కాంగ్రెస్ తోనే లౌకిక ప్రజాస్వామ్య మనుగడ అన్ని మతాలను సమానంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్. డి. విజయ జ్యోతి... కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలన్నారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి. కడప నగరంలో శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పనిచేయాలని, ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లాలోని కొప్పర్తి రెండవ దశ రూ.250 కోట్ల విలువైన మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాజెక్టును అమరావతి రాజధాని సీఆర్డీఏలో నెలకొల్పడం దారుణం అన్నారు. …MSME సంస్థ రెండవ దశ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించి ఉపయోగపడుతుందని అలాంటి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుతో సి ఆర్ డి ఏ కు తరలిస్తూ జీవో నెంబర్ 56 ను తీసుకురావడం అన్యాయమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా అభివృద్ధి దిశగా కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా రిమ్స్ వైద్యశాల, యోగి వేమన యూనివర్సిటీ ఏర్పాటు తదితర కార్యక్రమాలన్నీ చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటికి మూడుసార్లు ప్రారంభోత్సవం చేశారన్నారు కానీ ఇంతవరకు ప్రయోజనం లేదన్నారు. జమ్మూకాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపు పై పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి గారు పోరాటం చేసి తిరిగి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ కొండా సురేఖ విషయంలో ఆమె సమంత క్షమాపణ కోరిందన్నారు. ఇది ముందుగా కేటీఆర్ మాట్లాడిన అంశాలను బట్టి ఇంత మందితో దీని గురించి చర్చ వచ్చిందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదన్నారు. చిన్నపిల్లలు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారన్నారు. లౌకిక దేశానికి ఇది మంచిది కాదని ఆమె అన్నారు. విలేకరుల సమావేశంలో పిసిసి మాజీ ఉపాధ్యక్షులు బండి జకరయ్య, మాజీ పిసిసి కార్యదర్శి సిరాజుద్దీన్, మాజీ పార్లమెంటరీ ఇంచార్జీ సయ్యద్ గౌస్ పీర్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, మామిళ్ళ బాబు, మైనుద్దీన్ పాల్గొన్నారు *కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అయినా SK మైనుద్దీన్.* భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు SK మైనుద్దీన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మైనుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో భారత దేశ సమైక్యత మరియు సమగ్రత కాపాడడం కోసం శ్రీ రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కృషి చేస్తుండడం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రత్యేక హెూదా సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్పు చెందాలని P.C.C అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి పోరాట పటిమకు ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో చేరాను అని కొనియాడారు. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయ జ్యోతి గారైన మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మరింత బాధ్యతాయుతంగా పని చేయుటకు ఘర్ వాపసి అయిన నేను కడప జిల్లా లో ప్రధానమైన ఉక్కు పరిశ్రమ మరియు సాగు నీరు, త్రాగు నీరు లాంటి సమస్యస్యల పై ప్రజల ప్రక్షాళన పోరాటం చేస్తాము అని రాయలసీమను రతనాల సీమగా చూడటమే నా ప్రధాన ఎజెండా అని ఆవేదన వ్యక్తం చేసారు.
కాంగ్రెస్ తోనే లౌకిక ప్రజాస్వామ్య మనుగడ అన్ని మతాలను సమానంగా చూడాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్. డి. విజయ జ్యోతి... కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలన్నారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి. కడప నగరంలో శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పనిచేయాలని, ప్రజల కోరికలు నెరవేర్చాలని ఆ దిశగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లాలోని కొప్పర్తి రెండవ దశ రూ.250 కోట్ల విలువైన మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రాజెక్టును అమరావతి రాజధాని సీఆర్డీఏలో నెలకొల్పడం దారుణం అన్నారు. …MSME సంస్థ రెండవ దశ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభించి ఉపయోగపడుతుందని అలాంటి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపుతో సి ఆర్ డి ఏ కు తరలిస్తూ జీవో నెంబర్ 56 ను తీసుకురావడం అన్యాయమన్నారు. ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాల ద్వారా అభివృద్ధి దిశగా కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా రిమ్స్ వైద్యశాల, యోగి వేమన యూనివర్సిటీ ఏర్పాటు తదితర కార్యక్రమాలన్నీ చేశారన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటికి మూడుసార్లు ప్రారంభోత్సవం చేశారన్నారు కానీ ఇంతవరకు ప్రయోజనం లేదన్నారు. జమ్మూకాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగులు తొలగింపు పై పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి గారు పోరాటం చేసి తిరిగి వారికి ఉద్యోగాలు వచ్చేలా చేశారన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ కొండా సురేఖ విషయంలో ఆమె సమంత క్షమాపణ కోరిందన్నారు. ఇది ముందుగా కేటీఆర్ మాట్లాడిన అంశాలను బట్టి ఇంత మందితో దీని గురించి చర్చ వచ్చిందన్నారు. ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదన్నారు. చిన్నపిల్లలు కూడా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారన్నారు. లౌకిక దేశానికి ఇది మంచిది కాదని ఆమె అన్నారు. విలేకరుల సమావేశంలో పిసిసి మాజీ ఉపాధ్యక్షులు బండి జకరయ్య, మాజీ పిసిసి కార్యదర్శి సిరాజుద్దీన్, మాజీ పార్లమెంటరీ ఇంచార్జీ సయ్యద్ గౌస్ పీర్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, మామిళ్ళ బాబు, మైనుద్దీన్ పాల్గొన్నారు *కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అయినా SK మైనుద్దీన్.* భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, మరియు ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు SK మైనుద్దీన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో "ఘర్ వాపసి" అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మైనుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో భారత దేశ సమైక్యత మరియు సమగ్రత కాపాడడం కోసం శ్రీ రాహుల్ గాంధీ గారు అహర్నిశలు కృషి చేస్తుండడం మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రత్యేక హెూదా సాధించి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్పు చెందాలని P.C.C అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి గారి పోరాట పటిమకు ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో చేరాను అని కొనియాడారు. ప్రస్తుతం కడప జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయ జ్యోతి గారైన మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో మరింత బాధ్యతాయుతంగా పని చేయుటకు ఘర్ వాపసి అయిన నేను కడప జిల్లా లో ప్రధానమైన ఉక్కు పరిశ్రమ మరియు సాగు నీరు, త్రాగు నీరు లాంటి సమస్యస్యల పై ప్రజల ప్రక్షాళన పోరాటం చేస్తాము అని రాయలసీమను రతనాల సీమగా చూడటమే నా ప్రధాన ఎజెండా అని ఆవేదన వ్యక్తం చేసారు.
- కోలాటం చిన్నయ్య గారి పల్లె1
- ఇది కొలికపూడి గారి ప్రభంజనం...1
- విజయనిర్మల గారి ఇంద్రభవనం ఇప్పుడు ఎలా ఉందో చూసేయండి1
- హీరోయిన్ రవళి గారి కూతురు చేస్తున్న మినీ వంట చూడండి...1
- ఊసరవెల్లి కూడా సిగ్గు పడేవిధంగా ఉంటుది బాబు గారి నైజం1
- అలనాటి నటి గీతాంజలి గారి ఇల్లు ఎలా ఉందో చూద్దాం రండి1
- నేను ఇష్టపడే అభిమానం హీరో Akkineni Nagarjuna గారు Pawan Kalyan గారి గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సో మచ్ నాగార్జున గారు1
- రాజేంద్ర ప్రసాద్ గారి కూతురికి హార్ట్ ఎటాక్ రావడానికి కారణం...1