు ప్రదోషకాలంలో విశేష అభిషేకాలు, అర్చనల పూజలను వేదోక్తంగా చేశారు. సోమవారం ఆషాడ బహుళ త్రయోదశి నంది ప్రదోషం సందర్బంగా దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో విశేషాభిషేకాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే గణపతిపూజ, ద్రవ్య పూజ పీఠార్చన,గంధం, పలురకాల చూర్ణాలతో అభిషేకించారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.1
- వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని కలెక్టరేట్లో ఆందోళన చేపట్టిన నిర్వాసితులు .మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసిత యువతీ యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకొని అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిర్వాసిత యువతి యువకులు వినకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన విరమించమన్నారు.1
- నిర్వాసితులకు పోలీసులకు మధ్య తోపులాటలతో తీవ్ర ఉత్రేక్త వాతావరణం .మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసిత యువతీ యువకులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకొని అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ నిర్వాసిత యువతి యువకులు వినకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పేంతవరకు నిరసన విరమించమన్నారు.1