మహబూబాబాద్ జిల్లా బేతోలులో ఘనంగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామం లో బుధవారం ప్రపంచ శాంతి మానవళికి సమానత్వం, దయ ధర్మ సత్యం నిజాయితీ శాంతి సందేశాన్ని బోధించిన ప్రవక్త హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) 1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ. భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పాయసం పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహే వసల్లం) బోధనలు మానవాళికి మార్గదర్శకం ఆయన చూపిన మార్గం శాంతి ప్రేమ సమానత్వం సహనానికి ప్రతీక మన జీవితాల్లో ఆయన బోధనలను ఆచరిస్తే ప్రపంచం స్వర్గంలో మారుతుంది మత సామరస్యంతో పౌరస్వర గౌరవంతో మన గ్రామాన్ని దేశాన్ని అభివృద్ధి చేద్దాం ప్రతి ఒక్కరూ పరులకు సహాయం చేయాలి అదే ప్రవక్త చూపిన సత్యమార్గం అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా షేక్ ఖాదర్ బాబా మాట్లాడుతూ ఒక్క విగ్రహము లేదు ఒక చిత్రపటం లేదు ఆయన గురించి 1500 ఏండ్లు గడిచిపోయిన ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న హృదయ విజేత మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు. ప్రపంచ శాంతికి మానవాళి మేలుకోసం ప్రవక్త మహమ్మద్ గారు చూపిన ప్రేమ శాంతి ధర్మం మార్గంలో నడవడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి వారి బోధనలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ అందరితో ప్రేమగా మెలుగుతూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం ఖాదర్ బాబా అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్, షేక్ యాకూబ్, షేక్ బాబా, మహమ్మద్ యూసుఫ్, షేక్ పాష, మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ ఫయాజ్, షేక్ జానీ మియా,
మహబూబాబాద్ జిల్లా బేతోలులో ఘనంగా హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు.. మహబూబాబాద్ మున్సిపాలిటీ 6వ వార్డు బేతోలు గ్రామం లో బుధవారం ప్రపంచ శాంతి మానవళికి సమానత్వం, దయ ధర్మ సత్యం నిజాయితీ శాంతి సందేశాన్ని బోధించిన ప్రవక్త హజరత్ మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) 1448వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక జరుపుకునే పూర్వదిన ఈద్-ఏ-మిలాద్-ఉన్- నబీ. భక్తి ప్రపత్తులతో ఈ పవిత్రమైన పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలు పాయసం పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ముస్లిం మత పెద్ద షేక్ యూసుఫ్ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహే వసల్లం) బోధనలు మానవాళికి మార్గదర్శకం ఆయన చూపిన మార్గం శాంతి ప్రేమ సమానత్వం సహనానికి ప్రతీక మన జీవితాల్లో ఆయన బోధనలను ఆచరిస్తే ప్రపంచం స్వర్గంలో మారుతుంది మత సామరస్యంతో పౌరస్వర గౌరవంతో మన గ్రామాన్ని దేశాన్ని అభివృద్ధి చేద్దాం ప్రతి ఒక్కరూ పరులకు సహాయం చేయాలి అదే ప్రవక్త చూపిన సత్యమార్గం అన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా షేక్ ఖాదర్ బాబా మాట్లాడుతూ ఒక్క విగ్రహము లేదు ఒక చిత్రపటం లేదు ఆయన గురించి 1500 ఏండ్లు గడిచిపోయిన ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న హృదయ విజేత మహమ్మద్ ప్రవక్త అని కొనియాడారు. ప్రపంచ శాంతికి మానవాళి మేలుకోసం ప్రవక్త మహమ్మద్ గారు చూపిన ప్రేమ శాంతి ధర్మం మార్గంలో నడవడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి వారి బోధనలను మన దైనందిన జీవితంలో ఆచరిస్తూ అందరితో ప్రేమగా మెలుగుతూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేద్దాం ఖాదర్ బాబా అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ఫకీర్, షేక్ యాకూబ్, షేక్ బాబా, మహమ్మద్ యూసుఫ్, షేక్ పాష, మహమ్మద్ ఇర్ఫాన్, షేక్ ఫయాజ్, షేక్ జానీ మియా,
- ఎమ్మెల్యే రామచందర్ నాయక్పై అసత్య ప్రచారం మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్.. నరసింహుల పేట మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... కొంతమంది కావాలనే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ ను అవమానపరిచే విధంగా సోషల్ మీడియాలో ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తూ అగౌరవపరుస్తున్నారని నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్, జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే రామచందర్ నాయక్ కు ఇసుక ట్రాక్టర్లు లేవని, ఎలాంటి వ్యాపారాలు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. గతంలో అక్రమ వ్యాపారాలు, అక్రమ కార్యకలాపాలకు పాల్పడింది ఎవరు? ప్రజలకు అన్నీ తెలుసని, గత చరిత్రను ఒకసారి ప్రజల ముందు ఉంచితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చిర్ర సతీష్ గౌడ్ అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను మానుకుని, ఆధారాలతో మాట్లాడాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడిపై అసత్య ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, నిరాధార ఆరోపణలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని చిర్ర సతీష్ గౌడ్ హెచ్చరించారు. రాజకీయ విమర్శలు ఉంటే ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.1
- మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం..? కొండా మురళీ స్పష్టం భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు.మా కూతురు వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.క్రమశిక్షణ కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.1
- కమలాపూర్లో కొండచిలువ కలకలం.. సురక్షితంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వ్యవసాయ పొలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు భయాందోళనకు గురై వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువను పట్టుకునేందుకు జాగ్రత్తగా చర్యలు చేపట్టి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం కొండచిలువను జూ పార్క్కు తరలించారు. వ్యవసాయ పొలాల్లో కొండచిలువ కనిపించడంతో రైతులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ప్రమాదం జరగలేదు.2
- మాజీ మంత్రి కాసు మాతృమూర్తి శేషమ్మకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులు హైదరాబాద్ (ఆగస్టు 26): మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దివంగత కాసు వెంగళరెడ్డి సతీమణి, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తల్లి, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి నాయనమ్మ అయిన కాసు శేషమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జేఆర్సీ (JRC) కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నిర్వహించిన శేషమ్మ గారి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన శేషమ్మ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాసు వెంకట కృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.3
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.1